ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి….

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థల కేసులో శాస్త్రీయ,నిష్పాక్షిక వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క డిమాండ్ చేశారు.నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యు సదస్సు జక్కుల విజయ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క మాట్లాడుతూ
కర్ణాటకలోని ధర్మస్థల ఆలయంతో పాటు చుట్టుపక్కల 400 మంది నివేదికల ప్రకారం బాలికలు,మహిళల సామూహిక అత్యాచారాలు,లైంగిక దాడులు,సామూహిక హత్యలు,సామూహిక ఖననంపై అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కొన్ని సమస్యల తర్వాత భట్ తల్లి తనకు ఎప్పుడైనా కూతురు ఉందా లేదా అనే దానిపై తిరగబడటం, విజిల్‌బ్లోయర్ అరెస్టు నివేదికలు వంటి సమస్యలను మళ్లించడానికి అలాగే సమస్యను మతంచేయడం ద్వారా, న్యాయవాదులు,కార్యకర్తలను కించపరచడం, ఆలయ స్థాపనకు నైతిక మద్దతు కవాతులను ప్రకటించడం ద్వారా ఒత్తిడిని పెంచడానికి ప్రచారం జరుగుతోందని తెలిపారు.ధర్మస్థల కేసులో ఆధారాలు, సాక్షులు, న్యాయవాదుల రక్షణ కొనసాగించి ప్రజల పోరాటం నిఘా మాత్రమే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం పిఓడబ్ల్యు నూతన డివిజన్ కమిటీని ఏర్పాటు చేయగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ,ఆకుల శైలజ, డివిజన్ నాయకులు సంధ్య, వీరలక్ష్మి, సుక్కక్కలను ఎన్నుకున్నారు.

రాజీమార్గమే రాజ.. మార్గం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T140614.114-1.wav?_=1

 

రాజీమార్గమే రాజ.. మార్గం..
 13 జాతీయ లోక్ అదాలత్..
ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

శత్రువులను పెంచుకుంటు వెళ్తే శత్రుత్వమే పెరుగుతుందని రాజీ పడితే.. ఇద్దరూ గెలిచినట్టేనని రాజీమార్గమే రాజ మార్గమని నిజాంపేట ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న జరిగే జాతీయలోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-2.wav?_=2

* ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రక్షాబంధన్ అంటేనే అక్కా తమ్ముళ్లు..అన్నా చెల్లెల అనురాగం, మమకారంతో..ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రేమని తీలకంగా పెట్టి..రాఖీని రక్షగా కట్టి..మంగళ హారతిని ఆశీస్సులుగా ఇచ్చి..నోటిని తియ్యగా చేసి..ఆనందించే వనితే సోదరీ..ఏడాదికోమారు అక్కా తమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల అపురూప కలయిక..ఆప్యాయతనురాగాల పొందిక..పవిత్ర బంధాల మేళవింపు..ప్రకాశించే రాఖీ కిరణాల సొంపు..భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాల వేదికగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడెక్కడో ఉండే సోదరీమణులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి..మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్ది కానుకలు ఇస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకొని అనుబంధాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సతీమణి వేముల సునీత హైద్రాబాద్ లో స్థిరపడ్డ తన తమ్ముడు మండల సుమన్ గౌడ్ కు రాఖీ కట్టి తమ్ముడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం ఆమె పండుగ విశిష్టతను వివరించారు. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ (రాఖీ) పండుగను నిర్వహించుకుంటామన్నారు. రాఖీ పండుగపై పురాణాల కథనం ప్రకారం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయన్నారు. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధంలో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బందీ చేసి తీసుకెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ దగ్గరకు వెళ్లి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి ఏం కావాలో కోరుకోమంటే..తన భర్త పురుషోత్తముడిని బందీ నుంచి విముక్తి చేయాలని వేడుకుంటుంది. వెంటనే పురుషోత్తముడిని విడుదల చేసి..సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడనేది చరిత్ర చెబుతుందని..అలాగే దుష్టశక్తులను పార ద్రోలడానికి..యుద్ధంలో విజయం సాధించడానికి..రక్షాబంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మరో కథ ప్రచారంలో ఉందన్నారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, నోములవంటి కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్షను కట్టడంలో ముఖ్య ఉద్దేశం..వారి క్షేమాన్ని కోరడమే..అలాగే ధర్మరక్ష..అంటే ధర్మాన్ని రక్షించడం! ధర్మం అంటే ఇక్కడ మతం అని కాదు..న్యాయాన్ని, సత్యాన్ని రక్షించడం. సహోదరత్వాన్ని, మైత్రీ బంధాన్ని రక్షించడం. బౌద్ధం చెప్పిన జాలీ, దయ, కరుణలను కాపాడుకోవడం. ఇది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినది కూడా కాదు. విశ్వజనుల శ్రేయస్సును ఉద్దేశించి ఏర్పరచుకున్నవి. బౌద్ధంలో సత్యానికి, అహింసకి, శీలానికి, శాంతికి ఎల్లలే లేవు. ఇది చాటి చెప్పడానికి బౌద్దారామాలలో ధర్మరక్షలు ( రక్షాబంధనలు ) కట్టుకుంటారు. దాన్ని ఉపయోగించి రొగ్జానా తన భర్త ప్రాణాల్ని కాపాడుకుంటుంది. అప్పటినుండి అది అన్నాచెల్లెళ్ల..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయ్యింది. మరొక్కసారి హిందూ బంధువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలతో..

