బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు..

బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుక

నిజాంపేట, నేటి ధాత్రి

మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుకను మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. మావు రం రాజు మాట్లాడుతూ నాపై ప్రేమాభిమానాలు చూపి నాకు దీవెనలు అందించిన తిరుపతి రెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్యక్షుడు పడాల సతీష్,ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్.కూర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీను.బిఆర్ఎస్వి మెదక్ జిల్లా నాయకులు గంజి నవీన్.గోపీని సాయి. పంపరి నగేష్, సంగు స్వామి, మల్లేశం , వంశీ ,శివ, మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు..

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పూల బొకే ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం రూ.42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇటి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఉదయం మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలను తెలిపే గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ తోట రంజిత్ ఉడుత మహేందర్ భౌతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు..

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు — విద్యార్థులకు పుస్తకాల పంపిణి

*వర్దన్నపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఅర్ నాగారాజు మరియు *వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె.అర్ దిలీప్ రాజ్ ఆదేశాలమేరకు

వర్దన్నపేట (నేటిధాత్రి):

ఉప్పరపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలను పర్యావెక్షించిన *వర్ధన్నపేట మండల్ యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్
ఇటీవల వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో అంగన్వాడీ,హై స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోని అనేక వస్తువులు ధ్వంసం చెయ్యడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న వర్దన్నపేట యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్ ఉప్పరపల్లి హై స్కూల్ కి వెళ్లి స్టాప్ తో మాట్లాడి ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, దామెర ప్రశాంత్, ఎండీ మాక్సూద్, దాడి రాజు, రసీద్ ,గ్రామ మరియు యూత్ నాయకులు పాల్గొనడం జరిగింది…….

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-93.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లా కోహీర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నరేష్ కు బుధవారం నాడు పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చీమల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు నేరేడు మహేష్, అనిల్ కుమార్, అంబేద్కర్ యువజన యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి..

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై  సమీక్షించిన కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. లక్ష్యం వైపు పయనించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్
సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డీ.పీ.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్  సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా సంస్థల వద్ద డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.


అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.
ఈ సందర్భంగా అడిషనల్  ఎస్పీ చంద్రయ్య అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా  విద్యార్థులకు , యువతకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.సమావేశంలో డీ.ఎం.హెచ్.ఓ రజిత, డీఏఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ సేవా సమితి ఆపన్నహస్తం.

యూత్ కాంగ్రెస్ సేవా సమితి ఆపన్నహస్తం:

గుండె సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం

రాయికల్, జూలై 16, నేటి ధాత్రి.

మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సామల్ల లక్ష్మీనారాయణ గుండె సమస్యతో బాధపడుతూ నిరుపేదరికంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ సేవా సమితి, ఇటిక్యాల వారు చలించిపోయారు.
మానవతా దృక్పథంతో స్పందించి, లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన.!

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన వేడుకలు

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల యువజ న కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నాగరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరె న్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యా లతో ఉండాలని కోరారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు‌. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల మండల న్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిసేటి రాహుల్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఆక్సిజన్ యంత్రాన్ని కొనివ్వడం జరిగింది. రాహుల్ గౌడ్ దాతృత్వానికి రాజమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. తన శక్తి మేరకు బాధితురాలికి వైద్య సహాయం అందజేశానని ప్రభుత్వపరంగా అవకాశాలుంటే రాజమ్మకు మెరుగైన వైద్య సహాయం అందజేయగలమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 

పరకాల నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,ఏఎంసీ చైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,అలీ,దార్నా వేణు,ఒంటెరు శ్రవణ్,మచ్చ సుమన్,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాఘవ,వెంకటేశ్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

-ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ ల ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులతో రక్తదానాన్ని చేయించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ తన కర్తవ్యంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, నెక్కొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోంత రంజిత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్, చెన్నబోయిన సాయి శ్రావణ్ కుమార్, కోలుగురి కర్ణాకర్, జెట్టి ప్రశాంత్, జెట్టి రాజేంద్రప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్…

