మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవితకు పునాదులు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు

హన్మకొండ నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలను ముదిరాజ్ కులస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల్లు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు పల్లెబోయిన శ్రీనివాస్ కార్యదర్శి ఆలేటి రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెబోయిన నర్సయ్య, గంగబోయిన రవీందర్, పుట్ట తిరుపతి, శ్రీముర్తి, పుట్ట రమేష్, పల్లెబోయిన నరేష్, పల్లెబోయిన కృష్ణ, పల్లెబోయిన కుమార్, పల్లెబోయిన రమేష్, పల్లెబోయిన శివమణి, పల్లెబోయిన సంపత్,పల్లెబోయిన రాజు, తిరుపతి,పల్లెబోయిన రమేష్, సురేష్, పుట్ట రాజు, పుట్ట భద్రి, పుట్ట కుమార్, పుట్ట రమేష్, పుట్ట నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.50 వేలు తన వంతు కర్తవ్యంగా ఇచ్చిన పారిశ్రామిక వేత్త కె.ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో దిగ్వాల్ గ్రామంలో పారిశ్రామిక వేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.ఈ నేల 31,జూన్ 1,2,తేదీలో జరిగే మైసమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్బంగా రూ. 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే కోహీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ లో వున్న బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఏకమయ్యి ఏలాలని అన్నారు.కావున రాబోయే ఎన్నికల్లో యువ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల పార్టీ కాదని అనగారని కులాల పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ మరియు ఝరాసంగం మండల సరిహద్దు ప్రాంతందిగ్వాల్. ఈదులపల్లి ప్రాంతం లో గల శ్రీ మైసమ్మ దేవాలయం లో జరిగే జాతర ఉత్సవాలసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని స్థానిక యం యల్ ఏ మాణిక్ రావ్ ఆఫీస్ .లో ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఉస్త వాలు ఘనంగా నిర్వహిస్తారాని ఇట్టి కార్యమం లో ప్రజా ప్రతినిధు స్థానిక అధికారులు నాయకులు .మైసమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఉస్తావాలను విజయవంతం చెయ్యాలని పరమేశ్వర్ పాటిల్ పిలుపు నిచ్చారు.

కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ.

కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి విరాట్ చారి రమాదేవి ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలు అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి

మరిపెడ:నేటిధాత్రి.

మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కొన్ని రోజులుగా తల్లి గుడిసె భారతమ్మ అనారోగ్యం తో గురువారం ఉదయం మృతి చెందింది.బంధువులందరూ వచ్చారు ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి సాయంత్రం ఆమె దహన సంస్కారాలు పూర్తియైనతరువాత ఇంటికి వస్తున్నా క్రమంలో కొడుకు గుడిసె శీను (45)గుండెపోటుతో బంధువులు, గ్రామస్తులు, సన్నిహితులు అందరూ చూస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను మరణించాడని తెలిసి కన్నీటి పార్వంతామయ్యరు .తల్లి చితి అరక ముందే కొడుకు మరణించడం తో ఎల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికి భార్య ఒక కూతురు, కుమారుడు ఉన్నారని అతను సుతారి మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందనిఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సమ్మక్క తల్లి మహా పండుగ..

నూగూర్ వెంకటాపురం( నేటి ధాత్రి )

ఫిబ్రవరి 6 ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో

చిరుతపల్లిలో సమ్మక్క గిరిజన ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండగ. ఈ జాతర వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ లోని చిరుతపల్లి గ్రామంలో అంగరంగ వైభవం గా జరగనుంది. ఈ జాతర మొదలు అయినప్పటినుండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో జోగు అడిగి చుట్టూ ప్రక్కలా గ్రామాలలో నిద్ర చేస్తుగిరిజన ప్రజల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవలుగా, ఆపదలో ఉన్న వారిని ఆపద్బాంధవులుగా, పూజలందుకుంటున్న సడలమ్మ తల్లి దేవత అని ప్రజల నమ్మకం. ఘనత కేక్కిన ఈ జాతర గిరిజన సంప్రదాయరైతుల్లో జరుగుతుంది. ఈ పండుగకు చుట్టూ ప్రక్కల గ్రామాలలో ప్రజలు కాకుండా మండలంలోని ప్రజలు వేల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కలు చెల్లించు కుంటారు.పూజారులు, వడ్డే, తలపతి, ఆలయ కమిటీ సమక్షంలో జరుగుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version