యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు…

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

రోడ్డు భద్రతపై మందమర్రి పోలీసుల క్రియాశీలక అడుగులు: యువతతో ‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా యాపల్, అంగడి బజార్, మేదరి బస్తి ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి (ఎన్.హెచ్)రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు నాలుగు నెలల్లోనే నాలుగు-ఐదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సదస్సును యాపల్ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

అవగాహన అంశాలు:

ఈ సదస్సులో పోలీసులు రహదారి భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వాడకం గురించి వీడియోలు, ఛాయాచిత్రాల (ఫోటోల) ద్వారా ప్రజలకు వివరించారు.

యువతకు ప్రత్యేక సూచనలు:

పిల్లలకు వయస్సు పూర్తి కాకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని అధికారులు తెలిపారు.

‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు:

ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించడానికి, ప్రమాదాల నివారణకు కృషి చేయడానికి యాపల్ ప్రాంతంలో కొంతమంది యువతతో పోలీసులు ఒక ‘రోడ్డు భద్రతా కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అందులో ముఖ్యులుగా అబ్బాస్, వనం నరుసయ్య, వెంకటరెడ్డి, సాంబమూర్తి, రాచర్ల రవి, రాజేశ్ చోట్టన్, రామ, సుజాత, సంగత్రి సంతోష్, అంజయ్య లైన్‌మెన్, భూపెల్లి కానుకయ్య, శ్రీనివాసు ఈ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

డి.సి.పి. ప్రసంగం:

కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏ.సి.పి., మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సి.ఐ., ఎస్.ఐ.లను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు “రోడ్డు సరిగా లేక యాక్సిడెంట్ అయింది” అనడం లేదా మద్యం సేవించి నడిపిన వ్యక్తిని పట్టుకుంటే, “ప్రభుత్వమే వైన్ షాపులు బంద్ చేయించొచ్చు కదా” అంటూ చేసే వితండవాదం సరికాదని డి.సి.పి. స్పష్టం చేశారు. ఇటువంటి వితండవాద ధోరణిని మార్చడానికి, ప్రజల్లో బాధ్యత పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఉద్దేశించబడ్డాయని ఆయన వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏ.సి.పి. రవికుమార్, మందమర్రి సి.ఐ. శశిధర్, ట్రాఫిక్ ఎస్.ఐ. రంజిత్, ఎస్.ఐ. రాజశేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) ప్రతినిధులు, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

3, 750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం….

3, 750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ మెగడంపల్లి మండలం గోడిగారిపల్లిలో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి పండరి, ఏవో హన్మద్దీన్, ఏఈవో సరస్వతి, అయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పామయిల్ పంట ప్రాధాన్యత, మెరుగైన సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో 3,750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121544.783.wav?_=1

 

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు

◆:- సీఐ హనుమంతు

◆:- ఎస్ఐ,, క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్ 
 
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ అధికారులు జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝరాసంగం సీఐ హనుమంతు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ హనుమంతు మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సర్దార్ పటేల్  సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన తమ వంతు సహకారం అందించాలి అన్నారు. శుక్రవారం ఉదయం 06:30 గంటలకు, పోలీస్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రింట్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు,

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T114141.957.wav?_=2

 

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్
: ఎస్పీ మహేష్ బి. గితే

– “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ

– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్, ఎస్. సురేష్, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు…

తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే,
ఐపీఎస్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి షీ టీం భరోసా సిబ్బంది సంయుక్తంగా తేజస్విని జూనియర్ కాలేజీలో విద్యార్థినుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
మహిళలు, విద్యార్థులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించవద్దని సూచించారు.
అదేవిధంగా మానవ అక్రమ రవాణా, మహిళా భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, సైబర్ సెక్యూరిటీ సేవలపై అవగాహన కల్పించారు.
ఎటువంటి ఆపద ఎదురైనా 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా షీ టీం వాట్సాప్ నంబర్ 8712658162 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరం అని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, కానిస్టేబుల్ ఇర్ఫాన్, శ్రీనివాస్, మరియు భరోసా టీం భూపాలపల్లి సభ్యులు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. గ్రామ విపిఓ. H.C.1599. పిఎస్ తంగళ్ళపల్లి. మండలం బస్వాపూర్. గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం. కండక్టు మరియు సైబర్ నేరాల గురించి మొబైల్ యాప్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని మరియు రేపు సిరిసిల్లలోని. పద్మనాయక కల్యాణ మండపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. దానిలో భాగంగా. బస్వాపూర్ విలేజ్ నుంచి ఐదుగురు యూత్ పిల్లలు అటెండ్ కావాలని తెలియజేస్తూ. గ్రామంలోని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా. ఏమైనా అసాంఘిక సంఘటన జరిగితే క్రమ దృష్టికి తీసుకురావాలని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన శిబిరంలో ప్రత్యేకంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు…

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

 

రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు….

