గల్లీకో బెల్ట్ షాప్….

గల్లీకో బెల్ట్ షాప్….!

బంద్ వైన్ షాపుల కేనా…!బెల్ట్ షాపులకు కాదా…?

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాప్ లు

బెల్ట్ షాపులను నియంత్రించే అధికారులు ఎక్కడ

హోల్ సేల్ ముసుగులో బెల్ట్ షాప్ లకు విక్రయాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.

 

బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు

బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.

వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల

ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?

మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=1

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

◆:- ఆశ్చర్యపోతున్న ఓటర్లు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

Local Election Buzz

కూడగట్టుకుంటున్న మద్దతు

సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో
కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు

నేతల చుట్టూ చెక్కర్లు.

సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.

Local Election Buzz

ఓటరు జాబితా ప్రచురణ

ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.

యూరియ కోసం… రైతుల తిప్పలు…

– యూరియ కోసం…
రైతుల తిప్పలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

యూరియా కోసం రైతులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో శనివారం రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 400 బ్యాగులో యూరియా గ్రామానికి సరఫరా చేసింది. విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగినంత యూరియా రైతులకు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహులు, ఏఈఓ శ్రీలత, గ్రామస్తులు ఉన్నారు.

వెంకటాపూర్ గ్రామానికి మరొక రేషన్ షాప్ కొరకు వినతిపత్రం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T151556.326.wav?_=2

వెంకటాపూర్ గ్రామానికి మరొక రేషన్ షాప్ కొరకు వినతిపత్రం.

మందమర్రి నేటి ధాత్రి

 

 

వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేల్పుల చిరంజీవి మందమర్రి బి వన్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని, కలిసి వెంకటాపూర్ గ్రామo ప్రజల తరపున రేషన్ షాప్ మరొకటి కావాలని మంత్రి వర్యులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకట్ స్వామి సానుకూలంగా స్పందించి సంబంధించిన ఆఫీసర్ కి సిపారస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ధర్మారావుపేట లో గ్రామ దేవతలకు ఘనంగా పూజలు..

ధర్మారావుపేట లో గ్రామ దేవతలకు ఘనంగా పూజలు

ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

Akula Subhash Mudiraj

గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామములో లొ బుధవారం శ్రావణమాసం ఊర పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలొ భాగంగా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని తల్లిని గ్రామ ప్రజలు కలిసి గ్రామ దేవతలకు చిర సారె పసుపు కుంకుమ పూలు పండ్లు డప్పు చప్పుల్లతో శివసత్తుల ఆటపాటలతో కోడి మేకల తో భక్తులందరూ ఊరేగింపుగా ఊర పోచమ్మ తల్లి బోనాలు ఎత్తుకొని ఊరంత ఉత్సాహంతో ఉత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.

Akula Subhash Mudiraj

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచి ఉప సర్పంచ్ పోతుల ఆగమ్మ ఆకుల తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్ పూజారి రాజేందర్ మత్స్య శాఖ అధ్యక్షులు ఆకుల రాజన్న గౌడ్ సంఘం అధ్యక్షులు నారగాని ఎల్ల స్వామి మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు బాపని రాజయ్య రజక సంఘం అధ్యక్షులు జాలిగాపు రాజయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కడారి బాబు కమిటీ సభ్యులు దూలం శంకర్ కాటకం స్వామి గ్రామస్తులు ఆకుల రవీందర్ నరసింహరావు ఆకుల దామోదర్ పని సాంబయ్య బెనికి రాజేందర్ కేసేటి కుమారస్వామి అక్క పెళ్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన..

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి..

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మరిపెడ మండల నాయకులు బాణాల రాజన్న, బోడపట్ల రాజశేఖర్ డిమాండ్

మరిపెడ నేటిధాత్రి.

గురువారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించాలని మరిపెడ మండల ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి కి సిపిఎం గుండెపూడి కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దత్తత గ్రామమైన గుండెపుడి గ్రామంలో సమస్యలు నెలకొన్నాయని, వీధిలైట్లు మురికి కాలువలు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామంలో మూడు మంచినీటి బావులు ఉన్నా కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు, ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాలకు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతునరాని, మురికి కాలువలో ఉన్న చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు పెరిగి విష జ్వరాలు పెరిగి ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామంలో తక్షణమే గ్రామ కార్యదర్శిని నియమించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి షేక్ షరీఫ్ బయ్య సురేష్, కందాల రమేష్ ఎల్లయ్య నారాయణ,అలీ శ్రీనివాస్ రెడ్డి గణేష్, సురేషు, రామ్మూర్తి, ఈమన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

వెల్దండ/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు ఆధ్వర్యంలో.. బుధవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు కోసం రోడ్డు తవ్వి కంకర పరిచారని నెలలు గడుస్తున్నా… బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=3

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-7.wav?_=4

చిన్న మీడిసిలేరు గ్రామంలో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల హోమియోపతి వైద్యరాలు డాక్టర్ పూజ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య కేంద్రంలో 67 మంది ప్రజలను చూసి హోమియోపతి మందులను అందించారు
డాక్టర్ పూజ మాట్లాడుతూ హోమియో మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేసే మందులు ఈ మందులు అందరూ ఉపయోగించుకోవాలి
దీర్ఘకాలిక రోగాలకు చర్మ రోగాలకు పిడ్స్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల సమస్యలు ఫైల్స్ మొదలగు అన్ని వ్యాధులకు ఈ మందులు చక్కగా పనిచేస్తాయి
అందరు హోమియోపతి మందులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరులో ఈ మందులు ఉచితంగా లభిస్తాయి కనుక చర్ల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేశారు

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం .

https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం 
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ 
పరకాల నేటిధాత్రి 
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలోని వెంకట చెరువు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో 34 మంది రోగులను పరీక్షించారు
అనంతరం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను బాలింతలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గల గ్రామాలలో మరి ముఖ్యంగా మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశం అధికంగా ఉన్నది కనుక ఆశకార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది గ్రామాన్ని తరచూ సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలి అని అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ కొండ్రు నరసింహ మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత పాల్గొన్నారు

కాట్రపల్లి గ్రామానికి క్వారీ గడ్డం…

కాట్రపల్లి గ్రామానికి క్వారీ గడ్డం…

వారిని మూసేయాలని కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన యువకుడు

కేసముద్రం/ నేటి ధాత్రి

మహబూబాబాద్. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి.. సోమవారం ప్రజావాణిలో డిస్టిక్ కలెక్టరేట్ జిల్లా అధికారులతో సహా స్థానిక స్థానిక ఎమ్మార్వో ఆర్డీవో జిల్లా పంచాయతీ శాఖ అధికారుల అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందని కాట్రపల్లి గ్రామానికి చెందిన నల్లగొప్పుల హరీష్ తెలిపారు..ఫిర్యాదు గల కారణాలు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సాయి బాలాజీ గ్రానైట్ వారు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ రాత్రి సమయంలో సైతం బాంబుల మూతతో గ్రామాన్ని దద్దరిల్లేలా చేస్తున్నారు తెలిపారు.దీనివల్ల గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ ఈ క్వారీ నుండి భారీ శబ్దాలు మరియు భూమి కంపించడం వల్ల అనేక ఇండ్లకు గోడలు బీటలు వారాయి గుండె సంబంధిత రోగులు చిన్న పిల్లల వృద్ధులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.ఇంకా రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా మారాయని క్వారీ నుండి పెద్ద పెద్ద పండరాళ్లతో అధిక లోడుతో వెళ్తున్న ఈ లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయని, రోడ్లు గుంతల మయమై వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంటున్నాయని, ఈ క్వారీ నుంచి వచ్చే కలుషిత నీరు బాంబుల రసాయనాల వల్ల వచ్చే కలుషిత విషపూరితమైన నీరు పక్కనే ఉన్న ప్రవహించే ఏరు వాగు నీటిని పంట పొలాలకు నిరంతంచే నీరు కలుషితమై చేపలు మరియు ఇతర మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి అని దయచేసి సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రానైట్ క్వారీని వెంటనే మూసివేయాలని సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు.!

