*చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)..
చిత్తూరు నేటి ధాత్రి:
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, జిల్లా అధికారులు జెడ్ పి సీఈఓ రవికుమార్ నాయుడు,పి ఆర్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి,విజయ్ కుమార్,డ్వామా,హౌసింగ్ పిడి లు,డిఇఓ, వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణ,డి ఆర్ డిఏ,పిడి, శ్రీదేవి,జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి,సీపీఓ శ్రీనివాసులు ఎల్డిఎం హరీష్,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు,డి ఎం హెచ్ ఓ, సుధారాణి, డి ఎస్ ఓ శంకరన్,చిత్తూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత జిల్లా అధికారులు హాజరు అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి, శాఖల వారీగా అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం ఆయన చేశారు, అర్హులైన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపి, దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు..
నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని ఆయన వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన గీతమని, స్వాతంత్ర్య సమరయోధులందరిలో ఉత్సాహానికి, శక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ తీసుకొని రాగలరు
ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు గాను 2025 – 27 సంవత్సరాలకు గాను ఏ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ తేదీ 23.10.2025 నాటికి ముగిసింది. భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లోని మొత్తం (59) మద్యం దుకాణాలకు గాను 1,863 దరఖాస్తులు రావడం జరిగింది. దరఖాస్తు ఫీజు రూపంలో 55 కోట్ల 89 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో అత్యధికంగా మల్లంపల్లి గ్రామం మండలం మద్యం షాపుకు 77 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. 27.10.2025 సోమవారం రోజున మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను భూపాలపల్లి పట్టణం, మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ రాహుల్ శర్మ సమక్షంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ తేదీ 27.10.2025 సోమవారం ఉదయం 9 గంటల వరకు ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ కు హాజరు కావాల్సిందిగా ఆయన సూచించారు. దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని రావాలని ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ సూచించారు
కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్
భూపాలపల్లి నేటిధాత్రి
గోరక్షణ కార్యకర్త ప్రశాంత్ సింగ్ (సోను) పై జరిగిన గన్ ఫైరింగ్ ఘటనకు సంబంధించి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ “గోరక్షణ ధర్మం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాక, మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన బాధ్యత. గోమాతను కాపాడటం ద్వారా మనం సమాజానికి, సంప్రదాయాలకు, పౌరహక్కులకు రక్షణ కల్పిస్తున్నాము. ఇలాంటి పవిత్రమైన సేవలో నిమగ్నంగా ఉన్న కార్యకర్తలపై దాడులు జరగడం అత్యంత బాధాకరమని, తీవ్రంగా ఖండించదగినదని చెప్పాలి. ప్రశాంత్ సింగ్ (సోను) వంటి గోరక్షకులు సమాజంలో ధర్మం, సత్యం, జాగృతి కల్పించే కార్యక్రమాలలో అంగీకారపూర్వకంగా పాల్గొంటున్నారు. వారిపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపైన కాక, గోరక్షణ ధర్మంపై ప్రత్యక్ష దాడిగా భావించవలసినది. ఇది సమాజంలో భయభ్రాంతిని సృష్టించే మాత్రమే కాక, గోరక్షకుల సేవను నిర్లక్ష్యం చేయడం అని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి, దోషులను కఠిన చర్యలతో శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా, గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం అత్యవసరము. గోరక్షకుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్ సురక్షా చర్యలు, సమగ్ర నియంత్రణలు తీసుకోవడం తప్పనిసరి. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గోరక్షకుల పక్కన నిలుస్తుంది. గోమాత రక్షణకు అంకితభావం కలిగిన ప్రతి కార్యకర్తకు మేము మద్దతుగా ఉంటాము. గోమాతకు ఉన్న భక్తి, గౌరవం ఎవరూ దెబ్బతీయలేరు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక, మన దేశ సంస్కృతి, మన ధర్మానికి సంబంధించిన అంశమని గట్టి విశ్లేషణతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.
ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసి, నిమ్డ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జహీరాబాద్ నిజ్జా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1501 ఎకరాల భూమిని సేకరించి నిమ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మిగిలిన భూమిని కూడా త్వరలో నిమ్ కు అప్పగించాలని సూచించారు.
శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి
బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు
గణపురం భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసరం జయశంకర్ జిల్లా లోని ఇసుక క్వారీ ల వద్ద ఇసుక లోడింగ్ కీ వెళ్లిన లారీలా దగ్గర అదనముగా డబ్బులు వసూలు చేస్తున్నారు టి ఎం ఎస్ డిసి వారు 14 టైర్ల లారీ కీ 32 టన్నులకు డబ్బులు తీసుకోని లోడింగ్ దగ్గర మాత్రం 30 టన్నులు మాత్రమే ఇసుక నింపుతున్నారు దీని వలన నేరుగా వినియోగ దారుని మీద సుమారుగా ఒక్క లారీ కీ పది వేళ రూపాయలు అధిక భారం పడుతుంది అలాగే గత ప్రభుత్వం జయశంకర్ జిల్లా ను స్థానిక జిల్లాగా గుర్తించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్పెషల్ అలాట్మెంట్ చేసేది కానీ ఇప్పటి ప్రభుత్వం స్థానికతను తుంగలో తొక్కి స్థానిక వినియోగదారుల మీద స్థానిక లారీ ఓనర్ల మీద ఉక్కు పాదం మోపుతుంది కావున పై అంశాలపై టీజీఎండిసి ఎండీ తో చర్చించి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలి అని స్థానిక జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి ఎర్రబెల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు?.ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు?. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి, తహశీల్దార్లు రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తహసిల్దార్ కార్యాలయానికి అనునిత్యం అనేక పనుల కోసం మండల ప్రజలు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడంతో గమనించిన దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రత పాటించాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టగా. దానిని తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది విస్మరించి మండల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థమవుతుంది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై చెప్పవలసిన అధికారులే కార్యాలయం వద్ద శుభ్రత పాటించకపోతే గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదిఏమైనాప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే కలెక్టర్ స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎలాంటి సమాచారం లేకుండా రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. పరిష్కా రంలో అధికారులు జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
భూభారతి దరఖాస్తులు ఎన్ని వచ్చాయో,వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యాలయం ఎదుట ఉన్న భూభారతి కానీ ప్రజల సమస్యలను అడిగి తెలుసు కుని స్థానిక తాసిల్దార్ కు ఆదేశించారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తహసిల్దార్ సత్యనారాయణ, అన్ని శాఖల ప్రభుత్వ అధి కారులు, ఎస్సై పరమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పరికరం ఏర్పాటుకు చేపట్టిన పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా నవీన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు బుధవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా నలుగురు టీచర్లు బోధన నిర్వహిస్తున్నారని డిప్యూటేషన్ పై ఇద్దరు టీచర్లను పంపిస్తే తమ పిల్లల చదువులు అర్థవంతం అవుతాయని డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వడ్ల ప్రవీణ్, కోమ్మిడి జీవన్ రెడ్డి, రాజు రెడ్డి, సౌడ స్వామి లు ఉన్నారు.
