ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

#ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉడత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3కోడిగుడ్లు ,నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రుపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడి టీచర్ రజిత ,ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఊరటీ నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి , ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామం లోని రైతు వేదిక లో జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ దంతుల శ్యామల తూక్కారం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఆవుల లావణ్య పాల్గొన్నారు, ఈ సంవత్సరం పాఠశాల సాధించిన ఫలితాలను ప్రధానోపాధ్యాయులు రాజేందర్ వివరించారు 527 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నారే లహరి, 525 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన హర్షిని లను సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతుందని అందరు కూడా మన గ్రామంలో ఉన్న వర్షకొండ జడ్పీ పాఠశాల యందు వారి పిల్లల్ని చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకృష్ణ, మహేష్, అనిత, సుజాత గారలు పాల్గొన్నారు. సుమారు వందమంది పేరెంట్స్ పాల్గొన్నారు.

మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి.

తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

వేసవి సెలవులు కావడంతో కల్వకుర్తి పట్టణంలో 14 సంవత్సరాలు నిండని బాలురు సరదాగా ఆటల కోసం ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారు. కొందరు బాలురు విపరీతమైన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతున్నడంతో ప్రమాదాలు జరిగి అవకాశం ఉంది. అధికారుల స్పందించి పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా .తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పట్టణవాసులు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version