పోరు వద్దు ఊరు ముద్దు…

పోరు వద్దు ఊరు ముద్దు

మాజీ మావోయిస్టు కంటికి శస్త్ర చికిత్స చేయించిన కోటపల్లి పోలీస్

ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి – జనజీవన స్రవంతిలో కలవండి

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారేపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చన్న,భార్యతో కలిసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు,లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని,తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినాడు.మాజీ మావోయిస్టు కు పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సహాయం,సమస్య ఉన్న అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆత్రం లచ్చన్న కు కంటి చికిత్స ను మంచిర్యాల లోని పవన్ ఆప్టికల్స్ ద్వారా ఉచితంగా కంటి చికిత్స చేపించారు.

భూపాలపల్లి లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ…

కలసి ఉంటే కలదు సుఖం రాజి మార్గమే రాజా మార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో నుండి బయటపడాలని జడ్జి తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ క్షమా గుణాన్ని కలిగివుండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరభావంతో మెలగాలని వారు తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ లేబర్ కమీషనర్ వినోద గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు బెంచి మెంబర్లు ఎం.డి. లతీఫ్ అబ్దుల్ కలాం మంగళపల్లి రాజ్ కుమార్ రావుల రమేష్ కనపర్తి కవిత మొయినుద్దీన్ సంధ్య నాగవత్ తిరుమల పోలీసు అధికారులు పి.కుమార్ ఏ.నరేష్ కుమార్ కర్ణాకర్ రావు వెంకటేశ్వర్లు బ్యాంకు ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version