విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు..

విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు

రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో “అరైవ్ & అలైవ్” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని సూచించారు.ఈ నియమాలను మనమే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి, నియమాలను గౌరవిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రలేఖనం చేశారు.సీపీ,డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.చివరగా విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ,తమ కుటుంబ సభ్యులతో కూడా పాటింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

పాఠశాల స్థాయి నుండే వినయ విధేయతలు అవసరం: మంత్రి వివేక్

పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు వినయ, విధేయతలు కలిగి ఉండాలి…

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

విద్యార్థులు తమ పాఠశాల స్థాయి నుండే వినయ విధేయతలు కలిగి ఉండాలని, విజ్ఞత తో కూడిన విద్యను అవలంబిస్తూ పాఠశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బిఎల్ అల్ఫో న్సా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.ముఖ్య అతిథులుగా జోషప్ తచాపరంభాత్, బినోయ్ మ్యాథ్యూ , ఎంఈఓ రమేష్ రాథోడ్, సిస్టర్ నోబుల్ లు హాజరవ్వగా పాఠశాల హెడ్ మిస్ట్రెస్ బ్లేస్సి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు.

ఆల్ఫోన్స లాంటి పాఠశాల రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం అని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో కష్టపడాలని సూచించారు.ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించినపుడు తల్లిదండ్రులు విజ్ఞతతో మెలగాలని తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు కనబర్చిన సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులను అబ్బురపరచాయి. పాఠశాలలో ప్రతీ రోజూ,ప్రతీ కార్యక్రమంలో నిర్వహించే అంశాలను వీడియో ఆల్బమ్ రూపంలో చక్కగా చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్య అతిథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఝాన్సీ లక్ష్మీబాయి ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి…

ఝాన్సీ లక్ష్మీబాయి ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హేమ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం రోజున ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా “చిట్యాల ఎస్సై 2 హేమ హాజరై మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయిని* ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్నతంగా స్థిరపడాలని , మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మానసికంగా, శారీకంగా దృడ సంకల్పం తో ముందు కు సాగుతో లక్ష్యం కోసం శ్రమించాలని* , సోషల్ మీడియాకు , దూరంగా ఉండాలని , పాఠశాల స్థాయి నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు* చేసుకోవాలని అన్నారు అంతే కాకుండా బాల్యవివాహాలు చేసుకోవద్దని, చదువు ఆటల్లో ముందుంటూ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు, సమాజంలో* “నడిపించేది మహిళా అని అన్నారు , విద్యార్థులు గంజాయికి , బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సూచనలు చేయడం జరిగింది ,క్రమశిక్షణ తో ముందుకు సాగుతూ తల్లిదండ్రులను గర్వకారణం కావాలి* అని తెలియజేశారు..
వ్యాసా రచన పోటీల లో గెలుపొందిన విద్యార్థులకు* బహుమతులు అందజేయడం జరిగింది*
ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్ ,నగర కార్యదర్శి అజయ్ , ఇంచార్జి ప్రిన్సిపాల్* *రవీందర్,నాయకులు సాయి ,శశి వర్ధన్ ,విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం…

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం

భూపాలపల్లి నేటి ధాత్రి

https://youtu.be/rTUfmQNMqwg?si=xOj8JynoqGJa6sua

 

సింగరేణి హై స్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సి హెచ్ జాన్సీ రాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ జాన్సీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
“పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లో కూడా పునరావృతం చేసేలా ప్రోత్సహించలన్నారు . మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, టెలివిజన్ సోషల్ మీడియా వినియోగంపై తగిన నియంత్రణ వహించాలన్నారు . పిల్లలతో రోజూ కొంతసేపు మాట్లాడి, వారి సమస్యలు, అభిరుచులు తెలుసుకోవాల్న్నరు . తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం, అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమయపాలన పాఠశాల హాజరు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version