ధర్మసమాజ్ పార్టీ నడికూడ మండల కమిటీ ఆధ్వర్యంలో స్టడీ టూర్ లో భాగంగా నడికూడ మండలం,కౌకొండ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలని సందర్శించి హెడ్మాస్టర్ సురేందర్ సార్ నుండి అనేక రకాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు చుక్క రత్నాకర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉంది.ఈ పాఠశాలకు పెద్ద సమస్య ఏంటంటే సైన్స్ ల్యాబ్ కోసం శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభించి ఆరు నెలలు అవుతుంది ఆ పనిని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేశారు పిల్లర్స్ కోసం సలాకులు ఏర్పాటు చేశారు కానీ కాంక్రీట్ పోయకుండా వదిలేసేసరికి సలాకులు మొత్తం తుప్పు పట్టి బిల్డింగ్ స్థలంలో పిచ్చి మొక్కలు విపరీతంగా మొలిచి చాలా అధ్వానంగా ఉంది.దీనికి కాంట్రాక్టర్ భాస్కర్ నిర్లక్ష్యం వల్లనే ఈ బిల్డింగ్ పూర్తి కాక విద్యార్థులు సైన్స్ ల్యాబ్ కోసం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాంట్రాక్టర్ స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని,డిమాండ్ చేస్తున్నాం.కలెక్టర్ పర్యవేక్షించాలని కోరుతున్నాం అదేవిధంగా పాఠశాలలో పి, ఈ, టి, టీచర్ ని నియమించాలని డిఈఓ ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే పాఠశాలలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలని సందర్శించడం జరిగింది.4 వ అంగన్వాడి కేంద్రానికి శాశ్వత బిల్డింగ్ కోసం 2010 లో 13 లక్షల బడ్జెట్ తో సాంక్షన్ అయినా ఈ బిల్డింగ్ కి పిల్లర్స్,పై కప్పు వేసి దానిని పూర్తిగా నిర్మాణం చేయకుండా కాంట్రాక్టర్ భగవాన్ రెడ్డి నిర్లక్ష్యంతో అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.15 సంవత్సరాలుగా పిల్లలు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఆ కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మేకల ప్రవీణ్, ధర్మ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పూరెల్ల విష్ణు,గ్రామ అధ్యక్షులు ఇనుగాల దిలీప్, చుక్క సూర్యం,మేకల రాజేష్, పూరెల్ల ప్రశాంత్,బాలు, సిద్ధార్థ,తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ 2025 ను సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో మహిళా శిశు దివ్యాన్గుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పథకాల ద్వారా వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. దివ్యాన్ గులల్లోని సృజనాత్మకత ను వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాన్గుల పధకాలు ప్రతి మారుమూల గ్రామ స్థాయికి చేర్చాలని, దివ్యాన్గులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కపిస్తే వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తారని తెలిపారు. అధికారులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. దివ్యాన్గుల సంక్షేమం సంక్షేమ శాఖ బాధ్యతని, సంక్షేమం, సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాన్గులకు పాఠశాలల్లో విద్యాబ్యాసం, వృత్తి నైపుణ్యం, భవిత కేంద్రాలు నిర్వహణ, వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నేను మీకు అభయం ఇస్తున్నాను దివ్యాన్గులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి లో దివ్యాన్గులను భాగస్వాములను చేస్తూ చేయూతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధిమాంద్యంతో బాధపడే దివ్యాంగుల సాధికారత కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చవల్ డిసేబులిటీఎస్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఎన్జీవోల స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ఉద్యోగ మేళా కోసం స్టాల్ ఏర్పాటు చేసింది. అలీం కో, ఐజినిష్డ్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు పరిశీలించి దివ్యాంగులతో ప్రత్యేకంగా ముఖాముఖీ మాట్లాడారు. అన్ని స్టాళ్లను సందర్శించి, దివ్యాన్గులు వేసిన పెయింటింగ్ కొనుగోలు చేసి నగదు చెల్లించి అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులుప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో 600 కంటే ఎక్కువ దివ్యాంగులు, 300 IERPs, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ డా. బి.వి. రామ్ కుమార్ దివ్యాంగులకు సౌకర్యాల కల్పన, అవసరమైన సేవల సమన్వయం కోసం ఆయన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం మండలం చిలేపల్లి, బర్దిపూర్, చిలేపల్లి తాండ, ఎల్గోయి నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించారు. నిమ్జ్ భూసేకరణ పరిధిలోకి వచ్చే వివరాల మ్యాపును ద్వారా పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన భూమి, మిగిలిన భూమి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఉగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు వేసిన రోడ్డును పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి, తహసిల్దార్ తిరుమలరావు, సర్వేర్లు, నర్సింలు, లాల్ సింగ్, నిమ్ అధికారులు ఉన్నారు.
పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్
జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
Collector Sandeep Kumar Jha
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్ అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Collector Sandeep Kumar Jha
కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.