భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పూర్తి చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T164121.801.wav?_=1

 

భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవపూర్ తహసీల్దార్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం మహదేవపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని
తిరస్కరణ జరిగితే, సవివరమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
పౌరులకు ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, భూ సంబంధిత ప్రజా సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, నాయబ్ తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులను మరిచిన డి ఎల్ పిఓ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T133643.438.wav?_=2

 

జిల్లా కలెక్టర్ చోరువతో ఎట్టకేలకు జహీరాబాద్లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు!!!

◆:- కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులను మరిచిన డి ఎల్ పిఓ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దశాబ్ది కాలం తర్వాత ఎట్టకేలకు జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు జరిగిన వెంటనే ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలనే దృఢ సంకల్పంతో అప్పటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కన్నా కలలు సహకారం కావడం జరిగింది. కానీ జహీరాబాద్ లో మాత్రం అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డప్పటికి డివిజన్ పంచాయతీ కార్యాలయం నేటికీ ఏర్పడకపోవడం, గ్రామాలలో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లేవారు, ఇట్టి విషయాన్ని గ్రహించిన పెన్ గన్ న్యూస్ పలు సందర్భలలో జహీరాబాద్ లో డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలిని సూచించడం జరిగింది. అంతేకాకా జహీరాబాద్ నియోజకవర్గం
నుండి అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మరియు సంగారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యదర్శి అయిన తుంకుంట మోహన్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పలుమార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. జహీరాబాద్. నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ కు తమలేఖ ద్వారా తెల్పడం జరిగింది, అంతేకాకుండ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. సరోత్తమ్ ప్రెస్ మిట్ల ద్వారా హెచ్చరిక చేయడం జరిగింది. నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారికి చెప్పడం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో డివిజనల్ పంచాయతీ కార్యాలయానికి మోక్షం కలిగిందని నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరు డివిజనల్ అధికారుల లాగే డివిజనల్ పంచాయతీ అధికారి కూడా ఏళ్ళ వేళలా ప్రజలకు తమ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో
పర్యటించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి వహించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు పనులను చేపిస్తూ, నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. డివిజనల్ పంచాయతీ కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులకు పిలువకపోవడం పై నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మంగళవారం జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్, సాధారణ వార్డులు, ఐసీయూ వార్డులు, రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, ఓపి సేవలు, సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అన్ని విభాగాల ప్రధాన వైద్యులతో సమావేశం నిర్వహించారు.

సిబ్బంది ఖచ్చితమైన సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు రోగులకు వేస్తున్న బెడ్‌షీట్లను మార్చాలని సూచించారు. రోగులకు అందించే ఆహారానికి స్పష్టమైన మెనూ ఏర్పాటు చేయాలని సూచించారు.
వైద్య సేవలపై రోగులు అభిప్రాయాలు చెప్పేందుకు ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, చికిత్స పొందుతున్న రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవలపై స్పందనను అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యల్లో బాగంగా ఫైర్ ఎస్టింగ్విషర్‌ల గడువు ముగిసినట్లు గుర్తించిన కలెక్టర్, ఇప్పటి వరకు ధృవీకరణ ఎందుకు తీసుకోలేదని పర్యవేక్షకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడం కోసం జిల్లా వైద్య శాఖ ఆధీనంలో ఖాళీగా ఉన్న భవనాన్ని వినియోగించాలని సూచించారు. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రోజుకు దాదాపు వెయ్యి మందికిపైగా వైద్యసేవలు అందుకుంటున్నారని పర్యవేక్షకులు డా. రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రసూతి విభాగాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రతి నెల 160–180 ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. అందులో సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ల వివరాలు, ప్రమాదకర కేసులను ఎక్కడికి రిఫర్ చేస్తున్నారన్న అంశాలను కూడా కలెక్టర్ వివరంగా ఆరా తీశారు.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఉపయోగించటం లేదని గుర్తించి, లీకేజీల కారణంగా వినియోగం ఆగిపోయిందని వైద్యులు వివరిగా తెలియజేయగా, వెంటనే మరమ్మతులు చేసి సేవల్లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగుల భద్రత, నాణ్యమైన వైద్యసేవలు నిర్దేశిత విధానంలో అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్ ఎం ఓ దివ్య అని విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