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి ;

చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో రాజకీయ ప్రాతినిధ్యం కొరకుకులగనన చేపట్టి 42%బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది ముఖ్యంగా ఇందులో ముస్లిం బీసీలకు స్థానం కల్పించడం జరిగినది ఈ బిల్లును రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ఇంకా దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయివాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం 1852లో అంటర్ కమిషన్ బ్రిటిష్ కాలంలోనేముస్లింలలో ఉన్న బీసీ లకు చట్టబద్ధత చేసింది ముఖ్యంగా ముస్లిం లో ఉన్న బీసీ ఎ బి సి గ్రూప్ లకు చెందిన కులాలైన ఫకీరు మెహతారు దూదేకుల ఖురేషి గారెడి చాకలి మంగలి అత్తరు సాహెబులు పాములు పట్టేవారు 14 కులాలకు చెందిన బీసీ ముస్లింలు దాదాపుగా 37 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయము సమాజంలో ఉన్న హిందూ సోదరులకు తెలుసు కావున 42% బిసి బిల్లుకు అడ్డుపడకూడదని మన తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులను ముస్లిం బీసీ ఏ బి సి గ్రూపులకు చెందిన కులస్తుల తరపున రాష్ట్ర బిజెపి పెద్దలను కోరుచున్నాము అని మహమ్మద్ రాజ్ మహమ్మద్ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-4-1.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జులై 17న ‘నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం, మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకం

 

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ , 4 ఫిబ్రవరి 2024 రోజున కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగనన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం నాలుగు ఫిబ్రవరి 2025న బీసీలకు విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిన్నటి రోజున తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికల పోతామని దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిర్ణయించడం పట్ల పర్ష హన్మాండ్లు హర్షం వ్యక్తంచేశారు,సామాజిక న్యాయాన్ని ఇచ్చిన మాట మేరకు ఆ మాటను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువే నని పర్ష హన్మాండ్లు అన్నారు ,గత మూడు దశాబ్దాలుగా గత పాలకులను ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ,కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కులుగా బీసీల కొరకు మొండి పట్టు పట్టి అమలు చేయడం చారిత్రాత్మకమనీ పర్ష హన్మాండ్లు అన్నారు,ఈ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటారని అదేవిధంగా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు,కోర్టు తీర్పు మేరకు నెల రోజులలో బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని అదేవిధంగా మూడు నెలలుగా ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఆత్రుతగా చూస్తున్న సమయంలో క్యాబినెట్ బీసీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలుగా నేను గర్వపడుతున్నామని కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు ,వాడవాడనా గ్రామ గ్రామాన పట్టణాల అదేవిధంగా నగరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని బీసీ నాయకులకు ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షాన నిలుస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలుగా టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ లు ఇట్టి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు,ఎవరైనా రాజకీయ స్వార్థంతో బీసీలకు ఈ విషయమై వ్యతిరేకంగా చేసిన ఆ పార్టీలను ఎండగడతామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు , బిజెపి పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని అంటున్నదని కేంద్రంలో బీసీ కులగణన చేస్తానని చెప్పి మాట ఇచ్చిందని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది కాబట్టి కేంద్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు, ఈ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం గా మేము ముందుంటామని సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు తెలిపారు, ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేని మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, కోడం రవీందర్ ,అల్వాల మల్లేష్ ।ఇల్లంతకుంట తిరుపతి ,ఆంజనేయులు ,శ్రీకాంత్ ,బోయిని శ్రీనివాస్,తిరుపతి ,కుసుమ ప్రభాకర్,చిందం శ్రీధర్,దామోదర్ ,కొండయ్య, బుర్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ ల ద్వారా అందరికి న్యాయం అదుబాటులోకి.

