ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో హాల్లో ఈ రోజు వివిధ సంక్షేమ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డా. రామచంద్రు నాయక్ హాజరై, పలు పథకాలు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన సామాన్య ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతుందన్నారు,ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,” అన్నారు, కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులు 74 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద స్థలల పట్టాలు 258 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఇల్లు కట్టుకునే వారికి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు, గోడలు కట్టినాక లక్ష రూపాయలు,స్లాప్ లెవెల్ లక్ష రూపాయలు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందన్నారు,కల్లు గీత కార్మికులకు 82 కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీమెకుల కిట్టు పంపిణీ చేశారు,రాజీవ్ యువ వికాసo ద్వారా యువతకు వ్యాపార రంగంలో, ఇతర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహమూర్తి,స్థానిక ఎమ్మార్వో కృష్ణవేణి,ఎంపీడీవో విజయ,ఎంపీఓ సొమ్లాల్,ఆర్ఐ శరత్ గౌడ్, మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు జిల్లా నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి పంపిణీ.!

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను.!

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే మంజూరు చేయాలి.

మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి

నాగారం నేటిదాద్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే పేద ప్రజలకు మళ్లీ అందించాల్సిందిగా కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు మరియు కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల ఇరువురి పార్టీల సమన్వయలోపం వల్ల చెక్కుల పంపిణీ సమయానికి మంజూరు చేయకపోవడంతో ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీవో గారికి తెలియజేశారు
ఈ విషయంపై ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఎమ్మార్వోలకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బుద్దవరం లక్ష్మీ, మరియు నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దేవరకద్ర /నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version