సిఎండి బలరాం నాయక్ ను కలిసిన జర్నలిస్టులు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

shine junior college

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన మందమర్రి రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అనిల్ భగత్ ఉపాధ్యక్షుడు అక్బర్ లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వేదికగా సిఎండి బలరాం నాయక్ ను కలిసి సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలని కోరారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని, మునీర్ విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కోల్ బెల్ట్ లో మునీర్ అబిమానులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ భగత్ అక్బర్ లు తెలిపారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన మునీర్ మృతి నల్ల నేలకు తీరని లోటు అని సింగరేణి చరిత్రలో మునీర్ ప్రజల హృదయాలో సజీవంగా ఉంటారని, సీనియర్ పాత్రికేయులు మునీర్ జర్నలిస్టులకు ఆదర్శం అని బలరాం నాయక్ అన్నారు. ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ తదితరులు ఉన్నారు.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు

పెద్దమ్మతల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముది రాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి,దేవాలయంలో ప్రతిష్టిం చే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం లక్ష రూపాయ లు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్ర తిష్ట కార్యక్రమం నిర్వహించ నున్నారు. తన వయసుకు మించి గ్రామం కోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూ ర్వకంగా అభినందించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

సైబర్‌ నేరాలపై యువతక అవగాహన.

సైబర్‌ నేరాలపై యువతక అవగాహన…

బాలానగర్ నేటి ధాత్రి:

 

సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు బుధవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పలు విషయాలపై సైబర్ క్రైమ్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, యువత అవగాహన పెంచుకుని ఏటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ వినియోగదారులు అపరిచిత వ్యక్తులకు ఓటిపి, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సుజ్ఞానం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్.

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరైన నాయకులు

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్బర్,జుబేర్ యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నథానెయల్,టిపిసిసి జిల్లా మీడియా&కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,మాజీ కౌన్సిలర్ నాగేష్,నర్సింహా యాదవ్,పాండు యాదవ్,మోహీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా?..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 50వరకు పరిశ్రమలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మహీంద్రా&మహీంద్రా,దిగ్వాల్ పిరామిల్,రాక్ వూల్,విఎస్టీ,గిరిధర్ ఎక్స్ ప్లోజెస్,హాట్ సన్, మరియు కొత్తగా వచ్చేవి నీమ్జ్,ఇండస్ట్రీరియాల్ పార్క్,చాలా ఉన్నాయి.ఒక ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న భూముల ధరలు,ఆ ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమయ్యే కనీస ఖర్చులు పెరిగిపోతాయి,నియోజకవర్గంలో యువతకు ఉపాధి,ఉద్యోగాలు అయితే రాలేదు కానీ అన్నిటి ధరలు పెరిగిపోయాయి.ఒక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది అవి తక్కువ ధరలకు భూములు,నీరు,విద్యుత్,పెట్టుబడిపై రాయితీలు,ట్యాక్స్ మినహాయింపు,రోడ్డు రవాణా సౌకర్యం మొదలైనవి కల్పిస్తారు,అందుకు స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం లేని యువతకు 70% నుండి 80% మరియు నైపుణ్యం ఉన్న యువతకు 50% నుండి 60% స్థానికులనే భర్తీ చేయాల్సి ఉంటుంది కానీ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో ఎక్కడా కూడా స్థానికులకు ప్రాధాన్యత నిచ్చింది మాత్రం అంతంత మాత్రమే స్థానిక యువత ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు,దిగ్వాల్ రసాయన కర్మాగారం వల్ల ప్రజలకు ఉపాధి లేదు కానీ త్రాగడానికి నీరు దొరికే పరిస్థితి లేదు,చిలమామిడి శివారులో గల గిరిధర్ ఎక్స్ పోర్ట్ వల్ల చుట్టు ప్రక్కల ఇండ్లు కూలిపోయే పరిస్థితి, గోవిందపూర్ లో గల హాట్ సన్ పరిశ్రమలో డైరీకి సంబంధించి ఉత్పత్తి అవుతాయి కానీ దానికి కావాల్సిన పాలను ఎక్కడో బయటి నుండి తెప్పించుకుంటున్నారు ఉద్యోగాలు చూస్తే నైపుణ్యం గల వారు అంతా తమిళనాడు వారే నైపుణ్యం లేని వారిని యుపి,బీహార్,వారిని తీసుకున్నారు దీనిపై ఆరా తీసుకుందామంటే అక్కడ అధికారులు కనీసం మాట్లాడాటానికి కూడా సిద్ధంగా లేరు, నియోజకవర్గంలో సుమారు 2లక్షల 80 వేల మంది యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కానీ అది మర్చిపోయారు.వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరకాలేదు కాని కాలుష్యం,కనీస వసతుల ధరలు పెరిగిపోయాయి మరియు ఇక్కడి సంపదను ఇతరులు కొల్లగొట్టుకుపోతున్నారు దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు/ ప్రభుత్వంపై ఉన్నది కానీ ప్రభుత్వం అది మర్చిపోయింది.పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించాలి లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం, స్థానిక యువత మొత్తం దీన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది త్వరలో ఉద్యమించి ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,శ్రీనివాస్, లు ఉన్నారు.

సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

ఘనంగా నేతాజీ పురుషుల పొదుపు సంఘం సిల్వర్ జూబ్లీ మహోత్సవం.

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని ఈ క్రమంలో సంఘాలు మరింత అభివృద్ధి చెందాలంటే యువత సంఘానికి సేవలు అందించడానికి ముందుకు రావాలని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల రవీందర్,ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు.నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం 25 వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ మహోత్సవం కార్యక్రమం సంఘం అధ్యక్షుడు పెండ్యాల మల్లేశం అధ్యక్షతన సంఘం కార్యాలయం వద్ద జరిగింది.ముందుగా సంఘ 2024-25 వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలను సంఘం అధ్యక్షుడు మల్లేశం,గణకుడు
ధూపటి వెంకటేశ్వర్లు ప్రవేశ పెట్టారు.1996లో వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వల్గుబెల్లి రంగారెడ్డి స్థాపించగా అనేక ఒడుదొలుగులతో నేడు ఉత్తమ సంఘంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం అని సంఘం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్య అతిదులుగా హాజరైన నీల రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు అంటే ఒక బంగారుబాతులాంటివని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులే అని పేర్కొన్నారు.సభ్యులు సంఘాలను పునాదులుగా ఉంటే తల్లిదండ్రుల పాత్ర పాలకవర్గ సభ్యులు పోషించాల్సి ఉంటున్నదన్నారు.సహకార వికాస సంస్థ ఎలాంటి లాబార్జిత పొందకుండా సేవలు అందిస్తున్నదని సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వల్గుబెల్లి రంగారెడ్డి,సంఘ ఉపాధ్యక్షులు గంగిడి రాజిరెడ్డి పాలకవర్గ సభ్యులు చిట్టోజు రాము, పంజాల భాస్కర్, వల్గుబెల్లి మోహన్ రెడ్డి, మిట్టగడపల సాంబయ్య,అన్నం లింగారెడ్డి,ఓదెల రవి,మెరుగు రాజు, ఒద్దుల బుచ్చిరెడ్డి, వంగపెల్లి కమలాకర్ రెడ్డి, మిట్టగడపల బాబు,మాజీ అధ్యక్షులు నరహరి కట్టారెడ్డి, సాంబరాతి శ్రీనివాస్, చిట్టొజు రమణ చారి,పెండ్యాల మల్లేశం,సాంబరాతి రమేష్, చిట్టోజు రాము,గంగిడి రాజిరెడ్డి, వ్యవస్థాపక పాలకవర్గం లింగాల నరసయ్య, దొడ్డు జయపాల్ రెడ్డి,మాజీ వ్యవస్థాపక పాలకవర్గం సభ్యులు,సమితి పరిది సంఘాల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,ప్రభాకర్,రాయరాకుల రమేష్,బాబు,సమితి గణకుడు రమణాచారి,సభ్యులు పాల్గొన్నారు.

services

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

నేతాజీ పురుషుల పొదుపు సంఘం 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ఎన్నికల అధికారి కందుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టగా అధ్యక్షులుగా అన్నం లింగారెడ్డి,ఉపాధ్యక్షులుగా మేర్గు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,సంఘం అధ్యక్షుడు మల్లేశం,ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి పాలకవర్గం పాల్గొన్నారు.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ

⏩ పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ గాంధీ

⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ

⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం

⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ

దుపాకి సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు,
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు.
వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version