లోక్ అదాలత్ ల ద్వారా అందరికి న్యాయం అదుబాటులోకి

కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి సిహెచ్ శ్రావణ స్వాతి

పరకాల నేటిధాత్రి

 

 

శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో నిర్వహించారు.పరకాల పట్టణంలోని కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి సిహెచ్ శ్రావణ స్వాతి వివిధ కేసులను రాజీ మార్గము ద్వార పరిష్కరించారు.ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ లోకదాలత్ ద్వారా అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చిందని రాజీ మార్గం ద్వారా సమయాన్ని డబ్బును ఆద చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల బార్ సోసియేషన్ అధ్యక్షులు పెండల భద్రయ్య,లోక్ అదాలత్ సభ్యులు రవికుమార్,సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమార్,రుధిర,ఏసీపీ సతీష్ బాబు,సీఐ క్రాంతికుమార్,ఏజిపి లక్కం శంకర్,లోక్ ఆదాలత్ సభ్యులు ఒంటేరు రాజమౌళి,పోలీస్ సిబ్బంది,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టి 24 గంటలు గడిచిన మృతుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు.

న్యాయం కావాలి.!

న్యాయం కావాలి

‘బంధన్’ బాధితుడు కృష్ణ

⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు
⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు?
⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు
⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు!
⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో!

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

 

తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్ బాధితుడు కృష్ణ వేడుకుంటున్నారు.గత ఏడాది ‘బంధన్’ఆస్పత్రిలో తనకు అన్యాయం జరిగిందని,పలు విభాగాల అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్జరీ,పోస్ట్ ఆఫ్ కేర్‌లో ‘బంధన్’లో జరిగిన క్షమించరాని నిర్లక్ష్యంతో తాను జీవితపు చరమాంకానికి వెళ్లి బయటపడ్డానని వెల్లడించారు.

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసుల కాంక్షతో, వ్యాపార దృక్పథంతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు కంప్లయింట్ చేసి 8 నెలలు దాటుతున్నా కనీస పట్టింపు లేకపోవడం సరికాదని,ఈ లెక్కన వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం,తప్పు చేసిన వారి పైన చర్యలు అంతంత మాత్రమే అనే భావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.

పూర్తి వివరాలతో బాధితుడు కృష్ణ తెలిపిన ప్రకారం బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది జూలై 21న అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కృష్ణకు అదే రోజు సాయంత్రం 6 గంటలకు 4 గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.

ఈ క్రమంలో పెద్ద పేగుకు రంధ్రం పడటంతో రోగి శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అయి పరిస్థితి విషమించింది.

ఒకరోజు తర్వాత అది గ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యులను అడగగా ఎవరూ స్పందించకపోవడంతో ఆపరేషన్ వికటించిందని భావించి జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్‌కు తీసువెళ్లారు.

అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.దాంతో ఆ రాత్రే బేగంపేట మెడికవర్ హాస్పటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

 

⏩పెద్దలతో ‘బంధన్’కు బంధాలు..!

 

 

మెడికవర్ ఆస్పత్రికి చేరుకునే సరికి రోగి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది.

 

మరో 6గంటలు ఆలస్యం అయితే ప్రాణానికి ప్రమాదమని అక్కడి సీనియర్ వైద్యులు తెలిపారు.

అక్కడ ట్రీట్‌మెంట్ అనంతరం బాధితుడు కృష్ణ తన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత బంధన్ హాస్పిటల్‌కి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై నిలదీశాడు.

