అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ…

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నీటి ధాత్రి

 

 

తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి జిల్లా అధ్యక్షుడు కోపర్తి సురేందర్ వినతిపత్రం అందించారు.జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సాంస్కృతిక కళాకారుల కొరకు ఒక గదిని తమకు కేటాయించాలని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ త్వరలోనే జిల్లా సంస్కృతిక సారధి కళాకారుల కొరకు ఒక గదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగ సంఘం మంచిర్యాల గౌరవ అధ్యక్షులు మామిండ్ల లచ్చన్న,అధ్యక్షులు కొప్పర్తి సురేందర్,ఉపాధ్యక్షులు వెల్థురు పోశం,ప్రదాన కార్యదర్శి గొడిసెల కృష్ణ
సహాయ కార్యదర్శి వావిలాల నాగలక్ష్మి,కోశ అధికారి కొప్పర్తి రవీందర్ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T134321.387.wav?_=1

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా లో రైతులకు యూరీయా కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అన్నారు రైతులు రెండవ సారి వేయాలిసిన పంటలకు యూరియాను రైతులు ముందుగా కొనుగోలుక చేయడం సరి కాద ని కలెక్టర్ అన్నారు గురువారం వనపర్తి మండలం పెద్ద గూడెం లో వ్యవసాయ సహకార సంఘం గోదాములో కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం యూరియా నిల్వలను పరిశీలించారు పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడరైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారుజిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, పి. ఎ సి.ఎస్ సిబ్బంది, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు గత సంవత్సరం కంటే సంవత్సరం యూరియా నిల్వలు అధికంగా ఉన్నాయని రైతులు ఆందోళనచెందవద్దని కలెక్టర్ కోరారు

డివిజనల్ పంచాయతీ కార్యాలయం కోరుకున్న ప్రజలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T140359.846-1.wav?_=2

జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ ప్రజావాణి పిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని పలుమార్లు ముఖ్యమంత్రి పదే పదే ప్రసంగాలు చేసి చేప్పు తున్నప్పటికి అవేవి పట్టనట్టు కొందరు అధికారులు వేవహరిస్తున్న తీరును విసుకుచ్చేంది. సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చోరువ తీసుకొని డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అదుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి పెషిలో మరియు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం లో పిర్యాదు చేస్తామని పిర్యాదుదారులు తెల్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాటలు అగౌరవపరచకుండా అధికారులు చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి…

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి

24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఝరాసంగం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-96-1.wav?_=3

పారిశుధ్య లోపం.. ప్రజలకు శాపం

◆:- కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు

◆:- పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రజల అవస్థలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో
ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.

అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.

దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.

Suffer Due to Poor Sanitation

కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T154258.504-1.wav?_=4

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో మంగళవారం సహా రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీటిమునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ వివరించారు. మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల సమీక్షా సమావేశం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T133918.180.wav?_=5

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల సమీక్షా సమావేశం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పి మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల పై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో ఎక్కడా కూడా టోబాకో, మధ్యం విగ్రహాలు జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా పోలీసు, ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష కిట్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు మూసి వేయాలని, దీనికి సంబంధించిన ఆదేశాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడ మద్యం విక్రయాలు జర్గవద్దని అన్నారు.

 

జిల్లాల ఎక్కడ కూడా గంజాయి సాగు జర్గకుండా పక్కా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంజాయి కేసులలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కడా కూడా పిల్లలకు సిగరెట్ లిక్కర్ అమ్మకుండా చూడాలని, దీనిపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయాలని అన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మహేష్ బి గీతే మాట్లాడుతూ,.జిల్లాకు గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులు సమయంతో పని చేయాలని అన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పై నిఘా పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డిఓలు వెంకటేశ్వర్లు రాధాబాయి వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం డిఇఓ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు ఎక్సైజ్ ఇరిగేషన్ లేబర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=6

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-3.wav?_=7

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీప అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 24 నుండి 36 గంటల భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్,ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని,ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని,ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా,వాగు,నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే బిచ్చగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు,నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను,వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు,రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవంలో పప్పెట్రీకి ప్రశంసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T113348.467.wav?_=8

 

 

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలో పప్పేట్రి కి విశేష స్పందన తిలకించిన మంత్రివర్యులు, కలెక్టర్, జిల్లా విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల రెజింతల్ గ్రామ ప్రధాన ఉపాధ్యాయురాలు సఫియా సుల్తానా
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రదర్శనలో. ఎన్ఈపి 2020 అమలు కార్యక్రమాల భాగంగా,సి సి ఆర్ టి న్యూ ఢిల్లీలో శిక్షణ పొందిన సఫియా సుల్తానా ఆ శిక్షణలోని అంశాలను జిల్లా విద్యాశాఖ తరుపున ప్రదర్శించారు.ఈ ప్రదర్శనను రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా నోడల్ ఆఫీసర్, సీఎంఓ, జిల్లా సైన్స్ ఆఫీసర్ ప్రదర్శన కు సందర్శించి తిలకించిన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

