అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం టీచర్ జ్యోతి.

అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం టీచర్ జ్యోతి…
  

నిజాంపేట నేటి ధాత్రి:

గర్భిణులకు, పసిపిల్లలకు అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం లభిస్తుందని అంగన్వాడి టీచర్ జ్యోతి పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నందగోకుల్ గ్రామంలో శనివారం టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంటగది, అంగన్వాడి చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. “అమ్మ మాట అంగన్వాడి బాట” అనే కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 5 రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత ఆయా గ్రామ అంగన్వాడీ టీచర్స్ పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం మిట్టపల్లి,కుందారం గ్రామపంచాయతీలలో అంగన్వాడి సిబ్బందీలు వేరువేరుగా పోషణ పక్షం కార్యక్రమాలు చేపట్టారు.మిట్టపల్లిలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటి ప్రాముఖ్యతను తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేశారు. కుందారంలో వివో సంఘం మహిళలకు పోషణ పక్షం గురించి చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి తీసుకునే వివిధ పోషక పదార్థాల గురించి వివరించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేసి,ప్రతి ఒక్కరు వాటిని రోజువారి ఆహార దినచర్యలో చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, మహిళలు,వివో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్

సూపర్వైజర్ అప్సర సుల్తానా

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ అప్సర సుల్తానా ఆధ్వర్యంలో గాంధీ నగర్ గ్రామం లో పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పోషక విలువలను పెంపొందించుకోవడం కోసం అంగన్వాడిలో ఇచ్చేటువంటి పాలు గుడ్లు కూరగాయల తోటి అన్నము ప్రతిరోజు అంగన్వాడికి వచ్చి గర్భిణీలు బాలింతలు పిల్లలు తినాలని సూపర్వైజర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఆర్ కోమల దేవి కె కోమల ఏ కోమల సుజాత సునీత లలిత లత సుభద్ర జ్యోతి రమాదేవి సుమలత సుసాన్ శోభ సునీత రామ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version