బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటి దాత్రి :

 

చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటి దాత్రి :

 

చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ సెంటర్ దోమల యశోద, టు సెంటర్ జి లలిత.ఆయా పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు….

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం లోని కాల్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో తిరుమల, విజయ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో జరుగు కార్యక్రమాలు పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తులు, లోప పోషణ, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించనైనది. ఇందులో భాగంగా ఒక గర్భవతికి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సృజన మహిళలు, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,ఫర్జానా హాజరైనారు

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T130809.774.wav?_=1

 

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి

అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీలో పోసిన మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ స్వప్న సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్ల తల్లులు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివ్వాలి ఆకుకూరలు పప్పు అంగన్వాడి నుండి వచ్చే ఫుడ్డును పిల్లలకు అందివ్వాలి భోజనానికి ముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఈగలు రాకుండా ఇంటి ఆవరణ చుట్టుపక్కల శుభ్రంగా చేసుకోవాలి లా చేయడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం…

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఘన పోషణ మాస కార్యక్రమం

ఘన పోషణ మాస కార్యక్రమం

సూపర్వైజర్ అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు స్త్రీలు బాలింతలు చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడి కేంద్రం నుండి వచ్చిన ఫుడ్డును పిల్లలకు తినిపించాలి దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి. వనిత బీ లక్ష్మి రమాదేవి అంగన్వాడి ఆయా రమ ఆశ వర్కర్స్ సుకన్య కోమల గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం….

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం…

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే
అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు
గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు…

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు .

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట, కొత్తపేట గ్రామాలలో పోషణ మాస ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుండి కిశోర బాలికలందరు , మహిళలు,సమతుల ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పాటిస్తూ బయట వారి మాటలకు, ప్రలోభాలకు, గురి కాకుండా ఉండాలని చెప్పి బరువులు, ఎత్తు లు చూసి, ఐరన్ మాత్రలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయించనైనది. అంగన్వాడి టీచర్స్ కూరగాయలతో, పూలతో అలంకరించిన బతుకమ్మలు మట్టితో తయారు చేసిన, బొమ్మల స్టాల్స్ అందరినీ ఆనందపరచాయి. ఈ ప్రోగ్రాంలో ఏఎన్ఎం లహరి, టీచర్స్ వసంత ,మమత ,సాధన ,రమసుజాత, ఉమ, ఆశ వర్కరు సాయి వేద కిశొర బాలికలు హాజరైనారు.

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం…

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 17, బుధువారం రోజున న్యాల్కల్ మండలంలోని ముర్తుజాపూర్ గ్రామ పంచాయితీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాత్ , గ్రామ నాయకులు, అజమ్ పటేల్, సిరాజ్ పటేల్, మోహన్ రెడ్డి, రమేశ్ పటేల్, సాల్మన్, దినకర్,ప్రశాంత్ మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలో సీజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-32-7.wav?_=2

అంగన్వాడీలో సీజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం.

చిట్యాల,నేటిధాత్రి :

చిట్యాల మండలం లోని శాంతి నగర్ లోసోమవారం రోజున శాంతినగర్ అంగన్వాడి కేంద్రాన్ని జయప్రద సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్ రాకేష్ గారు,జాయింట్ విసిట్ చేసి వర్షాకాలం అయినందున సీజన్ వ్యాధులు ప్రబలకుండా, తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిసరాలన్నీ ఈగలు, దోమలు, వాలకుండా ఎప్పటికప్పుడు ఫినాయిల్, డెటాల్, బ్లీచింగ్ పౌడర్ , చల్లి,కడిగి శుభ్రంగా పెట్టుకొని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, వేడివేడి భోజనం తినాలని, వడకట్టి వేడి చేసిన నీటిని తాగాలని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు విరోచనాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించి, పిల్లలకు, తల్లులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజిత, ఏఎన్ఎం, ఆశ వర్కర్ హాజరైనారు.

“ములుగు‌లో రాష్ట్రంలో మొదటి క్రష్ కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T151830.684.wav?_=3

 

ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామంలో క్రష్ కేంద్రం ఏర్పాటు

#క్రష్ కేంద్రం లో పిల్లల సంరక్షణ.

#పల్నా పథకం ద్వారా జిల్లాలో 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు.

#రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామం లో క్రష్ కేంద్రం ఏర్పాటు.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

 

 

క్రష్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు, పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు ఇట్టి కేంద్రాలను ఉపయోగించుకోవాలని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి మరియు డే కేర్ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం అంచనా 15 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సరైన క్రష్ కేంద్రాలు లేకపోవడం తో తరచుగా, మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా మారిపోయిందని, తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న
ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రేష్ సౌకర్యాలను అందించబడుతాయని పోషకాహారo, పిల్లల ఆరోగ్యం, పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రెచ్ కేంద్రాలు అందిస్తాయని తెలిపారు.
ములుగు జిల్లా లో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐ సి డి ఎస్ ప్రోజెక్టుల పరిధిలో పల్నా పథకం ద్వారా 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ వినోద్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి టి. రవి, తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రష్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రష్, రాంప్రసాద్, సీడీపీఓ ములుగు కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నర్సంపేట -4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతి ఆధ్వర్యంలో తల్లిపాల పట్ల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సెక్టార్ సూపర్వైజర్ రమ హాజరై మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే పాలను ముర్రుపాలు అంటారని వాటిని త్రాగించడం ద్వారా బిడ్డకు నిరోధకశక్తి వెంటనే అందుతుందని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డల ఆప్యాయత పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డను తయారుచేసిన వారవుతారన పేర్కొన్నారు.బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి పోతపాలు,సీసాపాలు ఇవ్వవద్దని ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకు తినిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ,అంగన్వాడీ టీచర్ గౌసియా, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య,అర్పి రజిత,ఆశ కార్యకర్త రమ,తల్లులు మౌనిక,సువార్త,అనూష,శ్రీలేఖ, అనిత,జ్యోతి, సుమలత,నాగజ్యోతి, సౌమ్య, వజ్రమ్మ, శోభ,రాజా తల్లులు పాల్గొన్నారు.

సిఐటియులో చేరిన అంగన్వాడీలు.

సిఐటియులో చేరిన అంగన్వాడీలు.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నల్లబెల్లి మండలంలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలు మంగళవారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సమక్షంలో సిఐటియులో చేరారు.ఈ సందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ కార్మికుల మెడపై కత్తిలా వేలాడుతున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక వర్గం ఉద్యమిస్తున్న తరుణంలో అంగన్వాడీలు సిఐటియులో చేరడం అభినందనీయమని, పోరాడే శక్తిని పెంచుతుందని, ఉద్యమాలకు ఊతమిస్తుందని తెలిపారు.అంగన్వాడీల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి విజయాలు సాధించింది సిఐటియు మాత్రమేనని ఆమె తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సిఐటియు ఆధ్వర్యంలో సాధించడానికి ఈ చేరికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని, ఉద్యమ శక్తిని పెంచుతాయని చేరిన అంగన్వాడీలను అభినందించారు.బుదవారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాజెక్టు ఆఫీసులో సమ్మె నోటీసు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ పాల్గొన్నారు సిఐటియులో చేరిన అంగన్వాడి నాయకుల్లో జాటోత్ సుజాత, పిన్నింటి రజిత, ఉదయ, జమున, భాగ్యమ్మ, సుమలత, కల్పన, శీలాభాయి, ఎండి అస్మత్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version