పని ప్రదేశాలలో లైంగిక వేధింపులపై చట్టపరమైన చర్యలు

పని ప్రదేశాలలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై పోష్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళలు లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్ – 2013 పై అవగాహన కలిగి ఉండాలని,పని ప్రదేశాలలో మహిళలకు భద్రత,గౌరవం, సమానత్వం కల్పించడమే లక్ష్యంగా చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ పరిశ్రమలలో,వాణిజ్య, వ్యాపార సముదాయాలలో, షాపింగ్ మాల్స్,జిన్నింగ్ మిల్లులు,ఇతర పని ప్రదేశాలలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైతే బాధిత మహిళలు నిర్భయంగా అంతర్గత ఫిర్యాదు కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని,పోష్ చట్టం 2013 ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు.ఫిర్యాదు పై కమిటీ నిర్నిత కాలంలో విచారణ పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే పోలీస్ కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి కార్యాలయంలో,పని ప్రదేశాలలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని,మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.పోష్ చట్టం,అంతర్గత ఫిర్యాదు కమిటీ ఉద్దేశం,హక్కులు, ఫిర్యాదు విధానం,కమిటీ నిర్మాణం,బాధ్యతలు వంటి అంశాలపై అధికారులు, ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతుందని,కమిటీ వివరాలను నిర్దిష్ట ఫారం ద్వారా సేకరించి సంబంధిత సమాచారాన్ని షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఇప్పటివరకు 47 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని,వీటిలో ప్రభుత్వ జిల్లా స్థాయి కార్యాలయాలలో 30 కమిటీలు,ఉప జిల్లాస్థాయి కార్యాలయాలలో 16, ప్రైవేట్ సంస్థలు,షాపింగ్ మాల్స్, దుకాణాలలో 1 కమిటీ పనిచేస్తున్నాయని తెలిపారు.ప్రైవేట్ సంస్థలు తమ సంస్థలలో కమిటీలను ఏర్పాటు చేయాలని,జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం, షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు.పోష్ చట్టం అమలుతో మహిళలకు పని ప్రదేశాలు సురక్షితంగా మారుతాయని,ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని తెలిపారు.

ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం….

ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం

బట్టు కర్ణాకర్
ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో ఆనందాజీ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేయడం
జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఆనందా ఆజీ పై చిన్న వయసు నుంచే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసిక వేదనకు, శారీరకంగా వేదనకు గురిచేసి ఆయనను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి.. అతని చావుకు కారణమైన ఆర్ఎస్ఎస్ వాదుల దిష్టిబొమ్మను దహనం చేసినామన్నారు

ఆనందా ఆజీ తన ఇంస్టాగ్రామ్ లో స్వయంగా నాకు ప్రేమ వ్యవహరాలలో జోక్యం లేదు ఆర్థిక ఇబ్బందులు లేవు కేవలం ఆర్ఎస్ఎస్ నాయకులు చేసిన లైంగిక వేధింపులకే మానసిక ఇబ్బందుల వల్లనే నేను చనిపోతున్నాను అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది

యువ సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజిపై లైంగిక వేధింపులు చేసిన ఆర్ఎస్ఎస్ నాయకులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వారి కుటుంబానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రసాద్ అఖిల్ తిలక్ ప్రేమ్ కుమార్ అఖిల్ భాస్కర్ రిజ్వాన్ వినోద్ శేఖర్ శ్రీకాంత్ సాగర్ రేవంత్ రవీందర్ మల్లేష్ సంపత్ నదీమ్ సురేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

లైంగిక వేధింపుల ఆరోపణలు..

లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు.

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం రోజా అనే యువతి కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ (Sexual Abuse Allegations) బాగా ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. ఈ విషయంలో తనకంటే కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ఆమెపై తన సిబ్బంది సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘నేనేంటో తెలిసివాళ్లు ఈ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకూ తెలుసు. ఇవన్నీ నన్ను ఏ మాత్రం బాధించలేవు. కానీ ఇలాంటి వాటి వల్ల నా కుటుంబం, సన్నిహితులు ఎంతో బాధ పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి’. ఆమె ఫేమస్‌ కావడం కోసం, కాసేపు మీడియాలో పాపులర్‌ కావడం కోసం చేసే పనులివి. అలా ఆమెను కాసేపు ఎంజాయ్‌ చేయనీయండి’ అని నా సన్నిహితులతో చెప్పాను. మేము ఆమెపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. గత ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు దేనికీ భయపడలేదు. ఇలాంటివి నన్ను ఏమీ చేయలేవు’ అని విజయ్‌ సేతుపతి అన్నారు.గతంలో విజయ్‌పై రమ్య అనే మహిళ ఎక్స్‌లో చేసిన వాఖ్యలివి. ‘తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉంది. దీని నా స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడింది. విజయ్‌సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారు. ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైంది’ అని రమ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కాసేపటితో ఆమె ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై సేతుపతి అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్‌ ఎందుకు డిలీట్‌ చేశారని నిలదీశారు. ఆ తర్వాత ఆ మహిళ మరో పోస్‌ట్తఓ క్లారిటీ ఇచ్చింది. అది కోపంలో చేసిన పనని, అంతగా వైరల్‌ అవుతుందనుకోలేదని తెలిపింది. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version