పట్టణాలకు తరలిస్తూసొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=9


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

పట్టా భూమిని ఫారెస్ట్ భూమి అంటున్న ఫారెస్ట్ అధికారి

పట్టా భూమిని ఫారెస్ట్ భూమి అంటున్న ఫారెస్ట్ అధికారి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులో 326 సర్వే నంబర్లో పర్వతం ఉమా పేరుమీద 9 ఎకరాలు పర్వతం మహేష్ సన్నాఫ్ యాదగిరి పేరు మీద 13 ఎకరాలు భూమి పట్టా కలిగి ఉంది పెన్నింటి లక్ష్మి పేరు మీద నాలుగు ఎకరాలు పట్ట కలిగి ఉంది ఈ భూమి ని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మాకు పట్టా ఉంది అని చెప్పేసి మేము సాగు చేసుకుంటామని సాగుకు యోగ్యంగా చేసుకుంటున్న భూమిని ఇందులో ఫారెస్ట్ భూమి ఉందని నిలుపుదల చేసిన ఫారెస్ట్ అధికారులు నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు ఇది ఫారెస్ట్ భూమిన రెవిన్యూ పట్టాభూమిన అని తేల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్న ఫారెస్ట్ మండల అధికారి జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఫారెస్ట్ జిల్లా ఉన్నత అధికారులతో సర్వే నిర్వహించి రెవెన్యూ పట్టా భూమిన ఫారెస్ట్ భూమిన తేల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవేళ ఫారెస్ట్ భూమి అయితే తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని రెవిన్యూ భూమి పట్టా ఉంది కాబట్టి వారికి కూడా హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు న్యాయం జరగకపోతే ఆందోళనలకు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం . యాదగిరి పాల్గొన్నారు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T114519.415.wav?_=10

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

కవర్గాలబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని మరియు నియోనికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వం లో నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన 660 మంది లబ్దిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని & నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పాతపక్షంగా ఉండాలని,అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గారికి వినతిపత్రం అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు..

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

అస్వస్థతకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నాణ్యత లేని కూరగాయలు, ఫుడ్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.

:- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం లో పురుగుల అన్నం తిని వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పితో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారు.
కస్తూర్భా గాంధీ కళాశాలలో కలుషితమైన ఆహారం తిని 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి విద్యార్థుల పరిస్థితి విషమించటంతో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికీ చికిత్స అందించడం జరిగింది.
నేను గత శుక్రవారం రోజున ఇదే కస్తూర్భా స్కూల్ సందర్శించడం జరిగింది.
ఆ రోజు కుళ్ళిపోయిన కూరగాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్లకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి కూడా ఫుడ్ పెట్టడం లేదు, పప్పు ఒక చెంచా,ఉల్లిగడ్డ పులుసు చేసి పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కూర తక్కువ కలుపుకుని తింటా ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్లకు క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది.ఆ రోజు మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈ ఈ స్కూల్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడకు రావడం జరిగింది, వారికీ కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా విద్యార్థులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను తెలుసుకొని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యావ్యవస్థ సక్రమంగా నడిచేలా మీరు స్పెషలాఫీసర్ దృష్టి పెట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్నోక్కటే రోజు మూడు స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు. మొన్నటి రోజున విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి తమ సమస్యలు చెప్పుకునే స్థితిని చూస్తే మరి ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉన్నది.

మేము కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు కార్యక్రమాన్ని మేము చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారు. నేను రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు.

ఈ రోజు విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని, ఈరోజు మీకు అర్థమైంది.

కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణి లో ఉన్నాయి. మరీ జిల్లా జనరల్ అసుపత్రిలోని కింది స్టాప్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయం తోటి నియమించబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కో ఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తి కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నట్టువంటి పరిణామాలను మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలని, ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము, మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అని భయపడుతున్నారు.
కాబట్టి మీరే పిల్లలు నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలియజేస్తూ.
ఇప్పటికైనా స్పెషల్ కమిటీ నియమించి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాలపై దృష్టి పెట్టాలనికోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుకాణాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ముందుగా వారు స్టాక్ బోర్డును పరిశీలించి 616 యూరియా బ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడద్దని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది వారితో పాటు డి ఏ ఓ బాబురావు ఎం ఏ ఓ ఐలయ్య ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో భాస్కర్ గణపురం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి పాల్గొనడం జరిగింది

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూము తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో ముకాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సత్వరం పనులు పూర్తి అయ్యేలా పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ పిడిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగి తెలుసుకుని ఇసుక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వపల్లి నుండి ఇసుక తెస్తున్నట్లు పిడి తెలిపారు.
అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పశువుల చికిత్స కు వచ్చిన రైతులతో వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు స్టాకు ఉంచాలని, పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయాలని సూచించారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. అవసరమైన మందుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ డిడిని సూచించారు. ఈ సందర్భంగా గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు జిల్లా కాలెక్టర్ కు గొర్రె పిల్లను బహుకరించారు వ్యాధులతో బాధ పడే ప్రజలు వైద్యుల సలహాలు, సూచనలతో మేరకు క్రమం తప్పక మందులు వాడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.శుక్రవారం గణపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలకు వచ్చిన ప్రజలతో సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ పేరేంటి అని గట్టయ్యను అడిగి తెలుసుకుని ఏమి సమస్య ఉంది, వైద్యులు మంచిగా చూశారా లేదా మందులు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తేలు కుట్టినందున వైద్య సేవలకు వచ్చానని తెలుపగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. ఓపి రిజిస్టర్, స్టోర్ రూము ను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరం మేర తీసుకోవాలని సూచించారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు ఎంత మంది రైతులు యూరియా తీసుకున్నారని వివరాలు అడుగగా 13 మంది రైతులకు 30 బస్తాలు యూరియా ఇచ్చామని తెలిపారు. ఎరువులు, విత్తన దుకాణాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూములను పరిశీలించారు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ భారతి దరఖాస్తులు. పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. నోటీసు లు జారీ, విచారణ ప్రక్రియ, దరఖాస్తులు తిరస్కరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తు దారులకు కారణాలు తెలియచేయాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో కార్యాలయానికి వచ్చిన వయోవృద్ధునితో ఏ సమస్య కొరకు వచ్చారని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version