రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…
మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…
మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆయుధ పూజ మంత్రం ఇదే!
జహీరాబాద్ నేటి ధాత్రి;
దసరా పండుగకు ముందు వచ్చే ఆయుధ పూజను ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో మహర్నవమి రోజున జరిగే ఈ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులు, వాహనదారులు, టైలర్లు, కార్మికులు తమ పనిముట్లను, వాహనాలను దుర్గామాత ముందుంచి పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు యుద్ధానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచి పూజించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదమని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అని, కేరళలో పోటీలు, తమిళనాడులో సరస్వతీ దేవి పూజ (గోలు) చేస్తారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .
అమ్మవారి మండపం వద్ద..
భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం
నిజాంపేట: నేటి ధాత్రి
దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..
సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త
— ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్ఠ
ఇదే మొదటిసారి.
నిజాంపేట: నేటి ధాత్రి
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో మొదటిసారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో ఎన్నడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగలేదని ఈ వర్షాకాలం వర్షాలు సంమృద్ధిగా కురవడంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మొదటిసారి నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ రోజు గాయత్రి మాత అలంకరణలో దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. 9 రోజుల పాటు గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారు రోజుకో అవతారంలో పూజలు అందుకోనున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, లింగం, రామచంద్రం, మహేష్, స్వామి, మధు, శ్రీను, రాజు, కార్తీక్ లో ఉన్నారు.
శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట శివాలయం వేదికగా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో అశ్విజ మాసం శుక్లపక్షం బహుళ పాడ్యమి సోమవారం రోజునా దుర్గమతాను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది అని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. నవ దుర్గ వైభవంలొ భాగంగా మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిందని పూజ కార్యక్రమంలొ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా అర్చకులు లంక కిషన్ శర్మ వచ్చిన భక్తులకు సంకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఇచ్చి అమ్మవారి తరుపున ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ సేవ సమితి సభ్యులు ఆకుల రవీందర్ వాలా నర్సింగరావు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు పూజారి కుమారస్వామి పనికెల శివకృష్ణ రత్నం మొగిలి పాలకుర్తి సాంబయ్య ఎల్లంకి రమేష్ గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట
చీఫ్ ఇంజనీర్ ప్రకాష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో బాగంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో కెటిపిపి దుర్గాదేవి ఉత్సవ కమిటీ వారు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కెటిపిపి విద్యుత్ కేంద్రం లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు అన్ని కుటుంబాలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించేలా క్షేమంగా ఉండేలా చూడాలని ఆ దుర్గాదేవి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్స్, దుర్గాదేవి ఉత్సవ
దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి:
◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని తెలిపారు.
బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు మండల గ్రామాల అధికారులు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. రహదారులు, వీధి విద్యుత్ దీపాలు తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు,పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో,ఝరాసంగం మండల ఆయా గ్రామాల పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలనారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న
జరిగే దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని. అక్టోబర్ 2వ తేదీన దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఝరాసంగం మండల వివిద శాఖల అధికారులకు కోరారు.ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు
గంగమ్మ ఒడిలోకి గణ నాథులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు యువతీ యువకులు భజనలు కోలాహాటాలతో బ్యాండ్ డీజే పాటలతో సాగింది చిన్న పెద్ద అంతా కలిసి శోభాయతులు ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు చివరి రోజు కావడంతో గణనాధునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.ఈ క్రమంలో మండలం లోని పలు గ్రామాల్లో చెరువు లు కుంటలు ప్రాజెక్టుల వద్ద గణేష్ నిమజ్జనాలు కోలాహా లంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండపాల యువతీ యువకులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు
కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
వినాయక చవితి వేడుకల సందర్భంగా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా, శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగ లో నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025
నేటిధాత్రి:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.
నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి
ఆదర్శవంతంగా నిలిచిన మల్టీ వర్కర్ గట్టయ్య
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని గణేష్ మండపాలలో అన్నప్రసాద వితరణ..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో సిద్ది గణేష్ మండలి గణపతి మండపం వద్ద నవరాత్రుల సందర్భంగా గురువారం కమిటి సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. జవహర్ నగర్ లక్ష్మీ గణేష్ మండలి నిర్వాహకులు సైతం అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ రాజు,ఆర్కేపి ఎస్సై రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, బింగి శివ కిరణ్, ఎర్రబెల్లి రాజేష్ లు విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. పట్టణంలోని భక్తులు అన్నదాన ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
2 వేల దీపాలతో గణపతికి అలంకరణ
భూపాలపల్లి నేటిధాత్రి
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మహిళలు ఆరవ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీలోని 200 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 2000 దీపాలతో అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు
గణపతి మండపంలో ఘనంగా పూజలు
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10 వార్డు పోచమ్మ ఆలయంలో పోచమ్మతల్లి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ,ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు హాజరైయ్యారు.పూజారి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు. మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గణనాధున్ని వేడుకొన్నట్లు తెలిపారు.ఈ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ శీలం సత్యనారాయణ, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కడారి కుమారస్వామి, ఎల్ల స్వామి, బిక్షపతి, పి.కృష్ణ,స్థానిక వ్యాపారులు బండి సుధాకర్, శ్రీనివాస్,కోడమ్ సారంగం, నాగిశెట్టి ప్రవీణ్ తదితరులు స్థానికులు పాల్గొన్నారు.
మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని పదో వార్డు మమత నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ దాత తాళ్లపల్లి వెంకటేశ్వర్లు కవిత ల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో మమతా నగర్ కాలనీవాసులు ముప్పిడి రంజిత్ మమత,దార్న రవీందర్ సత్యవతిలచే స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు గణేష్ మహారాజ్ కి జై అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల నిర్వాహణ అనంతరం స్వామివారి మహా అన్నప్రసాద వితరణను స్వీకరించి స్వామి వారి కృపకు ప్రాప్తులైనట్లు మహా అన్నప్రసాద వితరణ దాతలు ముప్పిడి రంజిత్ దార్న రవీందర్తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పరకాల పట్టణంలోనే మమతా నగర్ గణనాథుడు పెట్టింది పేరుగా నవరాత్రి తొమ్మిది రోజులు మమతా నగర్ కాలనీ వాసులంతా ఒక పండగ వాతావరణంను ఏర్పాటు చేసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో శనివారం రోజున నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసిన కాలనీవాసులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కోహిర్ లో గణనాథుడికి 82 ఏళ్ల చరిత్ర
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత రెండు రోజుల నవరాత్రుల సందర్భంగా కోహిర్ గ్రామంలోని 4వ వార్డులో 82 సంవత్సరాల చరిత్ర కలిగిన సార్వజనిక వినాయకుడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన విగ్రహం పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండటం గ్రామ ప్రజలకు ఆనందాన్నిచ్చింది. పిల్లల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో 9 రోజుల నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.