మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

 

రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే.. గౌరవం కాదు కదా.. కనీసం విలువ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగులోకి వచ్చింది. సెలవు కోరితే.. చులకనగా మాట్లాడిన మేనేజర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఓ ఉద్యోగిని. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..సదరు పోస్టులో ఏ ప్రాంతంలో జరిగింది అనే వివరాలు పేర్కొనలేదు గానీ.. ఓ ప్రైవేటు బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమె తల్లి అనారోగ్యానికి గురవడంతో.. ఆమెకు సహాయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తనకు కొద్ది రోజులు సెలవు కావాలని.. తన తల్లికి అనారోగ్యం కారణంగా సహాయంగా ఉండాలని మేనేజర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనికి స్పందించిన మేనేజర్ అమార్యదకరంగా మాట్లాడాడు. ‘ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌లో గానీ, షెల్టర్ హోమ్‌లో గానీ ఉంచి ఆఫీసుకు వచ్చేయండి. సెలవులు ఇవ్వడం కుదరదు.’ అని సమాధానం ఇచ్చాడు. మేనేజర్ మాట్లాడిన విధానంతో మనస్తాపానికి గురైన సదరు ఉద్యోగిని.. ఉద్యోగం కంటే తనకు తన తల్లే ముఖ్యం అని భావించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఈ విషయాన్ని Mr_Moulick అనే రెడిట్ యూజర్ r/IndianWorkplace సబ్‌రెడిట్‌లోని పోస్ట్‌ చేశారు. రిజైన్ చేసిన ఉద్యోగిని కొన్ని సంవత్సరాలపాటు బ్యాంకులో పని చేశారని.. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరైదేనా? పని ప్రదేశాలలో ఇలాంటి వాతావరణం, మాటలు సమర్థనీయమేనా అంటూ తన పోస్టులో ప్రశ్నించారామె.

వైద్య ఉద్యోగుల సంతకాల సేకరణ..

వైద్య ఉద్యోగుల సంతకాల సేకరణ

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసస్ ఏర్పాటు చేయాలి

ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్

పరకాల,నేటిధాత్రి

 

వైద్య విధాన పరిషత్ రద్దు చేసి,ఆ స్థానంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసి,ట్రెజరీ ద్వారా సాలరీస్ (010) చెల్లించాలని పరకాల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానా ఉద్యోగులు డిమాండ్ చేసారు.వైద్యశాలలో యావన్మంది ఉద్యోగులు సామూహికంగా సంతకాలు సేకరించి,అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 1986 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపక పోవడం,వేతన సవరణ సంఘానికి వినతులు సైతం సమర్పించక లేకపోవడం,ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ రోజు వరకు జీతాలు పొందలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.మరో వైపు పక్క రాష్ట్రం ఏ.పి.లో వైద్య విధాన పరిషత్ రద్దు చేసి,ఆ స్థానం లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసస్ ఏర్పాటు చేసారని మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు.దశల వారీగా చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉద్యోగుల ఆకాంక్ష అధికారులకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల ఉద్యోగులు సామూహికంగా సంతకాలు సేకరించి అధికారులకు అందజేశామన్నారు.లేకుంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్స్,నర్సులు,పారామెడికల,నాల్గవ తరగతి రెగ్యులర్ ఉద్యోగుల పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి…

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి

ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version