నాటుసారా అమ్మిన తయారు చేసిన వారిపై చట్టపరమైన.

నాటుసారా అమ్మిన తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును

సీఐ రాకేష్ కుమార్

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

 

 

మల్హార్ రావు మండలం ఆడ్వాలపల్లి గాదంపల్లి మొదలగు గ్రామాల నుండి ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలకు బానోత్ రాజశేఖర్ నాటు సారాయి రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడి అతనిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఆ తదుపరి అట్టి వ్యక్తిని ముత్తారం మండలం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ( తహసీల్దార్ ) ఎదుట ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయలకు బైండోవర్ చేయడం జరిగింది బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మరల నాటు సారాయి రవాణా కేసులో పట్టుబడినందుకు అట్టి వ్యక్తికి 40 వేల రూపాయల జరిమానాను విధించగా కట్టడం జరిగింది ఈ సందర్భంగా సీఐ రాకేష్ కుమార్ మాట్లాడుతూ ముత్తారం మండలంలో ఎవరైనా నాటు సారాయి అమ్మిన రవాణా వేసిన తయారు చేసిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి బైండోవర్ చేసి అట్టి వ్యక్తులను ఒక సంవత్సర కాలం పాటు జైలుకు పంపడం లేదా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించబడునని తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఐ సాయి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version