హాలో మేడి కో పేరెంట్ – చలో వరంగల్…

హాలో మేడి కో పేరెంట్ – చలో వరంగల్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం తెలంగాణా లోని మేడికల్ కాలేజీల్లో
సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వున్నా, మేడిఠల్ పేరెంట్స్ కలిసి ఏప్రిల్ 17 శుక్రవారము రోజు తలపెట్టిన కే ఎన్ ఆర్ యూహెచ్ ఎస్ లోని నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యాలో హజరుకావాలిని భూపాలపల్లి జిల్లా మేడికో పేరెంట్స్ సమవేశము లో పిలుపు ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ (భూపాలపల్లి జిల్లా ఇంచార్జి) జెల్లా నాగేందర్ మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో 209 కోట్ల అధిక పేజూలు వసులు చేస్తూ కనీస సౌకర్యాలు కలిపించకుండ ఆడపిల్లల భద్రత మరియు ర్యాగింగ్ పైన ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లోని పెరెంట్స్ అందరు పాల్గోని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
భూపాలపల్లి జిల్లా నుండి వచ్చేవారు తమని సంప్రదించాలని సెల్ నెంబర్: 7997 888 777 కో తెలిపారు. ఈ కార్యక్రమములో పెరుగు రవింద పోలు రమేష్ , కటకం జనార్థన్ , అల్ల సుధాల ఖరీల్ సతీష్నరు శ్రీథివాస్ పాల్గోన్నారు .

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్…

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున రాష్ట్ర విద్యాశాఖ అనుదేశానుసారంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించినట్టుగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు అన్ని రకాల పౌష్టికాహారాన్ని అందించినప్పుడే పిల్లల్లో ఎదుగుదల కనిపించి ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థుల కోసం వివిధ రకాలైన వంటకాలను చికెన్, చికెన్ బిర్యాని,తెలంగాణ వంటకాలు,పులిహోర గులాబ్ జామ్,సేమ్యా,పుల్కా, సర్వపిండి,నువ్వుల ముద్దలు,
పల్లి పట్టీలు,పేలాల ముద్దలు, రాఫుడ్, వివిధ రకాలైనటువంటి పండ్లు తీసుకువచ్చి వారి పిల్లలకు తినిపించారు‌.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,అంగన్వాడి టీచర్ బీముడి లక్ష్మి,సుమారు 40 మంది తల్లులు పాల్గొనడం జరిగింది.

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం…

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం

భూపాలపల్లి నేటి ధాత్రి

https://youtu.be/rTUfmQNMqwg?si=xOj8JynoqGJa6sua

 

సింగరేణి హై స్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సి హెచ్ జాన్సీ రాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ జాన్సీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
“పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లో కూడా పునరావృతం చేసేలా ప్రోత్సహించలన్నారు . మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, టెలివిజన్ సోషల్ మీడియా వినియోగంపై తగిన నియంత్రణ వహించాలన్నారు . పిల్లలతో రోజూ కొంతసేపు మాట్లాడి, వారి సమస్యలు, అభిరుచులు తెలుసుకోవాల్న్నరు . తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం, అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమయపాలన పాఠశాల హాజరు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version