రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.
దుగ్గొండి,నేటిధాత్రి:
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.