కటకం జనార్ధన్ పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ని సమస్యలను పరిష్కరించాలని వారు సూపర్డెంట్ ను కోరారు కానీ వారం రోజులు గడుస్తున్నా హాస్పిటల్ యొక్క సమస్యలు పెరుగుతున్నాయి తప్ప వాటి పరిష్కారం కావడం లేదు కావున జిల్లా కలెకర్ట్ సమక్షంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్రాసిన వినతిపత్రం ను భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కి అందించడం జరిగింది.

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

◆:- జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అన్నీ రాజకీయ పక్షాలు,యువజన సంఘాలు,కుల సంఘాలు, ప్రజలు అఖిల పక్షంగా ఏర్పడి నిరసనదీక్షలు,నిరాహార దీక్షలు,ఆందోళనలు చేయడం జరిగింది ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గి ఆనాడు జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ గా మారిన తర్వాత ఆర్డిఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసారు డివిజన్ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు అవుతున్న ఇంకా కొన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలు రాలేదు ఇంకా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నే కొనసాగుతున్నాయి,అందులో ముఖ్యంగా డిఎల్ పీవో కలదు.ఇది డివిజన్ స్థాయి కార్యాలయం జిల్లా కేంద్రం నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కార్యాలయం అక్కడే కొనసాగుతున్నది,దీని వలన ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు ముఖ్యంగా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయము లేకపోవడం వలన గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది

డిఎల్ పిఓ కార్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయానికి ఉంటుంది గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు

నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి పైనా చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోని ప్రజలకు అందుబాటులో ఉండాలని దళిత నేత తుంకుంట మెహన్ కోరారు. దశాబ్ది కాలం నుండి జహీరాబాద్ డివిజన్ పరిధిలో అందరు డివిజనల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుంటే,, డివిజనల్ పంచాయతీ అధికారి మాత్రం హైదరాబాద్ నుండి మరియు సంగారెడ్డి నుండి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజావాణి లో కూడ పిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు.ఇప్పటికైనా డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం జరిగింది.

జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ కి వినతి పత్రం అందించిన TUWJU యూనియన్ నాయకులు

జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ కి వినతి పత్రం అందించిన TUWJU యూనియన్ నాయకులు

◆:- జిల్లా అక్రిడేషన్ కమిటీలో ఉర్దూ యూనియన్ నాయకులకు స్థానం కల్పించాలి అని మనవి*

◆:- న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి

◆:- అనుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శనివారం రోజున సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ని కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వినతి పత్రం అందించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విలేకరులకు కూడా మండల స్థాయిలో అక్రిడేషన్ ఇవ్వాలి మరియు జిల్లాస్థాయిలో ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులను కూడా అక్రిడేషన్ కమిటీలో చేర్చాలి గతంలో న్యాయస్థానం లో న్యాయపోరాటం చేసి న్యాయస్థానాలను కూడా ఉర్దూ విలేకరులు చేస్తున్న పోరాటం న్యాయదే అని భావించి తెలంగాణ హైకోర్టు కూడా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్లను జిల్లా మరియు రాష్ట్రంలో గుర్తించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు ఆ తీర్పుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అందులో భాగంగా శనివారం రోజున జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ నీ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా అనుకూలంగా స్పందించి సంబంధించిన వారితో మాట్లాడి ఆమె ప్రాసెస్ లో ఉంది అని అతి త్వరలో కమిటీలో చేర్చేలాగా ప్రయత్నిస్తామని అనుకూలంగా స్పందించారు దీంతో సంతోషం వ్యక్తం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆయుబ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ మహమ్మద్ గౌసుద్దీన్ నిజామీ, జహీరాబాద్ ఉర్దూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ జమీరుద్దీన్ నాయకులు వసీంగౌరీ, మహమ్మద్ అల్లావుద్దీన్ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T115630.283.wav?_=3

 

ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా….