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం లోని కాల్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో తిరుమల, విజయ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో జరుగు కార్యక్రమాలు పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తులు, లోప పోషణ, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించనైనది. ఇందులో భాగంగా ఒక గర్భవతికి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సృజన మహిళలు, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,ఫర్జానా హాజరైనారు

పశువుల ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా అధికారి..

పశువుల ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా అధికారి

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని స్వామిరావుపల్లి,నాచినపల్లి,శివాజీ నగర్ గ్రామాలలో జరుగుతున్న గాలి కుంటు టీకాల కార్యక్రమాల నేపథ్యంలో ను వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ప్రతీ రైతు పశువులకు గాలికుంటూ టీకాలు వేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి పశువై ద్యాదికారి డాక్టర్ సోమశేఖర్, తొగర్రాయి పశువైద్యాదికారి డాక్టర్ శారద, తిమ్మంపేట పశువైద్యాదికారి డాక్టర్ బాలాజీ, పశువైద్య సిబ్బంధి, రైతులు పాల్గొన్నారు.

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు…

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్
అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

మానసిక ఆరోగ్య అవగాహన రామడుగులో

మానసిక ఆరోగ్యమే సంపూర్ణ జీవితానికి పునాది

యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్‌లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్‌ఫోన్‌ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు.
“మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పోషణ మాస కార్యక్రమం…

ఘనంగా పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ దేవిక కల్పన విజయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు ఆకుకూరలు పప్పు కూరలు తినిపించాలి అంగన్వాడి నుండి వచ్చే కోడిగుడ్లు బాలమృతం వాటిని పిల్లలకు తరచుగా తినిపియ్యాలి అని సూచించారు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పిల్లలకు గంట తర్వాత తల్లిపాలు పట్టించాలి దాని ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వారు అన్నారు

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సమాచార హక్కు చట్టం అమలుపై పీఐఓ, ఏపీఐఓలకు అవగాహన

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కేంద్రంలోని వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ఎలా అమలులోకి వచ్చింది చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలను తెలియజేశారు.
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసు కోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు. ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం…

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/aDumjuwXe-4?si=rooj0J56msbeCnMA

 

సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ…

ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు ఆధ్వర్యంలో షాపుల యజమానులకు,గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు.అదేవిధంగా ఎంపీయుపిఎస్ (ఉర్దూ) పిల్లలకు కూడా అవగాహన కల్పించారు.ఉర్దూ పాఠశాలలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ మరియు కిచెన్ షెడ్లను పరిశీలించారు.ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కార్యక్రమంలో భాగంగా 75% రాయితీతో మొదటి విడతగా 14 మంది అర్హులైన రైతులకు 32 యాంత్రిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై పంపిణీ చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము,ఆవాస్ ప్లస్ సర్వేను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…

యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం గోవిందా పూర్ గ్రామంలోజాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు శాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్ద ని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందించాలి. ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీటీవీ కెమెరాలు, వృద్ధాప్యం లో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తూ1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్ ఏ ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జ్ వుమెన్ ఏఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్న య్య, పిసి పూల్ సింగ్, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన…

బాల్యానికి… బంధ(న)o

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన

* అధికారుల దృష్టికి వస్తున్నవి కొన్నే..

