నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ.

— నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండల పరిధిలోని కే. వెంకటాపూర్ నూతన పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 1200 కు పైగా ఓటర్లు ఉన్నారని స్థానిక అధికారుల నివేదిక మేరకు నూతన పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమద్ లు ఉన్నారు.

జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి.

జహీరాబాద్ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మిథున్ రాజ్, ఎమ్మార్వో దశరద్ సింగ్, మోహన్ రెడ్డి, రైతుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్, వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను.

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలని విన్నపం

సిరిసిల్ల టౌన్: మే 21 (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ వృద్ధులను తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి గాని,సేవా సంస్థల నుండి గాని,ప్రభుత్వ పెన్షన్ విధానాలు గాని,జిల్లాలో ఉన్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది. ఏదైనా వృద్ధులకు ఇబ్బంది ఉంటే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో ని కోరడం జరిగింది , ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ.!

న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన న్యాల్కల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని జహీరాబాద్ ఆర్డీఓ రామిరెడ్డి గురువారం ఉదయం స్వయంగా సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version