దానికి వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానాన్నిస్తూ తమ వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హాస్పటల్ రాజకీయ నాయకులదేనని బెదిరిస్తూ వస్తున్నారు.

 

‘మా బంధన్’ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఓ మంత్రినే’అని తెలుసుకోవాలని బెదిరించినట్టు బాధితుడు ఆరోపించాడు.

 

తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఆధారాలతో హన్మకొండ డీఎంహెచ్‌వోకు,ఐఎంఏ వాళ్లకు ఫిర్యాదు చేశాడు.

 

ఐఎంఏ పెద్దల ముందు తాము బాధితుడు కృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించామంటూ ఒప్పుకున్నారు.

 

కానీ, ఆ హాస్పిటల్ మీద వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ ఐఎంఏ డాక్టర్లు స్పష్టం చేశారు.

 

 

⏩రిపోర్ట్‌కు ఇంకెంత టైం కావాలో?

 

 

అనంతరం బాధితుడు డీఎంహెచ్‌వోను గతేడాది నవంబర్‌లో సంప్రదించగా..

 

16 డిసెంబర్ 2024న వరంగల్ ఎంజీఎం
సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్(నిపుణుల) కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.

కానీ ఎంజీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాకపోవడంతో బంధన్ హాస్పిటల్‌పై, వారి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారని బాధితుడు కృష్ణ వెల్లడించారు.

 

ఈ ఏడాది కాలంలో బంధన్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు రెండు,మూడు జరిగాయని, అందులో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారని కృష్ణ వివరించారు.

 

ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఎంక్వయిరీ పూర్తి చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని.!

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని
రజత్సోహలు చేస్తున్నారు??

కొత్తగూడ నేటిధాత్రి:

60 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలతో శ్రీమతి సోనియా గాంధీ చల్లని చలువతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు టిఆర్ఎస్ పరిపాలించి ఏ పేద వాళ్లకు న్యాయం చేశారు ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మించి ఇచ్చారు ఎన్ని గ్రామాలలో రోడ్లు నిర్మించి అభివృద్ధి చేశారు పేదవారికి రైతు బందు పేరిట పది రూపాయలు ఇచ్చి పెద్దవారికి దొరలకు భూస్వాములకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రైతుబంధు ఇచ్చారు మీరు దోచుకుని తిన్నందుకా రజోత్సవాలు,ఏజెన్సీ మండల లో తరలుగా వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన గిరిజనేతరుల భూములను హరితహారం పేరుతో మా భూములు గుంజుకున్నాందుక.
మీ రజత్సహలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు తోలక్షల కోట్లు
దొచుకున్నందుక రథోత్సవాలు నీళ్లు నిధులు నియామకాల అని ఊకడు దంపుడు ఉపన్యాసాలు తప్ప మీరు ఎన్ని ఉద్యోగలు ఇచ్చారు ఇంటింటికి ఉద్యోగం పేరుతో గద్దెనెక్కిన మీరు మీ కుటుంబంలో మాత్రం నాలుగైదు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధహస్తాలతో విచ్చిన్నం చేసి ఎక్కడికక్కడ దోచుకొని తిన్నారు నిరుద్యోగులను గాలికొదిలేసి కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి పేరుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని మీరే చెప్పి పేపర్లు లీకులు చేసి వాటి మీద కేసులు వేసి తప్పించకు తిరిగారు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు హడావిడిగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసి వారి చావులకు కారణమైనందుకా బి ఆర్ ఎస్ నాయకులు రజత్సోవాలు జరిపేది దొడ్డు బియ్యం పంపిణీ చేసి దళారుల చేతికి పంపించి వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజలకు పంచి గప్పాలు కొట్టారు మీ ప్రభుత్వ హాయంలో ఏనాడైనా పేదవారిని పట్టించుకున్నారా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించార సన్న బియ్యం పంపిణీ చేయమని మాట్లాడితే రెండు వేల కోట్లు కావాలని మాట్లాడిన మీరు సంపద సృష్టిస్తాం సంపద పెంచడం పేదలకు పంచుతామని గొప్పలు చెప్పిన మీరు సంపద పెరిగింది అలాగనే మీ ఆస్తులు పెరిగాయి ఆ రూపాయల తోనే లతోనే ఈరోజు రజోత్సవాలు జరుపుతున్నారు.. మీరు పేదవాలని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని మరొక్కసారి గుర్తు చేస్తున్నామని
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు…

జర్నలిస్టులకు న్యాయం చేయండి.

