50% సీలింగ్ రిజర్వేషన్ల జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు..

50% సీలింగ్ రిజర్వేషన్ల జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 50 శాతం రిజర్వేషన్ తగ్గకుండా విడుదల చేసిన జీవోను పత్రాలను బీసీ నాయకులు శనివారం దహనం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభ పేరుతో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాల కాలం అవుతున్న స్పష్టమైన వైఖరి లేకపోవడం బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడం జరిగిందని,అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని చెప్పుకునే బిజెపి 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు.ఈ రెండు పార్టీలు ధోరణిని విడనాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలను డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు అలాగే బిజెపి వైఖరిని తీసి సమాజం ముందు ఎండగట్టి బిజెపిని బీసీ ల ముందు దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో
జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకన్న, శాఖ పూరి భీమ్సేన్,చంద్రగిరి చంద్రమౌళి,కర్రె లచ్చన్న, వేముల అశోక్,కీర్తి బిక్షపతి, మంచిర్ల సదానందం,తన్నీరు భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.

బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T172518.529.wav?_=1

 

బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం

కాంగ్రెస్,బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా?

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి

బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందేనని మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్, బీసీ జేఏసీ నాయకులు నరెడ్ల శ్రీనివాస్,కొండిళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన మాటను పక్కనపెట్టి నేడు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెడతామని,రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో కుర్చీ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.బీసీలను మోసం చేసి ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీసీ ప్రజలు నమ్మరు అని అన్నారు.కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ పార్టీ ఆనాటికి,ఈనాటికి బీసీలపై కక్షపూరిత వైఖరితోనే వ్యవహరిస్తుందని,పేరుకు మాత్రమే బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీల విషయంలో కూసమెత్తు పని కూడా చేయలేకపోయినా అసమర్థులని విమర్శించారు.కాంగ్రెస్ బిజెపిలకు నిజంగా బీసీలపై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా బీసీల రిజర్వేషన్లను పెంచి జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ,వ్యాపార,రాజకీయ రంగాలలో అవకాశాలు అందించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ బిజెపి పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు కర్రే లచ్చన్న, తులా మధుసూదన్ రావు, ముతోజు రమేష్,జైపూర్ బీసీ జేఏసీ నాయకులు,వేముల మల్లేష్,ఆడెపు గణేష్,సమ్మన్న, శ్రీరాంపూర్ బీసీ జేఏసీ నాయకులు,గార్గే చేరాలు,నాగరాజు,హాజీపూర్ బీసీ జేఏసీ నాయకులు వేముల అశోక్,మడిపల్లి సత్యనారాయణ,మహేందర్ బీసీ జేఏసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో మరింతగా రాణించి తెలంగాణ రాష్ట్ర పేరును ప్రతిష్టను నిలబెట్టాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T133532.356.wav?_=2

 

భవిష్యత్తులో మరింతగా రాణించి తెలంగాణ రాష్ట్ర పేరును ప్రతిష్టను నిలబెట్టాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన. పాలకుర్తి ఆశ్రిత్.సాయి అనే. అబ్బాయి. జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో. అబ్బాయిని అభినందించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం కి చెందిన. విద్యార్థి సెప్టెంబర్ టెన్త్ రాజీవ్ నగర్ లో జరిగినటువంటి. అండర్ 14.న .జిల్లా జట్టు కోసం మొదటగా .300కు పైగా క్రీడాకారులలు. పాల్గొనగా అందులో నుండి 30 మంది. క్రీడాకారులను. సెలెక్ట్ చేయడం జరిగిందని మంచి ప్రతిభ చూసిన 18 మంది క్రీడాకారులను. సెలెక్ట్ అయ్యారని. అందులో తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి ఆశ్రిత్. సాయి అనే అబ్బాయి. సిరిసిల్లలోని మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థి జిల్లా జట్టుకు సెలెక్ట్ అయ్యాడని కరీంనగర్ లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీ జరుగుతుందని. ఈ o దుకు గాను ఈ విద్యార్థి సెలెక్ట్ అయ్యారని. ఈరోజు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇట్టి విద్యార్థిని. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందించడం జరిగిందని. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ తనకు నూతన క్రికెట్ బ్యాట్ అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ పొన్నాల పరశురాం. ఆరేపల్లి బాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. గట్టు లింగారెడ్డి. మహేష్. క్రికెట్ కోచ్ చుంచుల. కిషన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T132931.499.wav?_=3

