మానవత్వం చాటుకున్న మాజీ ఎంపిటిసి…

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపిటిసి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల గోపి కుమారుడు. స్వాతి.క్.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే మరణించడం జరిగిందని. తన వంతు సహాయంగా అంకిరెడ్డి పల్లె మాజీ ఎంపిటిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాడ సానుభూతి తెలుస్తూ. ఎనగందుల గోపి. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త అని అతని కుమారుడు స్వాతి అనారోగ్యం కారణంతో మరణించగా నా వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని 2500 రూపాయలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను చనిపోయిన కుటుంబ సభ్యులు ఈ సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో ఓబులాపూర్ బూత్ అధ్యక్షులు .నందగిరి మధు. సీనియర్ నాయకుడు ఆసాని రామలింగారెడ్డి బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చిందం నరేష్. సిరిసిల్ల వంశీ. సంపత్. చిలగాని నరేష్. గోకుల కొండ కృష్ణ. మెహర్ కృష్ణ. అనిల్. ప్రశాంత్. శ్రీకాంత్. నాయకుడు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని రెండవ బైపాస్ చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అధికారిక పర్యటన నిమిత్తం అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రమాదాన్ని చూసి గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్.!

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పొశం మల్లీశ్వరి, కుటుంబాన్ని పోషించేందుకు మందమర్రిలోని ఇందు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగనుండగా, పెళ్లి ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్, సహాయ హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు రూ. 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి, ప్రేమతో ఆశీర్వదించారు.

“ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం”

ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, “నాయకత్వం కేవలం రాజకీయాలకు పరిమితం కావాలి కాదు, సహాయం అవసరమైన వారి కోసం నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు, ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.

ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మానవతా గుణం

సదానందం యాదవ్ చేసిన మానవీయ చర్య స్థానిక ప్రజల హృదయాలను హత్తుకుంది. “ఇలాంటి నాయకుల వల్లే సమాజం బాగుపడుతుంది” అని వార్డు పెద్దలు, మహిళలు ప్రశంసించారు. “అధికారంలో లేకున్నా పేదల కోసం నిలబడే నేతలు అరుదుగా కనిపిస్తున్నారు. సదానందం నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారం” అంటూ పలువురు వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనస్సు ఉన్న నేతగా బండి సదానందం యాదవ్, సామాజిక సేవకు చిరునామాగా మారారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version