యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి…

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్స్ అని టిడిపి వేములవాడ కమిటీ సభ్యులు, టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటి,విద్య శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని,తెలుగుజాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బడుగులు, బలహీనులు, పేదలు, మహిళలు, యువకులు, రైతులు వారి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకుంటూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడువేల ముఫ్ఫైరెండు కిలోమీటర్లు తోంభైఏడు నియోజకవర్గాలు రెండువేల తోంభైనాలుగు గ్రామాలు ఒకటిన్నర కోట్ల మంది గుండె తలుపులను తడుతూ ఆనాడు మంత్రి నారా లోకేష్ యువగళం సాగిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి యువగళం గేమ్ చెంజర్ గా పని చేసిందన్నారు.

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5వార్డు యాదవ కాలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఇటీవల కోరడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల కోరిక మేరకు నూతన విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను వేయించడం జరిగింది అలాగే సీట్ లైట్లను ఏర్పాటు చేసి వాటిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను కావున భూపాలపల్లి ప్రజలు ఆలోచించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లిని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతులకు సన్నబడ్లకు 500 బోనసు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కావున ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడత సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ విజయ్ ఉడత మహేందర్ కాలనీవాసులు పాల్గొన్నారు

క్వార్టర్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలి.

క్వార్టర్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

గత 20 సంవత్సరాలుగా, నివాసం ఉంటున్న క్వార్టర్ను, కూల్చివేసి, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న దోనుగు లక్ష్మీపై చర్యలు తీసుకొని, నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని సంబంధిత అధికారులు ఆపాలని, బొడ్డేల శంకర్ డిమాండ్ చేశారు.
సోమవారం బెల్లంపల్లి టేకుల బస్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
బూడిదగడ్డ బస్తీలోని క్వార్టర్ నంబర్ 290 లో, దోనుగు లక్ష్మి భర్త పదవి విరమణ చేసి, క్వార్టర్ కాళీ చేసి గోదావరిఖని వెళ్లి పోయి నివసిస్తున్నారని, అనంతరం వేరే వారి పేరుపై క్వార్టర్ను చేయించి, మా అన్న తో సహా గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, మా అన్న మరణించిన అనంతరం నేను ఒక్కడినే క్వార్టర్ లో ఉంటున్నానని, ఇరవై ఏళ్ళ క్రితం సింగరేణికి అప్పజెప్పి గోదావరిఖని లో నివాసముంటున్న దొణుగు లక్ష్మి అనే మహిళ, ఆమె ఇల్లు ఆమెకు ఉండగా, నా ఇంటిపై ఆశతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, నిర్దాక్షిణ్యంగా నా ఇంటిని పోలీసుల పహారాలో జేసీబీ తో కూల్చివేసి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని వాపోయాడు. నాకు వెనకా ముందు ఎవ్వరూ లేకపోవడంతో, నన్ను వేధింపులకు గురి చేస్తూ, నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారనీ, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు గొడవలు సద్దుమణిగే వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాన్ని ఆపివేయాలని ఆదేశించినా, స్థానిక మున్సిపల్ అధికారులు లక్ష్మి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. సంబంధిత అధికారులు తమకు క్వార్టర్ స్థలాన్ని ఇప్పించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
తమకు న్యాయం చేయకుంటే అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుంటానని, దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించాడు..

మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం…

మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం..

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

గ్రామంలో మద్యపానాన్ని నిషేధించి తీర్మానం చేసి స్థానిక ఎస్సై కి అందజేశారు. నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేసి స్థానిక ఎస్ఐ రాజేష్ కి సర్పంచ్ మంగిలిపల్లి మంజుల రమేష్ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వర్ణలత రాములు, పాలకవర్గ సభ్యులు మంగిలి పల్లి యాదగిరి, దొమ్మాట రాజు, ఆంబోతు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు…

చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

నిజాంపేట: నేటి ధాత్రి

చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ తిరుమల నాథ స్వామి ఆలయం లో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చల్మెడ గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, బండ్ల ఊరేగింపు, రథం తిరుగుట, పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం చక్రస్నానంతో ముగింపు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరిపై స్వామి వారి దయ, కృప, కటాక్షాలు ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, కాకి రాజయ్య ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఎంఐఎం లో యువ నాయకులు చెరిక…

ఎంఐఎం లో యువ నాయకులు చెరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ కు చెందిన పలువురు అభిమానులు ఆయా పార్టీల సీనియర్ నాయకులు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో కండువా కప్పుకొని ఎంఐఎం పార్టీలో చెరినట్లు, ఎంఐఎం కోహీర్ అద్యక్షులు మొహమ్మద్.రఫీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. కోహిర్ మున్సిపాల్ ఎన్నికలలో పార్టీని బలపరిచి జండా ఎగరవేస్తామన్నారు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ బలోపేతానికి ప్రతి సైనికుడు కష్టపడి పనిచేయాలని సూచించారు

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి…

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్
జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో నిరుపేదలకు ఇల్లు మంజూరు అయినా, చాలా మంది ఆర్థిక సమస్యల మూలంగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొలతలు కూడా కొంత తగ్గించాలని,అదేవిదంగా ఎస్సి, ఎస్టీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ, మలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

ఓసి- జేఏసీ ఈడబ్ల్యూసి శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు..