 

బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి’

జమ్మికుంట, నేటి ధాత్రి:

బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలలో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం అవకాశం కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. జమ్మికుంట మండల కేంద్రం వావిలాల గ్రామంలో మంగళవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఇదే నెల19న బుధవారం జమ్మికుంట దినేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ బి సి నాయకులు కొండ అర్జున్,గొర్ల సతీష్,అందే నర్సయ్య, కనవేన సదానందం మామిడి మల్లయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు…

రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ , రాజకీయ రంగాల్లో కల్పించాలని ఒకరోజు దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో మెజారిటీ అయిన బీసీలు ప్రతి రంగంలోనూ వెనుకబడినారు. రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడ కూడా వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు ,అందువల్ల చట్టసభలలో వారి ఉనికి నామ మాత్రమే. ఉద్యోగాలు విద్యా రంగాల్లో కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. బీసీలకు రిజర్వేషన్ సాధించాలంటే అన్ని రాజకీయ పార్టీలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకత ఏర్పడిందని రానున్న రోజుల్లో బీసీ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ రిజర్వేషన్లు సాధించేంతవరకు ముక్క వోని దీక్షతో అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీల కోసం ఎవరు మద్దతిచ్చిన వారి మద్దతు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం మా వాటా మాకు కావాలి – మా అధికారం మాకు కావాలి అనే నినాదంతో మేల్కొని తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినవి.42శాతం రిజర్వేషన్ ను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలననీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుతానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ తో పాటు బీసీ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటి కో కన్వీనర్లు బర్ల గట్టయ్య పటేల్,గుమ్మడి ప్రదీప్ పటేల్, అమృత అశోక్ కురుమ, ఆర్డినేటర్ శేఖర్ నాని, బీసీ జేఏసీ మహిళా చైర్మెన్ మేకల రజిత, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవి కుమార్, బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ జేఏసీ మహిళ నాయకులు పుట్టపాక పుష్ప, ఓరుగంటి లక్ష్మి, చింతల లత, బీసీ హక్కుల సాధన సమితి అధ్యక్షులు బీమానాథుని సత్యనారాయణ, కురుమ సంఘం జిల్లా కన్వీనర్ కోరే సుధాకర్, గౌడ సంఘం జిల్లా నాయకులు తాటి అశోక్ గౌడ్, ముంజల రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు నారగోని ఎల్లస్వామి, ఎంజల రమేష్, బాలాగోని రమేష్, కంచు రాజేందర్, మాధవాచారి,
బీసీ దీక్షకు మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు కౌటం రవి పటేల్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి ముద్దమల్ల భార్గవ్ ,బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగల రాజేందర్,బీజేపీ పట్టణ అధ్యక్షులు గీసా సంపత్ తెలిపారు
జేఏసీ యూత్ నాయకులు పూర్ణ యాదవ్, రేగళ్ల వంశీ, కాల్లోజు దిలీప్, గుజ్జెటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T145907.493.wav?_=4

 

బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నవంబర్ 15న జరిగే బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ క్యాతం మహేందర్ మాట్లాడుతూ గత 78 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రయాణంలో దేశ జనాభాలో మెజారిటీ అయిన బీసీలు ప్రతి రంగంలోనూ అణచివేయబడ్డారు. రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడ కూడా వారికి జనాభా నిష్పత్తికి సరిపడా ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు ,అందువల్ల చట్టసభలలో వారి ఉనికి నామ మాత్రమే. ఉద్యోగాలు మరియు విద్యా రంగాల్లో కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. రాష్ట్రంలో 130 కులాల బీసీ సమూహం రెండు కోట్ల నలభై లక్షల జనాభా ఉండగా ,వారు పొందుతున్న రిజర్వేషన్ కేవలం 29 శాతం మాత్రమే, కేంద్రంలో రిజర్వేషన్లు 1993 నుంచి అమలు కాగా, రాష్ట్రంలో 1972 నుంచి అమలు కావడంతో లక్షలాది బీసీ యువత ఉద్యోగాలు ,విద్యా అవకాశాలు కోల్పోయారు, ఆర్థికంగా వ్యాపార రంగంలో కూడా బీసీల ఉనికి లేనట్లుగానే ఉంది. ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం” మా వాటా మాకు కావాలి – మా అధికారం మాకు కావాలి” అనే నినాదంతో మేల్కొని తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినవి. హిస్సా ,ఇజ్జత్, హుకుమత్ కొరకు పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. 42శాతం రిజర్వేషన్ ను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలననీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుతానికి డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మాజీ ఎంపిటిసి కలిపాక రవి బీసీ జేఏసీ కో – ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ అడ్డగట్ల శ్రీధర్ వంగపండ్ల రాజయ్య యాదవ్ కనుకం మల్లన్న ముత్యాల రవికుమార్ నాయి భిక్షపతి గౌడ్,మిరియాల మల్లన్న వడ్డెర సంఘం మండల అధ్యక్షులుమంతెన రాకేష్ తిరుపతి రేణుకుంట్ల మహేష్ ,శిలపాక హరీష్ మంత్రి రాజబాబు కడపాక రవి తదితరులు పాల్గొన్నారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష…

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష

బీసీ జేఏసి జిల్లా ఛైర్మెన్ పైడిపల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పైడిపల్లి రమేష్ మాట్లాడారు. జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని మండిపడ్డారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే, మద్దతునిచ్చిన పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు పైడిపల్లి రమేష్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు..కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ రోజు కార్యక్రమంనికి విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్ మద్దతు తెలిపారు… ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళ చైర్మన్ మేకల రజిత, డీఎస్పీ పార్టీ కొత్తూరీ రవీందర్ యోజకవర్గ కన్వీనర్ జోగ బుచ్చయ్య, బర్ల గట్టయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, రజక సంఘం నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బండారి రవి, బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ శేఖర్ నాని,క్యాతం మహేందర్, తాటి వెంకన్న,శంకర్, రోడ్డ రవీందర్, శ్రీరాములు , పూర్ణ, తీగల సంతోష్ తదితరులు పాల్గొన్నారు

అక్టోబర్ 24న చలో ఇందిరా పార్క్…

అక్టోబర్ 24న చలో ఇందిరా పార్క్

గోడపత్రికను ఆవిష్కరించిన కొత్తూరు రవీందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ అక్టోబర్ 24 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మహా ధర్నా చేయడం జరుగుతుంది.
విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లు తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనికై కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలి,
అత్యంత వెనుకబడిన బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో ఉప వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పించాలి,
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.కావున వాటిని రద్దు చేయాలి లేదా బీసీ ఎస్సీ ఎస్టీలలోని నిరుపేద వర్గాలకు ఇందులో అవకాశం కల్పించాలి,
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి,
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన బడ్జెట్ ను తక్షణమే విడుదల చేయాలి. సబ్ ప్లాన్ అమలు చేయాలి
రెండు లక్షల ఉద్యోగాలభర్తిని వెంటనే ప్రారంభించాలి. ప్రవేశ పరీక్షలకు సంబంధించి జీవో 29 రద్దుచేసి, పాత జీవో 55 పునరుద్ధరించాలి
బీసీలకు ఎస్సీ, ఎస్టీల వలె రక్షణ చట్టాలు కల్పించాలి
జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 56% రిజర్వేషన్లు అమలు చేయాలి మేమేంటో మాకు అంత వాటా అమలుపరచాలి
రాజ్యాంగ సవరణ చేసి న్యాయస్థానాలు సృష్టించిన 50 శాతం సీలింగ్ ను ఎత్తివేయాలి
ఉద్యోగాల ప్రమోషన్లలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి
హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించాలి
నామినేటెడ్ కార్పొరేషన్ పదవులలో సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నియమించాలి.
పై డిమాండ్స్ ను నెరవేర్చుటకై ఈనెల 24న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయగలరు.
ఈ కార్యక్రమంలో బొజ్జపల్లి మహర్షి,రేణుకుంట్ల బీసీ జాక్ కోఆర్డినేటర్ శేఖర్ నాని గట్టు రవి దేవేందర్ మహేష్, మల్లయ్య,మంత్రి రాకేష్,బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి…

బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి

బీసీ బందుకు బిజెపి మద్దతు సిగ్గుచేటు

బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి

వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జయప్రదం

వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారీ నిరసన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటూ వారిని అణచివేస్తూ ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి రవి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా వరంగల్ పట్టణంలో ఎం సి పి ఐ (యు), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పెద్దారపు రమేష్,కొత్తపెళ్లి రవి, ఎలకంటి రాజేందర్,అక్కనపెల్లి యాదగిరి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ నగర నాయకులు సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి న్యూ డెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్ బండి కోటేశ్వర్ జన్నారం రాజేందర్ మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి మైదంపాని లిబరేషన్ నాయకులు రవిరాకుల ప్రసంగి జన్ను ప్రవీణ్ అప్పల శంకరాచారి ప్రజా సంఘాల నాయకులు ఐతం నాగేష్ ఎగ్గెని మల్లికార్జున్ మహమ్మద్ మహబూబ్ పాషా అప్పనపురి నర్సయ్య మాలి ప్రభాకర్ నలివెల రవి దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం..

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం:-

42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల డిమాండ్:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, అక్టోబర్ 18:-

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “బీసీ హక్కుల సాధన బంద్” కు వరంగల్–హనుమకొండ జిల్లా న్యాయవాదుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.బంద్ సందర్భంగా, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కోర్టు ఎదుట ధర్నా నిర్వహించి మరియు ర్యాలీ చేపట్టి కాళోజీ సెంటరు నుండి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నినాదాలిచ్చి తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా జరిగిన బంద్ సభలో, జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ మాట్లాడుతూ —
“బీసీలు రాష్ట్ర జనాభాలో అతి పెద్ద వర్గం అయినప్పటికీ, సమాన అవకాశాలు ఇంకా లభించడం లేదు అన్నారు.అందుకే బీసీ రిజర్వేషన్ శాతం 42% కు పెంచి, ఆ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చడం అత్యవసరం” అని అన్నారు.అలాగే “బీసీలకు న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం సాధించడం.విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని పిలుపు నిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాద సంఘాలు ముందు వరుసలో నిలిచి పోరాడుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, కార్యవర్గ సభ్యులు మర్రి రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కోశాధికారి సాంబశివరావు, సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, గుడిమల్ల రవి కుమార్ , చిల్లా రాజేంద్ర ప్రసాద్ , జి. విద్యాసాగర్ రెడ్డి మరియు గంధం శివ, నారగోని నర్సింగరావు,సాయిని నరేందర్,నల్ల మహాత్మ, గుర్రాల వినోద్ , వి వి రత్నం, జగన్ మోహన్ రెడ్డి , యాకస్వామి , రాచకొండ ప్రవీణ్ , రామచందర్ , శ్రీనివాస్ గౌడ్,తదితర పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు,బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ…

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బిసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కు దుగ్గొండి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని గిర్నిబావి గ్రామంలో గల నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా నిర్వహించి రాస్తారోకో,ర్యాలీ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ
మండల అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు తెలిపామన్నారు.బీసీ రిజర్వేషన్ కులగనన ప్రకారంగా దక్కాల్సిన వాటాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా విద్యా వైద్య ఆర్థిక రాజకీయ ప్రైవేట్ సెక్టార్ లో ప్రాథమిక హక్కుగా భావించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బిజెపి పార్టీ చేస్తున్న నాటకాలను బీసీ కులాలు గమనిస్తున్నాయని అన్నారు. వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేటట్లుగా రెండు పార్టీలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహాలు సృష్టిస్తూ ఇతర హామీలు నెరవేర్చకుండా బీసీ రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చి ఆడ లేక మధ్యలో ఓడినట్లుగా బీసీ బందులో పాల్గొనడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.పార్లమెంటులో చట్టాలు చేసే బిజెపి పార్టీ కూడా బీసీలపై వారి యొక్క విధానాన్ని ప్రకటించకుండా బీసీ బందుకు మద్దతు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల బంద్ కు ముందు నుండి మద్దతు తెలుపుతుంది.కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు వారి పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు రాజకీయపరమైన విధానాలు రూపొందించాలన్నారు. చట్టసభల్లో బీసీ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అమలుపరిచి బిజెపి,కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సత్తా చాటుకోవాలన్నారు లేనియెడల బీసీ ప్రజల యొక్క అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ ఎంపీపీ కోమల భద్రయ్య. టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నియోజకవర్గం కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఊరటి రవి, శంకేశి కమలాకర్, పెండ్యాల రాజు,గుండెగారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్,బండి జగన్,పిండి కుమారస్వామి, భూంపల్లి రజనీకర్ రెడ్డి. కొల్లూరు మోహన్ రావు, గుండెకారి రవికుమార్, ల్యాండే రమేష్,యూత్ నాయకులు మడతలపాటి కుమార్,మాజీ సర్పంచ్ మోడం విద్యాసాగర్ గౌడ్, కుర్ర మధు, ఓడేడి తిరుపతిరెడ్డి,మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ బందులో పాల్గొన్నారు.

