33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్…

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ఏరియా దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి దగ్గర కరెంటు కోతలపై వార్డును పర్యటిoచి ప్రజల నుండీ కరెంటు కోత సమస్యలు తెలుసుకున్నామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు కరెంటు కొత్త
సమస్యలపై ఫోన్ ద్వారా విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు వార్డులో లో వోల్టేజీ సమస్య మురుగు కాలువలో ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పా టు చేయాలని కోరారు శ్రీ వెంకటేశ్వర దేవాలయం ముందు రోడ్డు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని కోరారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్ జోన్ లో ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు 33 వార్డును కరెంటు సమస్యల పై చూపించామని చెప్పారు వార్డు పర్యటన లో
విద్యుత్ ఎస్సి డి ఇ ఏ ఇ లైన్ మెన్ లు పాల్గొన్నారని తిరుమల్ తెలిపారు

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్…

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ప్రొసీడింగ్స్ తీసుకొని నిర్మాణం చేపట్టని వారు త్వరగా నిర్మాణాలను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు శుక్రవారం జిల్లా కలెక్టర్ చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నగదు పడే విధంగా చూడాలని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుకకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చందాపూర్ గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, గృహ నిర్మాణ శాఖ డి ఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో,అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు

మహా రుద్రయాగ శాల పనులను పరిశీలించిన సోదా….

మహా రుద్రయాగ శాల పనులను పరిశీలించిన సోదా

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని నవంబర్ 3 సోమవారం రోజున జరిగే మహా రుద్రయాగశాలను సందర్శించి పనులను పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ.ఈ కార్యక్రమంలొ మహారుద్ర యాగం కమిటీ సభ్యులు కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మహా రుద్ర యాగం అధ్యక్షులు ఎర్రం లక్ష్మణ్,యాగం కో కన్వీనర్ గందె రవి,ఆముదాలపల్లి అశోక్ గౌడ్,కుంకుమేశ్వర ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు సంధ్య సత్యనారాయణ,తోట రవి, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,నల్లెల్ల అనిల్ కుమార్,ఏకు రాజు,డీలర్ రాజేందర్ రెడ్డి,పావుశెట్టి అనిల్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో….

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో.

నడికూడ,నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా జడ్పీ సీఈవో రవి నడికూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జీ.విమల మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నదని వర్షాలు కురవడంతో పైకప్పు పెచ్చులు వూడి పడుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సీఈఓ కు వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

 

జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్

జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు

ఝరాసంగంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T121902.579.wav?_=1

 

ఝరాసంగంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్….!

◆:- నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

◆:- జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, గ్రామాలలో చికిత్స అంది స్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటా మని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల హెచ్చరిం చారు. ఝరాసంగం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ల్యాబ్, దస్త్రాలు, పరిసరాలను పరిశీలించారు. సమయపాలన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఝరాసంగం లోని ఓ ప్రైవేట్ క్లినిక్ ను ఆక స్మికంగా తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా రోగు
లకు చికిత్సలు అందించడం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసి క్లినిక్ ను సీజ్ చేశారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలు, నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరికుంట చెరువు గ్రంధాలయం తనిఖీ చేసిన కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T142048.168.wav?_=2

 

మరికుంట చెరువు గ్రంధాలయం తనిఖీ చేసిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

మరికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మర్రికుంట చెరువును తనిఖీ చేశారు అక్కడ నుంచి నీటి ప్రవాహ మార్గాలను, పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు సూచనలు చేశారు
అదేవిధంగా జిల్లా గ్రంథాలయం భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ శివప్రసాద్, సాయి, ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

గంగాధర నేటిధాత్రి :

 

 

గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల జూనియర్ కళాశాలపై ఆకస్మిక తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T170637.807.wav?_=3

 

ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.

 

 

అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T134321.387.wav?_=4

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా లో రైతులకు యూరీయా కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అన్నారు రైతులు రెండవ సారి వేయాలిసిన పంటలకు యూరియాను రైతులు ముందుగా కొనుగోలుక చేయడం సరి కాద ని కలెక్టర్ అన్నారు గురువారం వనపర్తి మండలం పెద్ద గూడెం లో వ్యవసాయ సహకార సంఘం గోదాములో కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం యూరియా నిల్వలను పరిశీలించారు పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడరైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారుజిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, పి. ఎ సి.ఎస్ సిబ్బంది, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు గత సంవత్సరం కంటే సంవత్సరం యూరియా నిల్వలు అధికంగా ఉన్నాయని రైతులు ఆందోళనచెందవద్దని కలెక్టర్ కోరారు

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనికిలు…

ఎన్.ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్..

కలెక్టర్ తనిఖీలతో అధికారులు,సిబ్బంది హడల్…

హాజరు పట్టికల పరిశీలించి సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు
అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్.ఐసి కార్యాలయ పనితీరు
బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు
మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై
మెమో లు జారీ చేయాలన్నారు.

 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను
చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు
వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..

#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T120501.725.wav?_=5

 

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు.
ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T152634.590.wav?_=6

 

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

హైదరాబాద్ – నాందేడ్ నేషనల్ హైవేపై అండర్‌పాస్‌ల, ఫ్లై‌ఓవర్ల నిర్మాణం కోసం,నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ మరియు జహీరాబాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు,

పాత పెన్షన్ ను పురుద్దరించాలి,

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T132105.230.wav?_=7

 

పాత పెన్షన్ ను పురుద్దరించాలి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు 2004 నుంచి అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ ను మళ్ళీ అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ.తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో బోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు…ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల పొట్టిపల్లీ తో పటు అనేక పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు,, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెల్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు Y. అమృత్,శంకర్ ,ప్రసన్న లక్ష్మి. నారాయణ,,కృష్ణ తదితరులు పాల్గొన్నారు,

మొగుడంపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T131050.512-1.wav?_=8

 

మొగుడంపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మొగుడంపల్లి మండలం జాంగార్ బోలీతండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్, పంచాయతీ కార్య దర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య.

*పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి

 

నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం ఉదయం కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని నిమ్మకాయల వీధి,మిట్ట వీధి, రాములవారి గుడి వీధి, కాళికమ్మ గుడి తగితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రమణ్యం, శైలజ, అధికారులతో కలసి పరిశీలించారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండడం తో నీరు అక్కడే ఆగి పోయి అపరిశుభ్రత అవుతోందని అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని కాలువలు శుభ్రం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా తొలగించాలని అన్నారు. ప్రజలు కూడా తమనవంతు సహకారం అందిస్తే నగరం సుబ్రంగా ఉంటుందని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,ఏసిపి మధు,డి.ఈ లు రాజు, శిల్ప,సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version