ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి…

ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి

మహాదేవపూర్నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలో
కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోడి.
రమేష్ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ కాళోజి నారాయణరావు కవిత్వంతో సాహిత్యంతో మాటల ప్రజలను చైతన్య పరిచారు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుక వినిపించేవారు పుట్టుక నీది చావు నీది మిగిలిన జీవితమంతా దేశానిది అదేవిధంగాఆకలి మంటలు ఒకచోట అన్నపురాసులు ఒకచోట అని ప్రజలని చైతన్యపరిచేవారు కాళోజి నారాయణరావు నా గొడవఅనే రచన ద్వారా అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుకను వినిపించేవారు ఈ విధమైన రచనలు రచించినందుకుగాను ప్రభుత్వం ఆయనను 1992 సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కరించారు కాలోజి నారాయణరావు ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని సమాజంలో పాలకులను తన కవిత్వం ద్వారా మాటల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమాజంలో జరిగే అన్యాయం పైన పోరాటాలు చేశారు అని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అబ్దుల్ గని,సమ్మయ్య సదాశివ్ . సదానందం,సంధ్య . శ్రీమతి శ్వేత . శ్రీమతి రమాదేవి. శ్రీనివాస్ మహేందర్,కర్ణ ప్రకాష,మహేష్ లైబ్రేరియన్ అనిల్ విద్యార్థిని విద్యార్థులు బోధన సిబ్బంది పాల్గొన్నారు

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్‌ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ
“తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు”
అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ,
అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.

సహజకవి అందెశ్రీ కి ఘన నివాళి.

సహజకవి అందెశ్రీ కి ఘన నివాళి.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం లోని చల్లగరిగ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా లో సామాజిక కార్యకర్త, అంబెడ్కర్ ఫేలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ గారి ఆధ్వర్యంలో , స్వర్గియ,డాక్టర్ అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చల్లగరిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిఆర్ టియు చిట్యాల మండలం అధ్యక్షులు శ్రీ బండి శ్రీనివాస్ పాల్గొని అందెశ్రీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు…. అనంతరం ప్రసంగిస్తూ
అందెశ్రీ గారిని ప్రకృతి కవిగా అభివర్ణించారు,అయన తెలంగాణ మలి దశ ఉద్యమ పాటలు వ్రాసి, పాడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి, తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించినారు , తను వ్రాసిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను ప్రభుత్వం గుర్తించి ప్రార్థన గీతంగా ఆలపిస్తున్నారాని ఆయన గురించి కొనియాడారు… ఈ కార్యక్రమంలో మాజీ జంక్ ఎస్ ఏం సి ఛైర్మన్ మ్యాదరి వీరాస్వామి, యూత్ నాయకులు కొల్లూరి అశోక్, రామస్వామి, సోమిడి రఘుపతి, ఎస్.వెంకటప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version