విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T135810.401.wav?_=1

 

 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ,వాహన పూజలు

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో ఈరోజు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈపూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లుమధుకర్, యాదగిరి, సి.ఐ లు కృష్ణ,నాగేశ్వరావు,మధుకర్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం…

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల (నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ,పోలీస్ అధికారులు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు.దేశ స్వాతంత్ర్యోద్యమం,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఏ. ఓ పద్మ, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు…

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు

– నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మహేష్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ
తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T130623.175.wav?_=2

 

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి…

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి

సెప్టెంబర్ 15 న మహాసభ

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు

సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)

 

 

 

సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి…

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి

జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి ధాత్రి

 

 

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మరియు లయన్స్ పి డి జి ఎస్ ఆనంతుల శివ ప్రసాద్ మరియు హన్మాండ్ల రాజారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు పిల్లలకు అల్పాహారం వితరణ, బుక్స్ పంపిణి, అనంతరం కేక్ కటింగ్ చేశారు అనంతరం ప్రభుత్వ సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్ ఇల్లెందుల శ్రీనివాస్ మర్రి భాస్కర్ నాంపల్లి వేణుగోపాల్ రఘుపతి రావు ఆల్ రౌండర్ గంగాధర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో సీనియర్ సిటిజన్స్ గురుపూజోత్సవం…

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గురుపూజోత్సవం కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమం చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణలో పూర్వ ఉపాధ్యాయులు, తాత్వికవేత్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భముగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మార్గం విశ్వనాథం ప్రధానోపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయుడు వికృతి ముత్తయ్య గౌడ్, పుల్లూరు మల్లేశం, బుర్ర నారాయణ గౌడ్ పూర్వకన్సలర్, కౌన్సిలర్స్ పి పద్మ శంకర్, వేణు నాగరాజు, సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జనపాల శంకరయ్య , రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గురువు త్రిమూర్తుల స్వరూపమని పెద్ద లన్నారు అందుకే గురువు లయకారుడు సృష్టికర్త అభివృద్ధి పథకం పై నడిపించగల శక్తి,యుక్తులు ఉన్న సామాజిక బాధ్యత కలిగిన ప్రధాన మైన వ్యక్తిత్వం కలిగిన ఉన్నతత్వం కలిగిన వ్యక్తి గురువు. అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కోశాధికారి దొంత దేవదాసు, గజవాడ కైలాసం, కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం, విద్యాసాగర్, అంకారపు జ్ఞానోబా, లక్ష్మణరావు మెరుగు కిషన్ వెంకటరెడ్డి గంప శంకరయ్య, పత్తిపాక శంకరయ్య తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు

అంకితభావంతో ఉపాధ్యాయులకు గుర్తింపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T155335.272.wav?_=3

 

అంకితభావంతో ఉపాధ్యాయులకు గుర్తింపు

విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం

17మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అతిథులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు. అలాగే ఏ.టి. సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అణుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు. రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్న స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

 

ఉత్తమ అవార్డులు పొందిన టీచర్లను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా విశేష కృషి చేసి అవార్డులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక అవ్వాలి.జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75 శాతం పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అందించే వారిని గుర్తు చేశారు. (హెల్ప్ ఏజ్ ఇండియా) సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యావిధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు. తనది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు. విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని, జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులందరూ అంకితభావంతో సేవలందిం చాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు..
చకినాల శ్రీనివాస్, గుర్రం కృష్ణారెడ్డి, కైరి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్ రెడ్డి, బోగారపు నవీన్, కట్ట రవీందర్, గోవులకొండ శ్రీనివాస్, ఎన్ దేవేందర్, నరహరి నాగమణి, జంగిటి రాజు, పీచు సుభాష్ రెడ్డి, గుండమనేని మహేందర్ రావు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్ ఓరుగంటి పద్మకళకు అవార్డులు అందజేసి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఉత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T135601.536.wav?_=4

 

సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఉత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ భవన్ లోని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా వెన్నంటింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ.. పది రోజులు ఎన్నో పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఈరోజు బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం చేయడం ఎంతో సంతోషకరమని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లవేళలా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ మాట్లాడుతూ ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయమని అట్లాగే సిరిసిల్ల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అంతేకాకుండా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరాలని దేవున్ని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, కుంభాల మల్ రెడ్డి, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు యువకులు తదితరు నాయకులు పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T150357.474-2.wav?_=5

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ

సిరిసిల్ల టౌన్: ( నేదిధాత్రి)

 

సిరిసిల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా 2025- 26 సంవత్సరానికి గాను హిందీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మరియు ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణను అభినందించడం జరిగినది. గోలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంత మంచి అవార్డు ఎంపికైనందున ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాని మరియు ప్రభుత్వానికి గాని మరియు సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయులు,నాయకులు,అభినందించారు.

