వనపర్తి లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో ఆర్యవైశ్యులు…

వనపర్తి లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిదాత్రి .

 

 

జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర తెలుగు రాష్ట్రాల అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు వనపర్తి ఆర్యవైశ్యులు ఘనంగా జరుపుకున్నారున్ ఈ సందర్భంగా పట్టణ వర్ధక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం కొరకు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సాధించిన ఆర్యవైశ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములకు ఆర్యవైశ్యుల తరఫున నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వర్ధక సంఘం నేతలు దోమ శివ కొండ కిషోర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం వై వెంకటేష్ ఏపూరి శ్రీనివాసులు కండికొండ సాయిరాం ఎస్ ఎల్ ఎన్ రమేష్ కాలూరి శ్రీనివాసులు శెట్టి చుక్కయ్య శెట్టి చవ్వ పండరయ్య మారం గోవింద్ గుప్త బొడ్డు శంకర్ మహిళా సంఘము అధ్యక్షురాలు పిన్నం వసంత కొంపల రజిత తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర స్టీల్ గ్రిల్స్ లైటింగ్ గెట్ ఏర్పాటు చేయించాలని మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి రమేష్ ను వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ కోరారు

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుడు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి ఘన నివాళులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుడు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి ఘన నివాళులు.*

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జహీరాబాద్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ అమర వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన జహీరాబాద్ ముద్దుబిడ్డ సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్. పెద్దగొల్ల నారాయణ హాజరై అమర వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధన కోసం సామాజిక న్యాయం దిశగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. రెండు సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ అమర వీరులు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ , మరియు న్యాలకల్ మండలం బసంత్‌పూర్ గ్రామానికి చెందిన ఈశాన్ రెడ్డి ల స్ఫూర్తి విగ్రహాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను స్మరించుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న అమరుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కొండపురం నర్సిములు అన్నారు. హోతి (బి) గ్రామంలో సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ విగ్రహం, అలాగే బసంత్‌పూర్ గ్రామంలో ఈశాన్ రెడ్డి ల విగ్రహం ఏర్పాటు చేసి, ప్రభుత్వం అధికారికంగా గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షులు కొండపురం నర్సింలు ,ప్రధాన కార్యదర్శి శంకర్ సాగర్, విశ్వనాథ్ యాదవ్,మదినం శివ ప్రసాద్, వడ్డే శేఖర్, బీసీ మైనారిటీ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, చెన్న బసవ, సంగారెడ్డి , బాలకృష్ణ, దశరథ్ ప్యార్లా, రాజ్ తుముకుంట, రాజీవ్ కుమార్, విజయ్ కుమార్, గొల్ల నర్సింలు ,తదితరులు పాల్గొని అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ..

కాశిబుగ్గలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, కాశిబుగ్గ

 

వరంగల్ కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బిల్ల శివ శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ తొలి అమరుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ముదిరాజ్ అర్బన్ అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్ హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 1, 2025 సోమవారం ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపంకి నివాళులర్పించడానికి ముదిరాజ్ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గౌరబోయిన తిరుపతి ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేశబోయిన దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కూరాకుల చంద్రశేఖర్ ముదిరాజ్, కార్యదర్శి కోడారి నవీన్ ముదిరాజ్, ఆర్గనైజర్ వన్నాల రాజు ముదిరాజ్, కొడారి చిన్న రాజు ముదిరాజ్, చెలక లపెల్లి రాజు ముదిరాజ్, కేశబోయిన రాజు ముదిరాజ్, కేశబోయిన కరుణాకర్ ముదిరాజ్, కేశబోయిన దేవరాజ్ ముదిరాజ్, వన్నాల శంకర్ ముదిరాజ్, బండి బిక్షపతి ముదిరాజ్, వన్నాల వినయ్, కేశబోయిన పవన్ ముదిరాజ్, కేశబోయిన రంజిత్ ముదిరాజ్, గుండ్ర సాయి వర్ధన్ ముదిరాజ్, మరియు కాశిబుగ్గ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి..

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ జయంతి సందర్భంగా ఇంద్ర గాంధీ విగ్రహానికి నర్సంపేట టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే నాయకురాలు, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని దేశం స్మరించుకుంటూ దాని ప్రజాహితమే పరమ ధర్మంగా భావించి, కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళగా ఆమె భారత రాజకీయాలకు చెరగని ముద్ర వేశారని గ్రీన్ రివల్యూషన్‌ నుండి పేదల సంక్షేమ పథకాల దాకా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన శక్తి ఆమెదే.
దేశ ఐక్యత, భద్రత, మహిళ సాధికారత కోసం చేసిన ఆమె సేవలు నేటికీ ప్రజలకు ప్రేరణ ఇంద్ర గాంధీ సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కుసుమ చెన్నకేశవులు ,కొల్లు వెంకటసుబ్బారెడ్డి, రామలింగేశ్వర ఆలయ చైర్మన్, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, మెరుగు విజయ్ ,గంధం సుధాకర్ ,మహమ్మద్ అన్వర్, ప్రభాకర్, రావుల మహిపాల్ రెడ్డి ,సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, తదితరులు పాల్గొన్నారు.

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ….

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశికృష్ణ.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ మాట్లాడుతూ పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు… నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల నాయకులు గుమ్మడి సత్యనారాయణ, అరెపెల్లి మల్లయ్య, అరెపల్లి నర్సింహారాములు, ఆకుల రవీందర్, శనిగరపు మొగిలి యూత్ నాయకులు అల్లం రాజు ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version