జర్నలిస్టులకు న్యాయం చేయండి.

డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం…

రెండో రోజు రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల మద్దతు.

జర్నలిస్టుల డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

 

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మొదలైన దీక్ష, పాలకులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. యూనియన్ సంఘాలకు అతీతంగా కూడు గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు సీపీఐ సిపిఎం నాయకుల మద్దతుతో పాటు, విద్యార్థి సంఘాల సంఘీభావం ప్రకటించారు. ఎవరు కలిసొచ్చినా స్వాగత్తిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల నిరాహార దీక్షలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘం నేతలు, కార్మిక యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం, నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా మూడు రోజుల దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్యగా పరిగణలోకి తీసుకుంటామని కనీస హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసోచ్చే పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నామని అసత్య ప్రచారాలు బురదజల్లే ఆలోచనలు మానుకోవాలని కొందరి నాయకులకు దీక్ష శిభిరం నుండి సూచించారు. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కులు సాధన కోసమేనని అందులో ఎక్కడ పదవులు అధికారం లేదని తేల్చి చెప్పారు.

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

బహుళ జాతి మొక్కజొన్న సాగు చేసి అప్పుల భారంతో యువ రైతు మృతి…

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

మృతుని కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తానన్నుఆర్గనైజర్

ప్రభుత్వ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు.

రైతుల గోడు పట్టించుకోని అధికారులు…రైతులక, ఆర్గనైజర్లక,

మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆర్గనైజర్ లను వెంటనే శిక్షించాలి..

ఈ ప్రాంతంలో ఆదివాసి ఐకాన్

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి బాండ్ డీలర్ షిప్ ఆదివాసులకే ఇవ్వాలి..

ముందస్తు అరెస్టులు ప్రజలు ఖండిస్తున్నారు…

నూగుర్ వెంకటాపురం

నేటి ధాత్రి / మర్చి 22

 

బహుళ జాతి మొక్కజొన్న హైటెక్ విత్తనం వేసి అప్పుల భారంతో ఆదివాసీ యువ రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా,వెంకటాపురం మండలం,చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో చిరుతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా,లేకం మధు అనే వ్యక్తి(26),తండ్రి వెంకన్న వెంకటాపురం గ్రామానికి చెందిన,హైటెక్ బహుళ జాతి కంపెనీ చెందిన ఆర్గనైజర్ హైటెక్ సమస్ట మొక్కజొన్న సాగుచెయ్యమని,ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తాయని,మాయమాటలు చెప్పగా దీన్ని నమ్మివ్యవసాయం చేసి పంట నష్టం రావడం తో పురుగు మందు త్రాగి మృతి చెందాడు. లేకం మధు అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని,అదే భూమిలో హైటెక్ అనే బహుళ జాతి విత్తన ఉత్పత్తి సాగు చేయగా,ఎకరానికి ఒకటన్ను చొప్పున రెండు టన్నులు రాగా ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ఆ రైతు అప్పుల భారంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గుర్తుతెలియని క్రిమి సంహారకం మందు తాగాడు. కుటుంబ సభ్యులుగమనించి ఏరియా ఆసుపత్రి తరలించారు, అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ములుగు ఆసుపత్రి కి తరలించారు. అక్కడ పరిస్థితి పూర్తి విషమంగా మారడంతో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5గంటలకు మృతి చెందాడు. దీనితో అతని కుటుంబ తీవ్ర దిగ్బాంతినికి గురయ్యారు. వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించి ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని లేఖం మధు మృత దేహం తో ప్రధాన రహదారి పై రాస్తా రోకో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.దీనితో ప్రధాన రహదారి పై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసు కున్న పోలీస్ శాఖ అధికారులు సిఐ బండారి కుమార్, ఎస్సై కె తిరుపతి రావు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఫ్ సిబ్బంది తో ప్రజలకు, ఎవరి ఏ హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.హైటేక్ బహుళ జాతి మొక్క జొన్న కంపెనీ ఆర్గనైజర్ వచ్చి చనిపోయిన ప్రతి రైతుకు నష్టం పరిహారం ఇస్తానని అనడం తో రాస్తా రోకో విరమింప జేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు, ఆదివాసీ రైతులు, పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు న్యాయం.

బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్,

శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు,ధన్యవాదాలు తెలిపిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దస్రు నాయక్

అనంతరం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:- 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లును చట్టసభలో ఆమోదంతో బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని నిరూపితమైంది..

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల న్యాయం చేస్తుందని మరోసారి రుజువైంది.
ఎవరు చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు.
బీసీ బిల్లును కేంద్రం బిజెపి అడ్డగుడ్డ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు..

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దపిట వేస్తున్నాను చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ప్రవేశపెట్టడమే నిదర్శనం..

ఎన్నికల్లో హామీ ఇచ్చినం మాట ప్రకారం రాష్ట్రంలో కులగరణ పూర్తి చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..

దేశవ్యాప్తంగా కులగనన చేపట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితులను చేస్తానని చెప్పి కేసీఆర్ గెలిచాక తానే గద్దనికి దళితులను అవమానించారు అని గుర్తుచేశారు..

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అథారిటీ సభ్యులు రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, ఎండి తాజోద్దీన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, యాదగిరి, వీరన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, పోలేపల్లి వెంకట్ రెడ్డి,రాము, వేణు,కొండ సురేష్, కొమరయ్య, సాట్ల శ్రీను,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు, భూలోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గందసిరి వెంకన్న, పోకల శ్రీనివాస్,తరాల సుధాకర్, సామల నరసయ్య, ఏలేందర్ బన్నిచెట్టి వెంకటేష్, బద్య, హనుమ, బాల,ముజ్జూ, సుందర్ వెంకన్న, బాదవత్ సుమన్,బాలు, పిల్లి రమేష్, వెంకన్న, ఎండి నవాజ్, మామిడి శెట్టి మల్లయ్య, సారయ్య,అరుణ్,రఫీ,సిద్దు,అలీమ్,ఏకాంత చారి,సుధాకర్, గొట్టం రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్..

హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా..

ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి…

న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం..

గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు..

మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్..

నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి )

మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం

College’s

న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఏజెన్సీ న్యాయ కళాశాల సాధన సదస్సు వెంకటాపురం మండలం లోని కాఫెడ్ గ్రౌండ్ లో జరిగింది. జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి గిరిజన ప్రజా ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తున్నాయని ముఖ్య అతిధులుగా పాల్గొన్న పాయం సత్యనారాయణ,కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్ కుమార్ మండిపడ్డారు. జి ఎస్పీ ముందుకు తెచ్చిన న్యాయమైన డిమాండ్ న్యాయ కళాశాల అన్నారు. ఆదివాసీలను న్యాయ వ్యవస్థలు విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అన్యాయానికి గురయ్యేది ఆదిమ తేగలని తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీలు న్యాయ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని నాయకులు అన్నారు.ఏజెన్సీ నుండి రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేడని నిలిదిశారు..బహుళజాతి విదేశీ విత్తన కంపెనీలను గిరిజనేతరులు ఏజెన్సీ లోకి తెచ్చి ఆదివాసీ రైతులను దగా చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదన్నారు. కాంగ్రెస్, భారాసా పార్టీలను అడ్డుపెట్టుకొని ఆదివాసీ రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా దారుణాలకు పాల్పడుతున్న కంపెనీ ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమిమ్  అక్తర్ గారి రిపోర్టులో ఉన్న లోపాలను సరి చేసి మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి …

-అబ్రహం మాదిగ
మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహాజన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు
ఇచ్చిన కార్యాచరణలో భాగంగా జహీరాబాద్ పట్టణ కేంద్రంగా ఐబీ నుండి అంబేద్కర్ కూడలి వరకు  ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మైసగాళ్ళ బుచెంద్ర ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు మట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్లుగా జరిగిన పోరాటం మాదిగలకు న్యాయంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వాట రావాలని పోరాటం చెయ్యటం జరిగిందని కానీ ఇప్పుడు తెలంగాణాలో అత్యధికంగా జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రావల్సి ఉండగా కమిషన్లో ఉన్న లోపం కారణంగా మాదిగలకు 9 శాతం మాత్రమే వచ్చిందని దానిని వెంటనే సవరించి మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మరియు రేపు ప్రభుత్వం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని లేని పక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతమని హెచ్చరించారు. మరియు ఉమ్మడి ఎస్సీలను మూడు గ్రూపులుగా కాకుండా గతంలో ఉండే విధంగా నాలుగు ఏబిసీడీ లుగా వర్గీకరణ చెయ్యాలని కోరారు.

