108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్…

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి

మండల కేంద్రంలో గ్రామ గ్రామానికి సేవలందిస్తున్న 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్, భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ తో కలిసి 108 వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి. అనంతరం 108 వాహనంలో ఉండే పరికరాలు, మందులలభ్యత,బీపి అపరేటర్,ఆక్సిజన్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈఎంటి, పైలెట్లు నిత్యం 108 వాహనానికి అందుబాటులో ఉండే వచ్చిన ఎమర్జెన్సీ కాలనీ లిఫ్ట్ చేసి అతి త్వరలోనే రోగులను ప్రభుత్వ హాస్పటల్ కి చేరవేర్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి బట్టా.సుమలత, పుల్లయ్య, పైలెట్ గాడిపల్లి సాయి, సాంబశివరావు పాల్గొన్నారు.

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి…

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి
. కబ్జాలను తొలగించండి
.అమీన్పూర్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఈర్ల వెంకటేష్

నేటి ధాత్రి, పాటన్ చేరు :

కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు జరుగుతున్నాయి అంటూ పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట రెవెన్యూ సర్వేనెంబర్ 164 రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. అని ప్రధానంగా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ కబ్జాకు పాల్పడినట్టు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమీన్పూర్ తహసిల్దార్ ఆర్డర్ నెంబరు బి /413/2023 ప్రకారం కబ్జాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు… ఇప్పటికైనా 164 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమాలను తొలగించి విలువైన ప్రభుత్వములను కాపాడాలని కబ్జాదారులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ అన్నారు ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం పాఠశాలలు ఆసుపత్రులు ఏర్పాటు కోసం కాకుండా బెల్ట్ షాపుల మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతో బాధాకరమని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు బెల్ట్ షాపులకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్న ఘనత మాజీ ఎంపీపీ ఈర్ల దేవానందుదేనని,ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ రకమైన కబ్జాలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ భూములలో నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కోరారు

తంగళ్ళపల్లిలో భూమి కబ్జాపై న్యాయం కోరిన యజమాని

నాకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఒక వ్యక్తి మాకు న్యాయం చేయాలంటూ.ప్లడ్ కార్డులతో. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ .బటాయించాడు. సందర్భంగా.వేములవాడకు చెందిన .కొండబత్తిని సత్యం. అనే ఇతను గతంలో లక్ష్యం పూర్ గ్రామంలో.సర్వేనెంబర్. 1170. నెంబర్లో. సబ్ స్టేషన్ పక్కన మూడు ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉన్నది దానికి 2015. జనవరి 26 వ. సంవత్సరంలో బోరు వేయించడం జరిగింది. బోరును. నడవకుండా ఖరాబు.చేయడంతో పాటు. నన్ను చంపుతానని భయ ప్రాంతాలకు గురి చేస్తూ నా భూమిని కబ్జా చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు వారితో నాకు ప్రాణ భయం ఉన్నది దయచేసి సంబంధిత అధికారులు దీనిపై తగు విచారణ చేసి నాకు సంబంధించిన మూడు ఎకరాల భూమి నాకు ఇప్పించవలసిందిగా అధికారులు కోరుచున్నాను ఇట్టి విషయమై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ బటాయించడం జరిగిందని. ఇందులో. గుర్రం అంజయ్య. ఆయన కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి. నాకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకుని నన్ను చంపుతానని బెదిరిస్తూ. నాకు సంబంధించినజాగను. నాకు కాకుండా బెదిరిస్తున్నారు వీరితో మాకు ప్రాణ భయం ఉన్నందున పోలీసులు అయినా రెవెన్యూ అధికారులైన సంబంధిత భూమిపై విచారణ చేపట్టి అర్హులైన మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము

చెత్త కుండీ కబ్జాపై స్థానికుల ఆందోళన

కబ్జాకు గురవుతున్న చెత్త కుండీ, అధికారులు వారించిన లెక్కచేయని కబ్జాదారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం జనవరి 10: అధికారులు అడ్డుచెప్పిన లెక్కచేయకుండా చెత్త కుండీని కబ్జా చేస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెత్త కుండీని కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానిక ప్రజానీకం అంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో గల ఆటో స్టాండ్ నుండి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త కుండీని గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసి అ స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్ననికి గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచ్, స్థానికులు అడ్డుచెప్పినప్పటికి డౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోని చెత్త కుండీని కబ్జాదారు నుండి కాపాడాలని అంటున్నారు.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

#కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

మండల కేంద్రంలోని రేవులకుంట, వెంకటపాలెం చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం చెరువు శిఖం భూములను సైతం ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుల శిఖం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని. అదేవిధంగా శిఖం భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మాసంపల్లి అఖిల్, పరికిత్యారాజు, బూస కుమారస్వామి, వైనాల జంపయ్య, మేకల మోహన్, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన….

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన.

బాలానగర్ / నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version