నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5వార్డు యాదవ కాలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఇటీవల కోరడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల కోరిక మేరకు నూతన విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను వేయించడం జరిగింది అలాగే సీట్ లైట్లను ఏర్పాటు చేసి వాటిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను కావున భూపాలపల్లి ప్రజలు ఆలోచించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లిని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతులకు సన్నబడ్లకు 500 బోనసు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కావున ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడత సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ విజయ్ ఉడత మహేందర్ కాలనీవాసులు పాల్గొన్నారు
