అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మరియు వాటిని నియంత్రించేటువంటి పద్ధతులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని కల్నల్ ఆఫీసర్ ఏకే జయంతి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్సిసి క్యాడెట్ల శిక్షణ శిబిరంలో భాగంగా అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించినటువంటి అగ్ని ప్రమాదాల నివారణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతగానో ఉందని ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పెద్ద నష్టం కలిగేటువంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు నియంత్రించాలని వారు చెప్పారు.

అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటిని ఎలా నియంత్రించవచ్చని విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఎంతగానో ఉందని, అగ్ని ప్రమాదాలు వివిధ రకాలుగా ఉంటాయని విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, వంటగదిలో సంభవించే ప్రమాదాలు, ప్రమాదశాత్తుగా ఎగిసేటువంటి మంటలు, నిర్లక్ష్యం వలన జరిగేటువంటి ప్రమాదాలను విద్యార్థులకు తెలియజేయాలని వారు చెప్పారు.

వారు మాట్లాడుతూ ఎప్పుడైతే అగ్నిప్రమాదం సంభవిస్తుందో ఆసమయంలో అగ్నిమాపక సిబ్బంది యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని మరియు అగ్నిప్రమాదం నివారణ పరికరాలను కొన్నింటిని అందుబాటులో పెట్టుకోవాలని వారు సూచించారు.

అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించినటువంటి అవసరం ఎంతగానో ఉందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్ తెలిపారు.

ముఖ్యంగా హోం విధానం కార్బన్డయాక్సైడ్ పౌడర్ లిక్విడ్ వివిధ విభాగాల పద్ధతులను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్పారు.

ప్రతి విద్యార్థి ఈవిలువైన సమాచారాన్ని అందించాలని మరియు ఇటువంటి విపత్తులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు ముందు వరుసలో ఉండి సేవా భావాన్ని వ్యక్తీకరించాలని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆఫీసర్ వి.కృష్ణ, సబ్ మేజర్ సాగర్ సింగ్, సిబ్బంది, కెడెట్లు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగులకు భద్రత,.!

విద్యుత్ ఉద్యోగులకు భద్రత, అవగాహనా కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గుండి సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భద్రత అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి విశేష అతిథిగా కరీంనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మేక రమేష్ బాబు, ముఖ్యఅతిథిగా కరీంనగర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ ఎం.తిరుపతిలు హాజరై విద్యుత్ భద్రత సూత్రాలు, భద్రతపై ప్రతిజ్ఞ, పరికరాల ఉపయోగంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులు, మండలాల యొక్క ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version