పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..
కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.
గోరుకొత్తపల్లి మండలం చేన్నాపూర్ గ్రామం గ్రామానికి చెందిన ఏరుబటి మల్లాజి ఇటీవల మృతి చెందాడు విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైనారు అనంతరం స్నేహితులు అందరూ కలిసి లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో వారి కూతురు పేరుమీద ఫిక్సింగ్ డిపాజిట్ చేసి పిక్స్ డిపాడ్ చేసిన బాండును వారి కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు స్నేహితుల అందరికీ కృతజ్ఞతలు తెలిపినారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు గ్రామస్తులు పెద్దలు అందరూ పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2000- 2001 పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు కరీం పాషా తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా మిత్రులందరు కలసి పదివేల ఆర్థిక సాయంను అందించారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుల కుటుంబాల్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగిన తమ వంతు సహాయం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కొమ్ముల భాస్కర్, శ్రావణ్, రమేష్ , చందర్ , దేవేందర్ , రమేష్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు.
తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది
-ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి విద్యుత్ సెక్షన్ లో ఆన్ మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జన్నే అనిల్ (అంజి) గత మూడు నెలల క్రితం విద్యుత్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగులగా..ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ..తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాలాడుతూ గత 11 రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది శుక్రవారం మృతుడు అంజి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 జిల్లా నాయకులు జక్కు రాజేందర్ గౌడ్, పి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ మెన్ లు, మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, మోత్కూరి రాములు, ఆర్టీజన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.
గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
గంగాధర, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు.తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క సతీష్ తండ్రి సల్మాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1996-1997 సెవెంత్ పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతనికి రూ.10 వేలు అందజేశారు.భవిష్యత్ లోనూ తోటి స్నేహితుల ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.సతీష్ స్నేహితులను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు కౌకొండ గ్రామస్తులు అభినందించారు.సహాయం అందజేసిన వారిలో ముక్కెర రాజు,ముక్కెర చిరంజీవి, ఎండి సాధిక్ పాషా,మేకల సతీష్,పేర్వాల బాలకృష్ణ, మేకల రాజేందర్,బొల్లె ఓంకార్,పసుల నర్సింగం, ఎండి గిడ్డు,జన్నారపు వేణు, మేకల కుమారస్వామి,మేకల ఓంకార్,జన్నారపు చంద్రమౌళి,సుమలత, శారద,జ్యోతి,తదితరులు ఉన్నారు.
మండల కేంద్రానికి చెందిన విభూతి జ్యోతి (40) గత రెండు రోజుల క్రితం మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబమైన వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆయన సన్నిహితుల ద్వారా మృతు రాలి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్,సామల మహేష్, పెద్ద పైడి రాజిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
రూ.50 వేలు ఆపన్నహస్తం అందించిన మాజీ జెడ్పీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్
నర్సంపేట,నేటిధాత్రి:
ఇటీవల గుండెపోటుతో మరణించి దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయి కుమార్ దశ దినకర్మ సోమవారం దేశాయిపల్లి గ్రామంలో జరగగా వారి కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి ఉండే వ్యక్తి ఆకస్మాతుగా మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయిన సాయి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ గా చేసిన సేవలను గుర్తుంచుకొని మానవతా దృక్పధంతో పార్టీలకు అతీతంగా శంబయ్యపల్లి గ్రామస్తులు స్వచ్చందంగా ముప్పై ఒకవెయ్యి ఆరువందల రూపాయలను సేకరించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటుగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు వంగేటి అశోక్ కుమార్, పెండ్యాల రాజు ఇరువురు కలసి ముప్పై ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.
గణపురం మండల బీజేపీ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించినటువంటి కుటుంబాలు కొండాపూర్ గ్రామం లో మామిడి మల్లయ్య నగరంపల్లి గ్రామంలో మేకల శైలేందర్ పెద్ది సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ ఎఫ్ బి స్కీమ్ కు అప్లికేషన్ పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు డాకూరి కృష్ణారెడ్డి బూత్ అధ్యక్షులు భూక్య హరిలాల్ మండల సీనియర్ నాయకులు గొర్రె రవి మామిడాల మల్లన్న ఇనుగాల మొగిలి తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ యువత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాటి గూడెం గ్రామ పెద్దమనుషుల యువత సమక్షంలో అందజేయడం జరిగింది…
తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఎడుల్ల బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు అతనికి ముగ్గురు ఆడపిల్లలే వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న మహిళా అధికారిని ఏడుల బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది, ఆడపిల్లలు ఎప్పుడు కూడాను తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది కనుక కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది. , ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు గ్రామ పెద్ద మనుషులు బంధువులు తదితరులు పాల్గొన్నారు
సీనియర్ జర్నలిస్టు నారాయణకు మెట్ పల్లి లోని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డు అందించిన మెట్ పల్లి ప్రెస్ క్లబ్( ఐజేయు) సభ్యులు
మెట్ పల్లి అక్టోబర్ 9 నేటి దాత్రి కోరుట్లలోని 6 వార్డు ఎకిన్ పూర్ చెందిన సీనియర్ జర్నలిస్టు గోరు మంతుల నారాయణకు. మెట్ పల్లి లోని కార్పొరేటర్ స్థాయి ఆసుపత్రిలో. బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డును. గురువారంటీయూడబ్ల్యూజే( ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా.అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నారాయణకు గత నెలలో ఆర్థిక సాయం అందించినట్లు. ఇప్పుడు ఆయనకు పట్టణంలోని ఓ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి చెందిన బిల్లులో రాయితీగల హెల్త్ కార్డును అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్, సహాయ కార్యదర్శి పింజారి శివ, ఈసీ మెంబర్ కుర్ర రాజేందర్ లు తదితరులున్నారు.
నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ , కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం
మందమర్రి నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను
Financial
బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.
*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..
*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది. ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి. చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి, ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
*టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్..
తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్01:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 1 వ తేదీన పొద్దు పొద్దునే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటకు మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్, అధ్యక్షతన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, 15,19, 30,31, వార్డు లలో ఆదయక్షల అధ్యక్షులు కార్యదర్సులు, సభ్యులు లతో కలసి వయోవృద్ధులకు, వికలాంగుల కు, వితంతువులకు, అందులకు,అనాధలకు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంను అందచేశారు. ఈ కార్యక్రమం లో తిరుపతి తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ , కొండా రామారావు, వార్డు నాయకులు భారతమ్మ,, బాల,,మధు, అలాగే కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
మహాదేవపూర్ సెప్టెంబర్ 27 నేటి దాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూర్ గ్రామానికి చెందిన కొయ్యల రమ కు 24000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ అందించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి శివరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిన్న (శనివారం) కరూర్లో నిర్వహించారు. అయితే, ఈ రోడ్షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ (TVK Chief Vijay) నిన్న (శనివారం) కరూర్లో రోడ్షో (Karur Road Show) నిర్వహించారు. అయితే, ఈ రోడ్షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
క్షతగాత్రులకు తమిళనాడు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అంజేస్తున్నామని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.