* చిన్న వయసులో పెళ్లి వల్ల సమస్యలు

* గ్రామీణ ప్రాంతంలో ఆగని దురాచారం

* ఆడపిల్లలపై తల్లిదండ్రుల వత్తిళ్లు

* కంప్యూటర్ యుగంలోనూ సమాజం వెనక్కి

* చట్టాలు ఉన్నా మారని తల్లిదండ్రుల ఆలోచనలు

సంసారం సాగరం అన్నారు. సంద్రంలో ఈదాలంటే గజ ఈతగాళ్లకే తరం కాదు… మరి అప్పుడే ఈత నేర్చుకున్న వారిని ఆ సంద్రంలో పడేస్తే ఒడ్డుకు చేరగలరా..? బాలల పరిస్థితి అలాగే ఉంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి పేరుతో సంసారమనే సాగరంలో పడేస్తున్న తల్లిదండ్రుల తీరు ఎందరి జీవితాలకో బంధనంగా మారుతోంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కూతురుకు మూడుముళ్లు వేయిస్తే భారం తగ్గిపోతుందని కొందరు.. ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా అని పెళ్లీడు రాకున్నా పనైపోతుందని మరికొందరు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. సమాజం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా చదువును ఆపేసి బాల్య వివాహాలకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. బాల్య వివాహమంటే ముక్కుపచ్చలారని చిన్నారుల భవితకు సంకెళ్లు వేయడమే. ఇలాంటివి సమాచారం వస్తే తప్ప అధికారులు స్పందించి ఆపగలుగుతున్నారే తప్ప ఎవరికి వారు చైతన్యవంతులై వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ దిశగా అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.

మారుమూల పల్లెల్లో అధికం

జిల్లాలోని మారు మూల పల్లెల్లో బాల్య వివాహాలకు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముక్యంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నారాయణ్ ఖేడ్, జహిరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలలో అధికారులకు, స్థానికులకు తెలియకుండా గూట్టు చప్పుడు కాకుండా ఇరు వైపులా పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని పక్కింటి వారికి కూడ తెలియకుండా వేరే ప్రాంతాలలో బాల్య వివాహాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఐసిడిఎస్ అధికారులకు సమాచారం తెలిసి పై అధికారులకు తెలిపితే పెళ్లి జరిపించిన ఇరు వర్గాల వారు సదరు వ్యక్తిపై పోట్లాటకు దిగుతున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు.

rising child marriages.

బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు..

బాల్య వివాహాల వల్ల చాలా అనర్దాలు కలుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు తరువాతే శరీర అవయవాలు పూర్తిస్థాయిలో ఎదుగుతాయి. ఈ వయసుకన్నా ముందు వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు బలహీనంగా వుంటారు. వివాహితులైన బాలికలు బీపీ, రక్తహీనతకు గురవుతారు. పిండం ఎదుగుదల సరిగా ఉండదు నెలలు నిండకముందే ప్రవించే అవకాశం వుంది. కొన్నిసార్లు గర్భస్రావం. జరిగే ప్రమాదం కూడా వుంది. శరీర ఎదుగుదల సంపూర్ణంగా లేకపోవడం వల్ల సాధారణ ప్రసవం జరగడం కష్టమవుతుంది. పురిటిలోనే బిడ్డ చనిపోవడానికి అవకాశాలున్నాయి.

వీరంతా నేరస్తులే..

బాల్య వివాహాల నిషేద చట్టం- 2006 ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు, మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరం బాల్య వివాహాన్ని జరిపించేందుకు ప్రయ త్నిస్తే ఇరుపక్షాలకు చెందిన తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లి సంఘాలు వ్యక్తులు, నాయకులను నేరస్తులుగా పరిగణిస్తారు. వీరందరికీ రెండేళ్ల జైలు శిక్షగాని, లక్ష రూపాయల జరిమానాగాని విధించే అవకాశముంది. బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ క్రైమ్ గా పరిగణి స్తారు.

బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తున్నాం

అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికల కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందుల గురించి వివరిస్తున్నాం. శరీరం ఎదగకుండా వివాహం చేసుకుంటే తరువాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్యలు ఎచురవుతాయో తెలుపుతునన్నాం. జీవన నైపుణ్యాలు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అంశాలపైనా చైతన్య పరుస్తున్నాం.

rising child marriages.

ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

బాల్య వివాహలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. చట్టం ప్రకారమే వివాహం చేయాలి. బాల్య వివాహాలు చేసుకున్న వారిలో రక్తహీనత లోపం, శిశుమరణాలు వంటి సమస్యలను చూస్తున్నాం. మరి కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కుంటుంబ నిర్వహణపై కౌమరదశలో పూర్తిగా అవగాహన ఉండదు. దీని కారణంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో తల్లి దండ్రులు బాధ్యతగా వ్యవరించడం మంచిది. బాల్య వివాహాలను అధికారులే కాదు.. స్థానిక ప్రజలు, బంధువులు అడ్డుకోవాలి.

◆:- ఝరసంగం మండల వైద్యాధికారి రమ్య

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version