బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రామ మాజీ సర్పంచ్

బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రామ మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో శనివారము బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో తుమ్మనపల్లి తాజా మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం అన్నారు.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని బర్దీపూర్ ఆశ్రమంలో గత నలభై రోజులుగా . డా.సిద్ధేశ్వర అవదూత గిరి మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారుద్ర యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అని ఈ సందర్భంగా మేధపల్లి తాజ్ మాజీ సర్పంచ్ పరమేశ్వర పాటిల్.మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసా శక్తుల పీడ నివారణకై.చేపడుతున్న ఇట్టి యజ్ఞంలో పాల్గొనడం తో చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి యజ్ఞాలు మరిన్ని చేయాలని దేశ సైనికులకు ప్రజలకు శాంతీ సౌభాగ్యం కలిగించాలని శత్రు పీడ నశించాలి అని లోక కళ్యాణఅర్థం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి.!

మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి అక్రమంగా ముందస్తు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శివరాజ్ శ్రీకాంత్ రెడ్డిలను శుక్రవారం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్బంధాలతో, అక్రమంగా హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసినారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో
– మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం
– కేకే సిరిసిల్ల వాసి
– గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు

సిరిసిల్ల:(నేటి ధాత్రి)

బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్ల మధు నువ్వు నిన్న మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని, భేషరతుగా కెకె మహేందర్ రెడ్డి అన్నకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అర్హతకు, ( పరిధికి ) మించి మాట్లాడొద్దని అన్నారు.
పెద్దవారిని విమర్శిస్తే పెద్దొనివైతవని భ్రమలో మాట్లాడుతున్నావని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి పుణ్యమే సిరిసిల్ల నియోజకవర్గం, కెకె మహేందర్ ప్రతి ఇంటి,ఇంటికి గులాబి జెండాని, తెలంగాణ నినాదాన్ని పరిచయం చేసిందని అన్నారు.
నీకు తెల్వకపోతే కేటీఆర్, కేసీఆర్ లను అడుగని అన్నారు.
10 సంవత్సరాల కాలంలో మల్కపేట రిజర్వాయర్ లో నీళ్ళు నింపలేని చాతగాని మనుషులు ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి ని విమర్శిస్తే కెకె మహేందర్ రెడ్డి అభిమానులు

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్..

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్

జహీరాబాద్ :నేటి ధాత్రి

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షలు రాజు కుమార్ స్వామి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రఘవేంద్ర కాంగ్రెస్ పార్టీ మండల యస్సి సెల్ ఉపాద్యక్షలు రాంపూర్ ప్రకాష్ ఉప సర్పంచ్ రవి, క్రిష్ణ యంపిటిసి చంద్రశేఖర్ ఖలీల్ యదగిరి
బాల్ రాజు కెషన్న శ్రీదర్ వహబ్ నిజం బస్వారాజు పాటిల్ తదితరులు పాల్గొన్నారు

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం

నర్సంపేట,నేటిధాత్రి:

తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ సర్పంచ్లు బయలుదేరారు.ఈ నేపథ్యంలో వారిని దుగ్గొండి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతి రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్ రేవూరి సురేందర్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేసి గొంతును నొక్కిపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా పోలీసులు వ్యవహరించడం తీరు మంచిది కాదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నేడు మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version