హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

 

జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్

జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు

యాసంగి వరి కోతలపై రైతులకు అవగాహన

• నాణ్యత ప్రమాణాలు పాటించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట,నేటి ధాత్రి 

యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో ఉండే ఫ్యాన్ బెల్ట్ యొక్క వేగం 18 – 20 ఆర్ పి యం ఉంచడం ద్వారా తాలు గింజలు ధాన్యంలో రాకుండా నివారించవచ్చున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రమ్య, శ్రీలత, మౌనిక, వివిధ గ్రామాల రైతుల ఉన్నారు.

విద్యా ప్రమాణాల సమావేశం

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి :

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. మండల విద్యా అధికారి దేవిసింగ్ ముఖ్యంగా యూ డైస్ డాటా క్యాప్చర్ ఫార్మాట్ లోని లోటుపాట్లను సరిదిద్దాలని, ఆఫర్ ఐడి జెనరేట్ చేసి 50% కంటే ఎక్కువ డేటా నవీకరణ పూర్తవ్వాలని పాఠశాలలకు సూచించారు. టీచర్ డేటా మరియు పిల్లల ఆధార్ ధ్రువీకరణ 100% పూర్తి కావాలని ఆదేశించారు.మండల నోడల్ అధికారి రమణ రావు మాట్లాడుతూ, ఎఫ్.ఎల్.ఎన్ / ఎల్.ఐ.పి బేస్ లైన్ టెస్ట్ మరియు మిడ్ లైన్ టెస్ట్ వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, నులి పురుగుల దినోత్సవం ప్రతి పాఠశాలలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హరి సింగ్, అనురాధ మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పిలు, ఎం.ఐ.ఎస్,కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version