17వ బెటాలియన్ విద్యార్థులకు షూ, టై, బెల్ట్ పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141913.546-1.wav?_=6

 

17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

జీ.పీ.ఓలకు నియామకపత్రాలు జారీ చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T144528.564.wav?_=7

జీ.పీ.ఓలకు నియామకపత్రాలు జారీ చేయండి

సీసీఎల్ఏ లోకేష్ కుమార్

మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి

అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

జీ.పీ.ఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీ.పీ.ఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా నుంచి జీ.పీ.ఓ పరీక్ష రాసి 66 మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. అభ్యర్థులను ఈ నెల 5 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. హైదరాబాద్ తరలివెళ్లే అభ్యర్థులకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏ.ఓ. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో గణేష్ నిమజ్జనకు జిల్లా ఎస్పీ సూచనలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T144040.353.wav?_=8

 

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని

శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపిఎస్

 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి నిబంధనలు పాటించాలని,నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈరోజు పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

SP Mahesh B.Gite.IPS

జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని.జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు.వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవలన్నారు.నిమజ్జనం రోజున.ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు ఏర్పాటు చేసిన డి.జే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వహకులు నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలని, పోలీస్ వారి సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఏలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తిన, అవాంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందింవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో,డి.ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

 

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక…

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు ఉదృత ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ వరద ప్రవాహానికి మునిగిపోయింది. గత మూడు నాలుగు రోజుల నుండి భారీ వర్షానికి వస్తున్న వరదల వల్ల, పట్టణంలోని ఎగువ మానేరు జలాశయం నుండి నీరు ఉదృతంగా కిందికి ప్రవహిస్తున్న సందర్భంగా సిరిసిల్లలోని మానేరు జల కళ ఉట్టి పడినట్లు సిరిసిల్ల పట్టణవాసులు, మరియు పరిసర గ్రామాల నివాసులు మానేరు వాగు నీటిని సందర్శించడానికి, తండోపతండాలు గా వస్తున్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల సమీక్షా సమావేశం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T133918.180.wav?_=9

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల సమీక్షా సమావేశం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పి మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల పై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో ఎక్కడా కూడా టోబాకో, మధ్యం విగ్రహాలు జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా పోలీసు, ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష కిట్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు మూసి వేయాలని, దీనికి సంబంధించిన ఆదేశాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడ మద్యం విక్రయాలు జర్గవద్దని అన్నారు.

 

జిల్లాల ఎక్కడ కూడా గంజాయి సాగు జర్గకుండా పక్కా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంజాయి కేసులలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కడా కూడా పిల్లలకు సిగరెట్ లిక్కర్ అమ్మకుండా చూడాలని, దీనిపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయాలని అన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మహేష్ బి గీతే మాట్లాడుతూ,.జిల్లాకు గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులు సమయంతో పని చేయాలని అన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పై నిఘా పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డిఓలు వెంకటేశ్వర్లు రాధాబాయి వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం డిఇఓ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు ఎక్సైజ్ ఇరిగేషన్ లేబర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T131758.313-1.wav?_=10

 

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని గాంధీ చౌక్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కన్వీనర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సిరిసిల్ల నిర్వహించడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండ పేదల పెన్నిధిగా మహోన్నత వ్యక్తిగా, ఇది నిన్న రాజీవ్ గాంధీ ఎంతోమంది పేదలకు అండదండగా ఉంటూ ముందుకు సాగరం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా నేడు తెలంగాణలో పేదల ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాంగ ముందుకు వస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సూర దేవరాజ్, మాజీ కౌంటర్ ఎల్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్…

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.

సిరిసిల్ల గజల్ కవి బూర దేవానందంకు ఘన సన్మానం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-4.wav?_=11

సిరిసిల్ల గజల్ కవి బూర దేవానందంకు ఘన సన్మానం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

హైదరాబాద్ రవీంద్రభారతి లో తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖకవి, కళారత్న, బిక్కి కృష్ణ అధ్యక్షులుగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, మామిడి హరికృష్ణ, మల్లతీగ పత్రిక ఎడిటర్ కలిమిశ్రీ సినీగీత రచయిత మౌనశ్రీ ముఖ్య అతిథిలుగా ప్రఖ్యాత గజల్ కవయిత్రి విజయ గోలి రచించిన నవరాగిణి గజల్ పుస్తకావిష్కారణ గజల్ విభావరి ఎంతో ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమనికి సిరిసిల్ల గజల్ కవి బూర దేవానందంను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.. వారిని జ్ఞాపిక శాలువ ప్రత్యేక బహుమతులతో ఘనంగా సన్మానించారు..గజల్
కవి, బూర దేవానందంను సిరిసిల్ల మారసం, సిసాస, జిరసం, అధ్యక్షులు కార్యదర్శులు కవులు రచయితలు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version