మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ వీక్ మదర్ హుడ్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మహిళలు గర్భధారణ సమయంలో ప్రసవానంతర కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యమన్నారు.మాటర్నల్ సేఫ్టీ అనేది తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది అని తెలిపారు.గర్భిణీ స్త్రీలు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం,పోషకాహారం తీసుకోవడం,వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవం సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని,ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సూచనలను గౌరవించాలని కోరారు.గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను ఉపయోగించుకుని సురక్షిత మాతృత్వాన్ని సాధించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు,సిటీ స్కాన్ ఏర్పాటు చేశామని, ఎమ్.ఆర్.ఐ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం కలెక్టర్ తో కలిసి ఆసుపత్రిలో ప్రతి వార్డు సందర్శించి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు కల్పించాలని,ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూపరెండెంట్ కి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ డి.ఎం.ఎచ్.ఓ డా. మధుసూదన్ ఆసుపత్రి సూపరెండెంట్ డా.రాజేంద్ర ప్రసాద్ వైద్య అధికారులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version