ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు…

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.

#రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ .

# 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం.

# రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం.

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో భారీ బాణాసంచా పేల్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయంపాలన లక్ష్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం పెద్ద చెరువు సమీపంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ , సర్పంచులు నాగేల్లి జ్యోతి ప్రకాష్,, పులి రమేష్, మచ్చిక రవి, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్‌చార్జులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిళ్ళ మోహన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్ గౌడ్,మండల సర్పంచుల ఫోరం మాజీ చైర్మన్ నాన బోయిన రాజారాం యాదవ్‌ మాజీ సర్పంచులు గుండాల కుమార స్వామి, గన్నె బోయిన చేరాలు, ఊరటి అమరేందర్, గోనెల పద్మ నరహరి, మాజీ ఎంపీటీసీ లు జన్ను జయరావు , వైనాల వీరస్వామి, పోడేటి ప్రకాశం, పాలెపు రవీందర్ రావు, అభివృద్ది కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, మద్ది మేడారం మాజీ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి, బోట్ల పవన్, పాండవుల రాంబాబు, వార్డు సభ్యులు నాగేల్లి అనిల్, కనకం నవీన్, మాజీ ఉప సర్పంచ్ దాసరి నాగేశ్వర్ రావు, గుండాల శ్రీశైలం, పోతునూరి సుభాష్, బూస సదయ్య, వేల్పుల రవి, మైల గాని సురేష్, గోల్య, సురేందర్, పుట్ట రవి, చందర్, రాజు యూత్ నాయకులు మేడిపల్లి రాజు, సద్దాం, మధు, రెడ్డి ప్రశాంత్, గుండాల సుమన్, పెండ్యాల మహేందర్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ఎన్నికలలో ఆర్యవైశ్య లు పోటీ చేయాలి న్యాయ వాది రామకృష్ణ

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈకార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజెపి నేత బచ్చురాo కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజ్ లగిశేట్టి అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కోట్ర రామకృష్ణ న్యాయవాది దార వెంకటేష్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ మాజీ వర్తక సంగం అధ్యక్షులు లగిశెట్టి నరసింహ లగిశెట్టి సాయి ప్రసాద్ వర్తక సంగం ట్రెజరర్ వై వెంకటేష్ దోమ శివ కె.బి శ్రీనివాసులు బొడ్డు శంకర్ చుక్కయ్య వజ్రాల సాయిబాబా కాలూరి భాస్కర్ కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిన్నo వసంత నరేందర్ మాజీ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ ఆర్యవైశ్యులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా న్యాయవాది కొట్ర రామకృష్ణ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున పోటీ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్యులు మున్సిపల్ 33 వార్డులో పోటీ చేయుటకు ముందుకు రావాలని నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయంగా ఆర్యవైశ్యులు బలోపేతం కావాలని కోరారు గత మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గద్వాల్ మున్సిపాలిటీలో ఆర్య వైశ్యులు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించారని కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు .మున్సిపల్ కౌన్సిలర్లు గా ఆర్యవైశ్యులు విజయం సాధించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం…

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధన కొరకై యువత ముందుకు నడవాలి.

అంబేద్కర్ ఆశయ సాధన కొరకై యువత ముందుకు నడవాలి.

#భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కుతుందని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి,సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మాజీ ఎంపీటీసీలు వైనాల వీరస్వామి, జన్ను జయరావు , వార్డు మెంబర్లు కనకం నవీన్, నాగేల్లి అనిల్, పరికి కోర్నేలు, బూస సదయ్య, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.

మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.

#గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

దేశ స్వాతంత్ర్య కాంక్ష సాధనలో ఎంతోమంది మహనీయుల త్యాగం ఉంది వారి జీవిత పోరాటా స్ఫూర్తి మన అందరికీ ఆదర్శం అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 77 ఏళ్లు పూర్తి చేసుకోవడం హర్షనీయమని దేశాన్ని హక్కుల సాధన దిశగా మార్పు గావించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పనకు ఎంతో కృషి చేశారు. ఇప్పటికీ మన దేశాలు భారత రాజ్యాంగంలోని అనేక అంశాలను ఆదర్శంగా తీసుకొని పాలన చేయడం భారతీయులకు ఎంతో గర్వకారణం. ఈ దేశానికి ఎంతోమంది మహనీయులు చేసిన సేవ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని వాళ్ళ ఆశయ సాధన కొరకు మనమంతా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్,ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, నాయకులు నాన బోయిన రాజారాం, పాండవుల రాంబాబు, ఖ్యాతం శ్రీనివాస్, గుండాల కుమారస్వామి, పోడేటి ప్రకాశం, జన్ను జయరాజ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, మంద రాజన్న, బూస సదయ్య, వేల్పుల రవి, మహేందర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లి లో కొత్త పాలక వర్గం ఘన సన్మానం

నూతన పాలక వర్గానికి ఘన సన్మానం.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల లోని మూడు చెక్కలపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సపావత్ కవిత దేవ్ నాయక్, ఉప సర్పంచ్ ఇస్లావత్ స్వరూప నెహ్రూ, వార్డు సభ్యులకు స్థానిక ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధితోపాటు పాఠశాల అభివృద్ధి చేసే విధంగా పాలనా సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్య రమేష్, ఇస్లావత్ రవీందర్, సపావట్ స్వరూప, బానోతు విజయ, ప్రేమ్ కుమార్, లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు దేవీలాల్, వార్డెన్ స్వరూప, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు….