justice

ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పిఎస్ జహీరాబాద్,ఝరాసంగం, కోహీర్ మండల అధ్యక్షులు టీంకు  మాదిగ, మైకల్ మాదిగ, రవి మాదిగ, రాంచందర్ mef జిల్లా అధ్యక్షులు,ఎమ్మెఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జైరాజ్ మాదిగ, నవీన్ కుమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ,మంచేందర్ PACS చైర్మన్, జైరాజ్, భాస్కర్ జడ్పీటీసీ, శ్రీనివాస్,ప్రవీణ్ ఏఈ,నర్సిoములు, రాజు,చిన్న, సుదీష్ కుమార్, అజయ్, కుమార్, పవన్, లాజర్, సురేష్, విల్సన్, ప్రభాకర్, మనోజ్, సంపత్, ప్రణయ్, కిట్టు, జనార్దన్, ప్రవీణ్, చిట్టీ, లాజర్, శ్రీనివాస్,శాంసన్, ఇమ్మానుయేల్, అభిషేక్, ప్రణయ్, నర్సింహా, సూర్యకాంత్, రమేష్, దిలీప్, దింపుల్, అబ్రహం,ప్రశాంత్, జ్యోతుల్, షాలేం,మనీష్, సురేష్, మూర్జల్, ధనరాజ్, విద్యాసాగర్, సోను, జనార్దన్, మాణిక్యం,అజీమ్, మహేష్, బన్నీ,పెంటన్న,నిర్మల్,దేవయ్య,జైపాల్,సుధాకర్, జీవన్,అనిల్, ప్రభాకర్, అమృత్,శ్యామ్ సుందర్,రాజేందర్,సతీష్, రాహుల్, అనిల్, పవన్, ముత్తర్గల్లా రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి.

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము లోని డోరే కులానికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలంగాణ రాష్ట్ర నాయకులు మాజీ హోమ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ను కలసి ఎస్సి బీ నుండి ఎస్సి సి మార్చాబడింది తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని మా కులానికి యధావిధిగా ఎస్సి బీ కొనసాంగించాలని డోరే కుల పెద్దలు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ము లో మా డోరే కులం కేవలం 2 వేల జనాభా నే కులగణన లో చూపడం జరిగింది .కానీ తెలంగాణలో మొత్తం జనాభా సుమారు ఆరు వేల పైచిలుకు ఉంటుంది.డోరే రాష్టఅధ్యక్షులు దత్తు, మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. జాహిరాబాద్ తాలూకా నుండి పవనకుమార్ డి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారి.

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన కమ్మరిగూడెం రైతులు..

మొక్కజొన్న బహుళ జాతి కంపేనీ చేత మోసపోయా..

మోసపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి.

నూగుర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ),మార్చి 3 ములుగు జిల్లా వెంకటాపురం మండలం

బహుళ జాతి కంపెనీ మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని కమ్మరిగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నాడు వ్యవసాయ అధికారి జాడి ప్రియాంకకు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ. ఎకరాకు 4 టన్నులు వస్తుందని మాయ మాటలు చెప్పి బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా సింగెంటా కంపెనీ వెంకటాపురం డీలర్స్ మాతో పంట సాగు చేయించారు.ఒక ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా రాలేదని, పండించిన పంట కూలీలకు మాత్రమే సరిపోతుందని వాపోయారు,ఇంకా పెటిలైజర్ షాపులకు ప్రతి ఎకరానికి 50వేల రూపాయలు అప్పు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఇలా అప్పుల పాలైతే మరణమే మార్గమని అన్నారు.ప్రభుత్వం స్పందించి నష్ట పోయినా ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మరిగూడెం రైతులు పూనెం శ్రీను,విజయ్,రవి,ప్రసాద్ , సొయం నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version