అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

బిఆర్టియి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారందరికీ లేబర్ శాఖ ద్వారా సంక్షేమ పథకాలు అందజేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.ఐస్ క్రీమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షుడు కొమురయ్య అధ్యక్షతన జరిగింది. గోనె యువరాజు మాట్లాడుతూ దేశంలో నాలుగున్నర కోట్ల మంది కార్మికులు రోజువారీగా పనులు చేసుకుంటూ కార్మిక చట్టాల అమలుకు దూరంగా ఉంటున్నారని వారందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే పార్లమెంటులో సమగ్ర బిల్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా చట్ట సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు సమ్మె చేయబోతున్నారని ఆ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా చెరుపల్లి కొమరయ్య, కార్యదర్శిగా ఎండి అజీమ్, ఉపాధ్యక్షులుగా సలేంద్ర చేరాలు, కోశాధికారిగా గుండు స్వామి, కమిటీ సభ్యులుగా అన్నే బోయిన రాజు, జి సారయ్య,రాజు, మహేందర్ ,నరసయ్య ,శ్రీను బద్రు, పాషా ఎన్నికైనారు.

G.O.Ms.no.3ను చట్టం చేయాలి.!

G.O.Ms.no.3ను చట్టం చేయాలి..

ఆదివాసి సంక్షేమ పరిషత్ మండలం అధ్యక్షులు తూర్స, క్రిష్ణ బాబు.

నూగూర్ వెంకటాపురం

(నేటి ధాత్రి ):

మంగళవారం నాడు వెంకటాపురం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల రక్షణకై ఏర్పాటు చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో పనిచేస్తున్న వంటి ప్రభుత్వ అధికారులు కూడా గిరిజన ఇతరులకు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆదివాసుల పొట్టలు కొడుతూ G.O.Ms
no.3 ని కాజేశారని మండిపడ్డారు. జీ.ఓ.ఎంఎస్. నెం. 3ను మినీ అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించుటకై 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటి నాగరాజు, బొగ్గుల రాజ్ కుమార్, బొగ్గుల ప్రశాంత్, గట్టుపల్లి సంజయ్, పూణేం అర్జున్, తాటి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే భూభారతిని చట్టాన్ని అమలు చేయాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.

ఈ సమావేశంలో కొత్తగూడ మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడమైనది.

ఆగబోయిన ప్రశాంత్ అధ్యక్షులు, దనసరి నారాయణ ప్రధాన కార్యదర్శి, కంగల సురేందర్, సుంచ బాలరాజు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు మోకాళ్ళ చంద్రబాబు దనసరి రాజేష్ (చిన్న), దనసరి రాజబాబు, చింత రాజు కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు అడవి హక్కు పత్రాలు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

హక్కు పత్రాలు మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే అడవి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరినారు.

హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పెట్టుబడులకు రుణాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది దీంతో నిరుపేద ఆదివాసి రైతులు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వారి దగ్గర విత్తనాలు ఎరువులు అధిక వడ్డీలకు ఇస్తూ రైతుల్ని దోపిడీ చేయడమే కాకుండా వారు పండించిన పంటని అలా సులాలకు కొన్న వడ్డీ వ్యాపారులు వారు లాభపడుతూ నిరుపేద ఆదివాసి రైతుల జీవితాలను అప్పుల ఊబిలోకి నేడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని దళారులు కోట్లకు పరిగెడుతున్నారు నిరుపేద ఆదివాసి రైతులు సేట్ల దగ్గర అప్పు కోసం వరుస కడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని దళారులను ప్రోత్సహిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసీల భూములు మొత్తం కూడా వడ్డీ వ్యాపారులు సేట్లకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందినారు.

అతికరేట్లకు విత్తనాలు సప్లై చేస్తున్న సేట్లను అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి అవగాహన సదస్సులో గిరిజనేతరుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల పైన విచారణ చేపట్టాలని ఆ భూములు 1/70 చట్టం అమల్లో రాకముందు నుండి వారి ఆధ్వర్యంలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం

ఈ అవగాహన సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలోని భూములపై కూడా అవగాహన కల్పించాలని అంతేకాకుండా భూభారతి ముసుగులో 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరాలకు హక్కులు కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

అదేవిధంగా ఈనెల 27న గంగారం మండలం కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆదివాసి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి ప్రవీణ్ మహాబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆదివాసి సంక్షేమ పరిషత్ ధనసరి రమేష్ దనసరీ వినోద్ గట్టి కార్తీక్ చింత సాంబయ్య అలెం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు…

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.!

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.

న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.

సదస్సును జయప్రదం చేయండి..
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం..

మర్చి 9వేంకటాపురం మండలకేంద్రంలో న్యాయం నిపుణులతో.

గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.

వాజేడు (నేటి ధాత్రి ):-
ములుగు జిల్లా – వాజేడు మండలం కేంద్రంలో ఇప్పగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి, పూనెం,సాయి హాజరై భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో భాగంగా మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రం కాపేడ్ గ్రౌండ్ లో ఆదివాసి న్యాయ నిపుణులు,ఆదివాసీ సంఘాల నాయకులతో సదస్సును ఏర్పాటు చేసి జయప్రదం చేయాలని, కరపత్రాలు విడుదల చేశారు . తదనంతరం, పూనం సాయి మాట్లాడుతూ .ఏజెన్సీ ప్రాంత అడవి బిడ్డల విద్యారంగంలో ముందుకు రాణించాలని,ప్రత్యేక దృక్పథంతో సుమారు నాలుగు దశాబ్దాలుగా అడవి బిడ్డలుగా ఆలు పెరగని పోరాటాలు కొనసాగించిన ఘనత గొండ్వాన సంక్షేమ పరిషత్ దకిందని,ప్రత్యేక ఉద్యమ సంఘంగా ఆదిమ జాతులకు సేవలు అందించిన చరిత్ర జిఎస్పి కి ఉందని అన్నారు. ఆదిమ జాతుల సంక్షేమాన్ని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించిచారని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్, ఐ ఏ ఎస్ జి.ఎస్.పి పోరాటాలను గుర్తించి ఆదిమ విద్యార్థులను మరింత విద్య రంగంలో వెన్ను దన్నుగా నిలిచారని గుర్తుచేశారు.ఉద్యోగ రంగంలో ఆదివాసులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 అమలు పరచాలి ప్రత్యేక కృషి చేసిన ఘనత ఆనాటి కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్ కి తగ్గిందని వారి వల్లే భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కాలేజీలలో 6%శాతం రిజర్వేషన్ నుండి జీవో నెంబర్ 267 ద్వారా 100% అమలుకు నోచుకుందని ఆయన అన్నారు.అప్పటి ఐటీడీఏ పీ వో ప్రవీణ్ ప్రకాష్,ఐ ఏ ఎస్ అప్పటి జిల్లా కలెక్టర్ వారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల భద్రాచలం కేంద్రంలోని టి టి సి బి.ఎ డ్ కాలేజీలు వచ్చాయని అన్నారు.విద్యార్థుల స్వయంపాలన హాస్టల్స్ కూడా 1996,2017 కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ఇదే తరుణంలో ఆదిమ జాతులకు మరింత చైతన్య రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లా తీర్చిదిద్దేందుకు,భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు కారం,రాజబాబు పదం, సుధాకర్ కారం, గణపతి వెంకటేశ్వర్లు ఆనంద్, మోడెం నవీన్ ,శ్రీనాద్, శ్రీకాంత్, రవి, మడకం ప్రశాంత్, విష్ణు, ఇప్పగూడెం గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version