వైభవంగా ముగ్గుల రంగవల్లి పోటీలు

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల రంగవల్లి పోటీలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దంపతులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి పండుగ వెనుక గొప్ప పరిమార్తం ఉందని సంక్రాంతి రైతుల పండుగని నాగర్ కర్నూల్ నియోజవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగవల్లిలో ప్రతిభ చూపిన మహిళలకు అభినందనలు తెలిపారు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మంత్రికి ప్రత్యేక పూజలు, ముగ్గుల పోటీలలో ఎమ్మెల్యే పాల్గొన్నాడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోగి పర్వదినం సందర్భంగా కొత్తపల్లి(బి) గ్రామానికి చెందిన క్యాతం ఐలయ్య – వసంత మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే కళారూపమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలు భావి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నూతన సర్పంచ్ వినోద్ భోగి సంబరాలు – ఝరాసంగం

భోగి మంటలు… సాంప్రదాయాల హరివిల్లు:

◆-: నూతన సర్పంచ్ వినోద బాలరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు మన సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక, సకల సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఝరాసంగం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పాత మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీబాలాజి సెలబ్రేషన్ గృపు అద్యర్యము లో మంగళవారం రాత్రి 45 కుటుంబ సబ్యులు పాల్గొని భోగి మంటల కార్యక్రమంఘనంగా నిర్వహించామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ గ్రూపు మూడు సంవత్సరాల క్రింద 45 కుటుంబాలతో ఏర్పాటు చేసుకొని పండుగ సాంప్రదాయాలను కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో భోగి మండల కార్యక్రమం ఉగాది హోలీ వినాయక చవితి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గోకారం కృష్ణమూర్తి పోలిశెట్టి మురళి కటకం శ్రీధర్ కటకం పరమేష్ కలకొండ కిషోర్ సాయి నారాయణ గంధం రాజు నూకల వెంకటేశ్వర్లు సుధీర్ వెంకటేశ్వర్లు సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి..

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుండి పాకాల రోడ్డు లోని కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికతను నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సాంస్కృతి ఆదివాసి గిరిజనులదని అన్నారు.గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు చేస్తున్న కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు సందర్శించి పరిష్కార నిమిత్తం తన దృష్టికి తీసుకురావాలన్నారు.గిరిజనుల హక్కులను రక్షిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొకావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య,గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version