నిజాంపేటలో 4 విడత సామాజిక తనిఖీ సమావేశం

నిజాంపేటలో 4 విడత సామాజిక తనిఖీ సమావేశం

నిజాంపేట: నేటి ధాత్రి

జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిజాంపేట రైతు వేదికలో సోమవారం 4 విడత సామాజిక తనిఖీ సమావేశం ఏపీడీ రంగాచారి, డీవీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు కూలీలకు వచ్చిన వేతనాలు, గ్రామాల్లో జరిగిన పనుల గూర్చి సామాజిక తనిఖీ బృందం వివరాలను సేకరించడం జరిగిందన్నారు. వాటిపై మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి , ఏపీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.

సామజిక తనిఖీ పై గ్రామ సభ.

సామజిక తనిఖీ పై గ్రామ సభ
• వివరాలు వెల్లడించిన బీఆర్పి అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 – 2025 సంవత్సరాలకు గాను గ్రామాలకు వచ్చిన డబ్బులు, కూలీల పని దినాలను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి గ్రామ సభ నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో శనివారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి 25 పనులకు గాను కూలీల వేతనాలు 24,88,950 రూ,, సామాగ్రికి 5,53,262 రూ,, కలిసి మొత్తంగా 30,42,212 రూపాయలు వచ్చినట్లు గ్రామసభలో వెల్లడించారు. అలాగే గ్రామంలో నూతన జాబ్ కార్డుల కోసం కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం గౌరీ, ఆశ వర్కర్ పుష్పులత, గ్రామస్తులు మ్యాదరి కనకరాజు, అందేస్వామి, బోయిని బాలరాజు, చాకలి రవీందర్, మంగలి అమరేందర్, బుర్రని మల్లేష్ గౌడ్, చాకలి రాములు, పిట్ల మల్లయ్య తదితరులు ఉన్నారు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా డిసిపి గారు ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు,సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి,సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్‌ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని డిసిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ,ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని. లక్ష్యాలు సాధించాలని సూచించారు. అకాల వర్షాలతో వైరస్ ప్రజలకు సుజనల్ వ్యాధులు వాటికప్పుడు అందజేయాలని విష జ్వరాలు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారణ జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తూ వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ ఆసిఫా వైద్య సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు అందుబాటులో లేవని వారు చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీమతి యశస్విని రెడ్డి తక్షణమే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదు, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లాజిస్టిక్స్ సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు అని కలెక్టర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను అని అన్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ధాన్యాన్ని తడి కాకుండా కాపాడుకోవడం అవసరం రైతులకు ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అధికారులను ఆదేశించారు. అదనంగా, వారు అధికారులను ఆలస్యం కాకుండా, ఖచ్చితమైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రైతులు ఎటువంటి అవినీతిని సహించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ తనిఖీతో గ్రామస్థుల్లో, రైతుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడతానని వారు హామీ ఇచ్చారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ.

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

 

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్యాధికారి డా, శైలజ, పశు వైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన.

అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల రాళ్ల వర్షలతో పంట పొలాలను అతలాకుతలం చేసి రైతులను రోడ్డున పడే పరిస్థితి తెచ్చిన ప్రకృతి…
దెబ్బతిన్న పంట పొలాలను చూసి రైతుల కష్టాలను వారి బాధలను దగ్గరగా చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.ధనసరి సీతక్క
తక్షణమే అకాల వర్షాలతో రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ చేత పరిశీలన చేసి నష్టపరిహారం వచ్చే విదంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన మాట ప్రకారం కొత్తగూడ మండలంలోని జంగంవాని గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు అకాల వర్షాలు రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు… అకాల వర్షాలు రాళ్లవానతో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు బ్యాంకు వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి పంట పొలాలను సర్వే చేపించారు..పంట నష్టపోయిన రైతులందరు వారి వివరాలు ఇచ్చి నష్టపరిహారం పొందగలరని అని ఆయన అన్నారు…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ

సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version