లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తులసి అర్చన

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తులసి అర్చన

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తాండూరి రామాచార్యులు, ఫణిందర్ విష్ణులు బ్రహ్మాండ వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక తులసి అర్చన నిర్వహించారు.

 

 

ఈ తులసి అర్చన కార్యక్రమంలో స్థానికులు జిల్లా కాంగ్రెస్ నాయకుడు, కొమ్మాల మాజీ ఉపసర్పంచ్ సాయిలి ప్రభాకర్,లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అమర్ సింగ్ నాయక్,దశ్రుతండా మాజీ సర్పంచ్ కేలత్ స్వామి,భక్తులు మాడిశెట్టి శ్రీనివాస్,గాదం మల్లయ్య భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version