చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు మొగుళ్లపల్లి
నేటి ధాత్రి భూపాలపల్లి
జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు హాజరై పాలక వర్గ సభ్యులు అలాగే స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పాలకవర్గం కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ అన్నారు రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు