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన శుభాకాంక్షలు , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ సంగారెడ్డి జిల్లా కార్య కార్యదర్శి వరప్రసాద్ కార్యక్రమంలో మండల మొగుడంపల్లి అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, అధ్యక్షుడు , మొగుడంపల్లి యూత్ అధ్యక్షులు మహేష్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు 60 మంది చేరడం జరిగింది తెలంగాణ రాజాధికారి పార్టీలో అందరూ కలిసి తీన్మార్ మల్లన్న జన్మదినాలు జరుపుకోవడం జరిగింది,

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత…..

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందివ్వాలని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎస్ ఆర్ ఎస్ పి భూముల ఆక్రమణ జరగడంతో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై న్యాయంగా చట్టబద్ధంగా పోరాటం చేయటంతో సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూముల ఆక్రమణ అంశంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి సొంత గ్రామ అభివృద్ధికి సహకరించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు తోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానని కొందరు నాపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని. నా సొంత స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వేసుకొని చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పోరాడతానని. దానికోసం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామ ప్రజల వెంట ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కొరకై పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి…

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.

#గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూపర్డెంట్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అందుకనే నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రతి గ్రామ పంచాయతీ లో మీమే ఫోటోను పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకుడు బచ్చు వెంకటేశ్వరరావు, నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, శివ, కొండ్లె రమేష్ నవీన్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.

#కెనాల్ సరిహద్దు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి.

#అక్రమ నిర్మాణాలు చేసేవారికి నోటీసులు జారీ.

#డిబిఎం 38 కెనాల్ భూమిపై భారీ వాహనాలు వెళ్ళకూడదు.

#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.

#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.

మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-11T120952.778.wav?_=1

 

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

#కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

నల్లబెల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా కష్టపడి పనిచేస్తానని. అదేవిధంగా గ్రామంలో గత పాలకుల సమయంలో చేయని పనులు ఎన్నో తిష్ట వేశారని వాటిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సిసి రోడ్, డ్రైనేజీ, సెంటర్ లైటింగ్ పనులు, అర్హులైన వారికి పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్ మహాశయులను ఆమె అభ్యర్థించారు.

“ఎన్నికల నియమాలు తప్పనిసరి: తహసిల్దార్”

అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నియమావళి పాటించాలని తహసిల్దారు ముప్పు కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చులను ఎప్పటికప్పుడు వివరించాలని. అభ్యర్థులు ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా సామరసంగా ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చంద్రకళ, ఎంపీడీవో శుభానివాస్, ఏఎస్ఐ కీరు నాయక్, ఎన్నికల అబ్జర్వర్, సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.

“పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ 11వ వార్డు అభ్యర్థి”

ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా.

#పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి).

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నల్లబెల్లి మండల కేంద్రంలో బిజెపి బలపరిచిన 11వ వార్డు అభ్యర్థిగా పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి) బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వ వార్డు సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచానని. వార్డులో ఉన్న ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని. సమస్యలపై గళం వినిపించేందుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలపై పోరాడి పరిష్కారం చేస్తానని. అలాగే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో ఉమారాణి..

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో ఉమారాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీవో ఉషారాణి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుండి నామినేషన్ తీసుకునే(9) క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, పంచాయతీ కార్యదర్శులు ధర్మేందర్, రజిత, ప్రశాంత్, కారోబార్ పులి చక్రపాణి సిబ్బంది తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం.

#పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న హారిక, మహాలక్ష్మి, అక్షితలు ఇటీవల రాష్ట్రస్థాయి రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం హర్షినియమని పి ఆర్ టి యు టీఎస్ మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ అన్నారు. శనివారం మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించి ఎంపిక కావడానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, ఉపాధ్యాయ బృందాన్ని ఈ మేరకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు లడే రవీందర్, శ్రీధర్ బాబు, పురం బద్రీనాథ్, జిల్లా బాధ్యులు నాగరాజు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మజ, ప్రమీల, భారతి, రజిత, మనహళ్ రావు, ప్రశాంత్, రాము, బలరాం నాయక్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘా నాయకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T160649.588-1.wav?_=2

 

 

అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘా నాయకులు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను గురువారం తనిఖీలో భాగంగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి రాగా విషయం తెలుసుకున్న ఏ బి ఎస్ ఎఫ్, టిడివివి సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ ఆధ్వర్యంలో గురుకుల వసతి గృహాల్లో నిలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, సంక్షేమ గురుకుల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చలి తీవ్రతో ఇబ్బంది పడుతున్నారని. చలి తీవ్రత నుండి విద్యార్థులకు విముక్తి కల్పించే విధంగా మండలంలోని గురుకుల పాఠశాల వసతి గృహాల్లో గ్రీజల్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని. అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల కాంపౌండ్ చుట్టూ సోలార్ వైర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.

లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T165746.941.wav?_=3

 

లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

#రాజీ పడటమే రాజమార్గం

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో పలు కేసులలో సతమతమవుతున్న బాధితులు రాజీ పడడం వలన వారి భవిష్యత్తుకు లోక్ అదాలత్ దోహద పడుతుందని ఎస్సై వి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈనెల15న నర్సంపేట కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ ను మండల పరిధిలో ఉన్న పలువురు పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సద్వినియోగం చేసుకోవాలని. అలాగే క్రిమినల్, సివిల్ ఆస్తి తగాదాలు, కుటుంబ పరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సత్వర పరిష్కారం లభించే అవకాశం లోక్ అదాలత్ లో దొరుకుతుందని అలాగే ఇరువర్గాల వారు రాజీ పడడంతో సమస్య పరిష్కారం కావడమే కాకుండా కక్షిదారుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version