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన…

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన

బీజేపీ వల్లనే బీసీలకు అన్యాయం

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135916.842.wav?_=5

 

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=6

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T134704.498.wav?_=7

 

మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు

*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…

*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..

*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…

*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..

*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…

*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..

*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…

_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట( నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T133719.365.wav?_=8

 

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ

బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బిజెపిదే :మండల కాంగ్రెస్ కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిర సిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘా లను కలుపుకొని శాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి అన్ని పార్టీలు బిసి బంద్ ను స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతోనే 100% బీసీలకు బంద్ విజయవంతం చేయడం జరిగింది. దానికి తోడు అన్ని సంఘాలు ఏకమవడం బిసి ఉద్యమానికి మరియు బందు కు మరింత బలాన్ని చేకూ ర్చింది, కామారెడ్డి డిక్లరేషన్ లోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% శాతం కల్పించాల్సిన అవసరం ఉంది బంద్ ఫర్ జస్టిస్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలు,

విద్యాసంస్థలు బందు పాటిం చి మద్దతు ఇవ్వడాన్ని హర్షి స్తూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఉద్యమం జరిగిందని భవి ష్యత్తులో బీసీల హక్కులను సాధించేందుకు తోడ్పడుతుం దని అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసికట్టుగా బిసి హక్కుల కోసం పోరాడాలని స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో 42% వాటా అమలు ఆయ్యేదాకా పోరాటం ఆగదని మనమెంతో మనం మనకంత వాటాన్ని సాధిం చేవరకు ఉద్యమం ఆపద్దని పిలుపునివ్వడం జరిగింది అనంతరం వివిధ పార్టీల నాయకులతో పెద్ద ఎత్తున మాందారిపేట ప్రధాన రహ దారిపై రాస్తా రోకో నిర్వహిం చడం జరిగింది

ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మెంబర్ బాసాని చంద్రప్రకాష్, మాది మార్కెట్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీం దర్, మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి, మారేపల్లి రాజు, మారపల్లి రాజేందర్, చిందం రవి, నిమ్మ ల రమేష్, బండారి పైడి, జిన్నా రాజేందర్, రేణికుంట్ల సదానం దం, రవి పాల్ వివిధ గ్రామాల నుం చి వచ్చిన కాంగ్రెస్ నాయ కులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132744.714.wav?_=9

 

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి…

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి

అఖిలపక్ష ఐక్యవేదిక. మద్దతు

వనపర్తి నేటిదాత్రి .

 

బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతు వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్య వేదిక మద్దతు ఇస్తామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా “సతీష్ యాదవ్.
బి సి బందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతతో తెలుపుతూ వారిని ఆహ్వానిస్తూ వారితో బంద్ లో పాల్గొoటా మని తెలిపారు చేయాలో తెలుసుకుంటూ వారిని ముందు పెట్టి మేము బందును ప్రశాంతంగా విజయవంతం చేయాలని.పిలుపునిచ్చారు,
ఈసమావేశంలో సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా యాదయ్య , టిడిపి నాయకులు కొత్తగొళ్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version