ఓసి- జేఏసీ ఈడబ్ల్యూసి శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

ఓసి-జేఏసీ-ఈడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు నియమితులయ్యారు. మదినగూడ లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి వినోద్ రావుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్ల సంజీవ రెడ్డి మాట్లాడుతూ అగ్రకులాల్లోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా ఓయూ జేఏసీ ఏర్పడిందని అన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ సింహగర్జనను భారీ విజయవంతం చేసిన ఓసిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అగ్రకుల సంఘాల నాయకులందరూ ఏకమై ఓసీల్లోని నిరుపేదల హక్కులే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలోని అన్ని వర్గాల వారితో మంచి సత్సంబంధాలు కలిగిన వినోద్ రావుని ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా నిర్ణయించడం కావాలి జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ.. 1986 నుంచి తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశానని అన్నారు. హైదరాబాద్ కి వచ్చాక తన మిత్రుడు ప్రస్తుత కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ద్వారా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కు దగ్గర అయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశానని తెలిపారు. 2002లో శేరిలింగంపల్లి సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ YSR పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో నాటి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రంగారెడ్డి జిల్లా సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని, ఆ తర్వాత గ్రేటర్ సేవాదళ్ చైర్మన్ గా సేవలందించాలని తెలిపారు. అదేవిధంగా మదినగూడ గ్రామంలో హనుమాన్ దేవాలయం చైర్మన్ గా ఆలయ పునర్నిర్మాణం లో కీలక భూమిక పోషించానని అన్నారు. ఈ క్రమంలోనే నా పనితీరును గుర్తించి ఓసీ జేఏసీ ఈడబ్ల్యూఎస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం నన్ను రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్షుడిగా తీసుకొని శేరిలింగంపల్లి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని అన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గంలో ఉన్న ఓసి కులాల్లోని నిరుపేదల అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఓసీలలో 10% మాత్రమే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఉన్నారని మిగిలిన 90 శాతం మంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా అగ్రకులాల్లోని నిరుపేద విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్య ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడిన ఓసి వర్గాల్లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వారి హక్కుల కోసం పోరాడేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓ సి జె ఎస్ సి మహా ధర్నాను విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి అగ్రకుల నిరుపేదలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి జెఎసి రాష్ట్ర కార్యదర్శిలు కొడాలి శ్రీధర్, శేరి అంతిరెడ్డి, విద్యాసాగర్ సభ్యులు దండమూరి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య…

పాఠశాలలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో మంగల్గి బక్కారెడ్డి (40) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన బక్కారెడ్డి, సోమవారం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతికారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక మామిడి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆస్తులు లేకపోవడం, పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతని అన్న జగన్నాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి…

ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి

మహాదేవపూర్నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలో
కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోడి.
రమేష్ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ కాళోజి నారాయణరావు కవిత్వంతో సాహిత్యంతో మాటల ప్రజలను చైతన్య పరిచారు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుక వినిపించేవారు పుట్టుక నీది చావు నీది మిగిలిన జీవితమంతా దేశానిది అదేవిధంగాఆకలి మంటలు ఒకచోట అన్నపురాసులు ఒకచోట అని ప్రజలని చైతన్యపరిచేవారు కాళోజి నారాయణరావు నా గొడవఅనే రచన ద్వారా అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుకను వినిపించేవారు ఈ విధమైన రచనలు రచించినందుకుగాను ప్రభుత్వం ఆయనను 1992 సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కరించారు కాలోజి నారాయణరావు ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని సమాజంలో పాలకులను తన కవిత్వం ద్వారా మాటల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమాజంలో జరిగే అన్యాయం పైన పోరాటాలు చేశారు అని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అబ్దుల్ గని,సమ్మయ్య సదాశివ్ . సదానందం,సంధ్య . శ్రీమతి శ్వేత . శ్రీమతి రమాదేవి. శ్రీనివాస్ మహేందర్,కర్ణ ప్రకాష,మహేష్ లైబ్రేరియన్ అనిల్ విద్యార్థిని విద్యార్థులు బోధన సిబ్బంది పాల్గొన్నారు

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్‌ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ
“తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు”
అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ,
అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.

సహజకవి అందెశ్రీ కి ఘన నివాళి.

సహజకవి అందెశ్రీ కి ఘన నివాళి.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం లోని చల్లగరిగ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా లో సామాజిక కార్యకర్త, అంబెడ్కర్ ఫేలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ గారి ఆధ్వర్యంలో , స్వర్గియ,డాక్టర్ అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చల్లగరిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిఆర్ టియు చిట్యాల మండలం అధ్యక్షులు శ్రీ బండి శ్రీనివాస్ పాల్గొని అందెశ్రీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు…. అనంతరం ప్రసంగిస్తూ
అందెశ్రీ గారిని ప్రకృతి కవిగా అభివర్ణించారు,అయన తెలంగాణ మలి దశ ఉద్యమ పాటలు వ్రాసి, పాడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి, తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించినారు , తను వ్రాసిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను ప్రభుత్వం గుర్తించి ప్రార్థన గీతంగా ఆలపిస్తున్నారాని ఆయన గురించి కొనియాడారు… ఈ కార్యక్రమంలో మాజీ జంక్ ఎస్ ఏం సి ఛైర్మన్ మ్యాదరి వీరాస్వామి, యూత్ నాయకులు కొల్లూరి అశోక్, రామస్వామి, సోమిడి రఘుపతి, ఎస్.వెంకటప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version