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు గ్రామ పెద్దలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము సాయంత్రం పగటి సవార్లు మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.పీర్లకు చక్కెర,గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ధూపంతో ప్రత్యేక మొక్కులు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి.11-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు దర్గాలకు.తీసుకెళ్లి మగ్గబెట్టి పూర్తి చేస్తారు

జహీరాబాద్ : పీర్ల పండుగ (మొహర్రం)ను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నాగుల కట్ట దగ్గర ఏర్పాటు చేసే పీర్లను ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగించారు. అహ్మద్ సాహెబ్ సాయంత్రం పట్టణంలోని పీర్లు వెళ్లి కలవడంతో అక్కడ జాతరను తలపించింది.

 

ఝరాసంగం: మండల కేంద్రంతో పాటు చిలేపల్లి మేడపల్లి కంబాలపల్లి బొప్పనపల్లి కుడు సంఘం తుమ్మనపల్లి తదితర గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీర్లకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆదివారం పీర్ల ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పీర్ల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలకు షర్బత్‌ను పంపిణీ చేశారు.

మొగుడంపల్లి : మండల ధన సిరి జాడి మల్కాపూర్ ఇప్పేపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్‌ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్‌ తదితరులు ఉత్సవాల్లో పాల్గొని పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కోహీర్: మండల పరిగిలో పీర్లతో నిర్వహించిన ఊరేగింపు వైస్ చైర్మన్ షాకేర్ పాల్గొని మాట్లాడారు. మొహర్రం మత సామరస్యానికి పత్రీకగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.

న్యాల్కల్ : మండల డప్పూర్ మల్గి మెటల్ కుంట హద్నూర్ తదితర గ్రామాల్లో ఆటాపాటలతో అలావ్‌ ఆడుతూ పీర్లను ఊరేగించారు. సాయంత్రం సమీపంలోని చెరువుల్లో పీర్లను నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి

డిపిఓ డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

శనివారం రోజున జిల్లా పంచాయితీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.వీధులన్నీ తిరుగుతూ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్డు ప్రక్కన,షాపుల ముందు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి పంచాయితీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతీరోజూ తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రపరచాలని తెలిపారు,షాపుల యజమానులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను రోడ్డు ప్రక్కన పడవేయవద్దని,డస్ట్ బిన్ వాడాలని సూచించారు.సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్టు ఎరువు తయారు చేయాలని,స్మశాన వాటిక పరిశుభ్రంగా ఉంచాలని,పల్లె ప్రకృతి వనం మొక్కలను సంరక్షించాలన్నారు.త్రాగునీటి వాటర్ ట్యాంకు లను పరిశీలించి క్లోరినేషన్ చేయించి శుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కురుస్తున్న వర్షాకాల దృష్ట్యా సరిపడా బ్లీచింగ్ పౌడర్,బై లార్వా నిల్వ ఉంచుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,వర్షాకాలం గ్రామ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయితీ కార్యదర్శికి సూచించడం జరిగింది.అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ పర్యటనలో డిపిఓ వెంకటేశ్వరరావు,జైపూర్ మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపురావు,పంచాయతి కార్యదర్శి ఎం.విష్ణువర్ధన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా దత్తు రెడ్డి నియామకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాలు మేరకు హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్ ,జనరల్ సెక్రటరీ గా బొడ తుకారాం లకు మరియు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ మోసపూరిత 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరపున తమ పోరాటం తప్పదన్నారు సమీష్టగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో పీజీ శంకర్, కిష్టా రెడ్డి,రాథోడ్ భీమ్ రావు నాయక్,మధు, అహ్మద్,కసిం,షకీల్,అడ్డు,బాబ్బు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version