వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు..!

 

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించండి..!

 

వర్షాకాలంలో ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అయితే, వర్షాకాలంలో ఈ కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌

వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు, ఎందుకంటే తేమ కారణంగా బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన, అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కడుపు ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.

వంకాయ

వంకాయలలో కూడా టేప్‌వార్మ్ కనిపించే అవకాశం ఉంది. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే, మొత్తం వంకాయను పారవేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పురుగులు వంట తర్వాత కూడా జీవించగలవు, వీటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని లార్వా మెదడులోకి ప్రవేశిస్తే, అది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది.

బీరకాయ

బీరకాయ వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫైబర్ పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో ఇది కీటకాలతో ఉంటుంది. దానిలో ఉండే పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ పురుగులను తింటే, అవి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

క్యాబేజీ

క్యాబేజీ పొరల మధ్య టేప్‌వార్మ్‌లు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. వాటిని శుభ్రం చేసి సరిగ్గా ఉడికించకపోతే, వాటి గుడ్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి శరీరం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. మీరు తినాలని అనుకుంటే క్యాబేజీని ఉపయోగించే ముందు నీటిలో మరిగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

క్యాప్సికమ్

క్యాప్సికమ్ లోపలి భాగంలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. సరిగ్గా కడగకపోతే, టేప్‌వార్మ్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.

గిరిజనులకు కూరగాయ విత్తనాలు అందించిన.!

గిరిజనులకు కూరగాయ విత్తనాలు అందించిన వనవాసి కళ్యాణ పరిషత్ సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు

నేటిధాత్రి చర్ల

ఆదివాసీలు తమ పెరటిలో కూరగాయల పెంపకం చేపట్టి స్వయం సమృద్ది సాదించాలన్నదే వనవాసీ కళ్యాణ కళ్యాణ పరిషత్ ముఖ్య ఉద్దేశం అని సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు అన్నారు సంస్ద ద్వారా పంపిణీ చేసేందుకు వచ్చిన కూరగాయల విత్తనాలను నరసింహారావు వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత పలువురు ఆదివాసీలకు పంపిణీ చేసారు స్దానిక కొమరం భీం విద్యార్ది నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు చర్ల మండలంలోని సుమారు 50 గ్రామాలలోని గిరిజనులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సుమారు 4 వేల విత్తన ప్యాకెట్లు మండలానికి చేరుకున్నట్లు వివరించారు ప్రతి ఏటా గిరిజన గ్రామాలకు తమ కార్యకర్తలు వెల్లి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు గిరిజన గ్రామాల ప్రజలు పోషకాహారం దొరకక అనారోగ్యంతో బాదపడుతున్నందున వారి పెరటిలోనే పోషకాహారంతో కూడిన కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు దీనికి తోడు గిరిజన గ్రామాల ప్రజలు వర్షాకాలంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాలకు రావాలంటే వాగులు వంకలు పొంగి రహదారులు మూసుకుపోయి ఇబ్బందులు పడుతుంటారని ఇటువంటి ఇబ్బందులను అదిగమించేందుకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఇలా గత తొమ్మిది సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని కూరగాయలు పండించిన ఆదివాసీలు వాటిలో కొన్ని కూరగాయలను విద్యార్ది నిలయంకు అందచేసే మంచి సాంప్రదాయం ఉందన్నారు గిరిజనులు సంస్ద అందిస్తున్న విత్తనాలను సద్వినియోగపరుచుకొని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాదించాలని విజ్ఞప్తి చేసారు ఈ కార్యక్రమంలో వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు నిలయ కమిటి ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు నిలయ కమిటి సభ్యులు పాశికంటి శ్రీదేవి శివరాజు కిషోర్ రాజేష్ ఎం శ్రీనివాస్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version