అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా వరంగల్ పట్టణ కలకోట వెంకటేశ్వరరావు కుమారుడు, కోడలు ఫని కుమార్, డాక్టర్ శీతల్ వ్యవహరించారు.అలాగే సింగిరికొండ సురేష్ విజయ దంపతుల వివాహ పర్వదిన సందర్భంగా రూ.2 వేలు విరాళంగా అందజేసినట్లు దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

వెంకటాపూర్ మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గంప సుమలత ఇల్లు షార్ట్ షర్కూట్ వల్ల కాలిపోగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క వారి కుటుంబానికి దైర్యం చెప్పారు
పూర్తిగా ఇల్లు దగ్ధం కావడంతో వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి వారి కుటుంబానికి బియ్యం, దుప్పట్లు,దుస్తులు అందించ ఆర్థిక సాయం చేశారు
మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version