◆:- ప్రభుత్వ నిబంధనలు బేకాతర్

◆:- నియోజకవర్గ ఆయా మండలాల అక్రమ పత్తి వ్యాపారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల్లో అక్రమ పత్తి వ్యాపారుల ప్రైవేట్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ వారు మాకేం కాదంటూ తమ వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నారు. కూత వేటు దూరంలో ప్రభుత్వ సిసిఐ కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రైవేటు వ్యాపారుల చీకటి వ్యాపారం కొనసాగుతూనే ఉంది. అమాయక రైతులను మోసం చేస్తూ లక్షల అధికారులు ప్రైవేట్ వ్యాపారాలు ఘటిస్తున్నారు. ప్రైవేటు యాపారం అక్రమంగా జరుగుతుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.

అధికారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల ప్రైవేట్ పత్తి వ్యాపారుల దందా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అక్రమ పత్తి వ్యాపారులను నోటీసులు అందించి చేస్తామని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారులు పట్టించుకోకుండా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆటోల ద్వారా వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను మోసం చేసి పత్తిని తీసుకొచ్చి తల్లాడలో అమ్మకాలు చేస్తే ఆనాడు తల్లాడ పోలీసులు పలువురు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

మరలా అదే విధంగా ప్రస్తుతం కూడా యువకులు ఆటోలు ద్వారా రైతులను మోసం చేసి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కూడా బైండ్లవర్ కేసు నమోదు చేసి అవి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తల్లాడలో అక్రమ పత్తి వ్యాపారులపై కొరడాలు జూలిపించి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సిసిఐ కేంద్రం ద్వారా పత్తిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్….

పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని రాయపర్తి గ్రామంలో ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు,విద్యార్థుల విద్యా ప్రగతి,బోధన కార్యక్రమాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరు బోధన విధానం,పాఠశాలల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు,విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేదిశగా పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,తహసీల్దార్ రాణి, మండల విద్యాశాఖ అధికారి కే.హనుమంత రావు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నిరాహార దీక్ష…..

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నిరాహార దీక్ష.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టినటువంటి నిరాహార దీక్షకు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్* హాజరై విద్యార్థి నాయకులకు దండలు వేసి దీక్ష ప్రారంభించి సంఘీభావం తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిట్యాల మండల కేంద్రంలోని స్థానికంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాల లో విద్యార్థులకు హాస్టల్ వసతి అలాగే కళాశాలలో టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని మరియు పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలని ఏదైతే మండల కేంద్రంలోని హై స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ విద్యాలయం కు దగ్గర ఉన్నటువంటి వైన్ షాపు బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని అలాగే నూతన బస్టాండ్ ను ప్రారంభించి ప్రయాణకులకు విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండేలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం పూర్తిగా స్పందించి ఈ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో మేం డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ఈ యొక్క కార్యక్రమాన్ని రానున్న రోజులలో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు గుండా సురేష్ రాయిని శ్రీనివాస్ వల్లాల ప్రవీణ్ ఓదెల శ్రీహరి చింతల రాజేందర్ కింసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం

 

జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్

జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .   

 

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని  ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ  జయంతి వేడుకలను జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపి శంకర్ నాయక్ రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు పద్మశాలి సంఘం నాయకులు.సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి – కలెక్టర్…

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య.

తహసిల్దార్ కార్యాలయం నుండి వచ్చే ప్రతి ఫైల్ నిర్ణీత ప్రొఫార్మాలో పంపాలి.

ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట, వెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి ప్రావీణ్య, రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఆదేశించారు. గురువారం జిల్లా లోని ఆర్ డి ఓ లు, తహశీల్దార్ల తో కలెక్టరేట్ సమావేశమందిరంలోభూభారతి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన పూర్తి వివరాలు జత చేసి తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయానికి ఆర్డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ కు పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు . నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి సంబంధిత స్థలాలను పరిశీలించి విచారణ జరపాలని అధికారులకు సూచించారు. వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, జీఐఎస్ ఆధారిత సర్వే డిజిటైజేషన్ వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, భూ రికార్డులను పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామాలు కు సంబంధించి పూర్తి వివరాలతో వచ్చిన దరఖాస్తు అన్నిటికి సంబంధించిన ఫైళ్లను అన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు .కలెక్టరేట్ వచ్చిన ఫైళ్లను కలెక్టరేట్ కు సంబంధించి సెక్షన్ అధికారులు క్షుణ్ణంగా సెక్షన్ అధికారులు వచ్చిన ఫైల్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఫైల్ నోట్లు రాసి సిద్ధం చేయాలన్నారు . ఒకవేళ ఫైల్ రిజెక్షన్ అయితే ఎందుకు రిజెక్షన్ చేశాము, అన్న వివరాలు సైతం నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయాల నుండి వచ్చిన ఫైళ్లను జిల్లా స్థాయిలో రూపొందించిన నిర్ణీత ప్రొఫార్మ ప్రకారం సంబంధిత ఫైల్స్ రానున్న 15 రోజుల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) మాధురి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి / జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అందోల్ ఆర్డీఓ పాండు సంగారెడ్డి ,జి.రాజేందర్,జిల్లా లోని తహసీల్దార్లు పాల్గొన్నారు .

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143001.704.wav?_=4

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు బాధితులు సహకరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెల్ 9849905923 నెంబర్ తెలిపారు ఈ మేరకు నష్టపోయే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ సహకరించిన బాధితుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణకు సహకరిస్తున్నామని బాధితుడు దన్నోజిరావ్ తెలిపారు

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా..

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధ వారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ ఫోర్స్ టీములు పటిష్టమైన నిఘా పెంచాలని సూచించారు. మండలాల వారిగా యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలని ఆదేశించారు.
పి.ఏ.సి.ఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత యూరియా నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని
టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల లో తనికీలు చేపట్టాలని,
ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందని పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యూరియా కు కొరత లేదని, రాబోయే 15 రోజులు చాలా కీలకమని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్ళ పల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేయడం జరిగిందని భూసేకరణ చేపట్టిన భూమిలో పంటలు సాగు చేపట్టకుండా అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా నిల్వలు, విక్రయాలపై నివేదికలు
ఏ రోజుకారోజు అందచేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్స్ లో జాప్యం జరుగకుండా సత్వరమే విచారణ చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో అవసరమైన యూరియా కొరకు నివేదికలు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదనపు సేల్స్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

రోడ్డుపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి పూర్తికాలేదు ఈ రోడ్డు నిధులను స్థానిక ఎమ్మెల్యే తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనే రెడ్డి ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి జంగేడు వరకు సెంట్రల్ లైటింగ్ నాలుగు లైన్లతో రోడ్డుకు 10 కోట్లతో రూపాయలతో రోడ్డు నిర్మాణానికి గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు 10 కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులను స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధిని మరిచి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం నిధులను తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి రఘుపతిరావు తిరుపతి మాడ హరీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ…

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నీటి ధాత్రి

 

 

తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి జిల్లా అధ్యక్షుడు కోపర్తి సురేందర్ వినతిపత్రం అందించారు.జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సాంస్కృతిక కళాకారుల కొరకు ఒక గదిని తమకు కేటాయించాలని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ త్వరలోనే జిల్లా సంస్కృతిక సారధి కళాకారుల కొరకు ఒక గదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగ సంఘం మంచిర్యాల గౌరవ అధ్యక్షులు మామిండ్ల లచ్చన్న,అధ్యక్షులు కొప్పర్తి సురేందర్,ఉపాధ్యక్షులు వెల్థురు పోశం,ప్రదాన కార్యదర్శి గొడిసెల కృష్ణ
సహాయ కార్యదర్శి వావిలాల నాగలక్ష్మి,కోశ అధికారి కొప్పర్తి రవీందర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version