డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ దారితప్పుతోందన్న గీసుకొండ సర్పంచ్ ఆందోళన

గంజాయి, డ్రగ్స్ అలవాటుతో దారితప్పుతున్న యువత

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి:*

కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి స్వార్థం కోసం విస్తరింపజేస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు అలవాట్ల కారణంగా 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వారి భవిష్యత్ దారితప్పి తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చితున్నారని ఈ పరిస్థితిపై గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పౌర హక్కులు–సామాజిక సమానత్వం–యువత భవిష్యత్తే లక్ష్యంగా..గీసుకొండ మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ సబ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
గీసుకొండ డిప్యూటీ తహసిల్దార్ వీందర్ రావు,టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు,
వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కోట ప్రమోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ బోధించు,సమీకరించు, పోరాడు అనే మహానినాదంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు అని కొనియాడారు. గ్రామంలో విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు ప్రభావం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సమస్యపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించే ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్ మాట్లాడుతూ
ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సమాన అవకాశాలు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ రుణపడి ఉండాలని తెలిపారు. చదువు ద్వారా ప్రశ్నించే తత్వం పెరుగుతుందని, నేటి సమాజంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు వంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ద్వారానే ఎదిగారని స్పష్టం చేశారు.

దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ,
పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని దళితులపై జరుగుతున్న దాడుల వల్ల నష్టపోయేది సమాజమేనని పేర్కొన్నారు.కుల భేదాలను మర్చిపోయి మేము–మీరు అనే భావనను విడిచిపెట్టి అందరం ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించి గీసుకొండ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. రాజేంద్రప్రసాద్, హెచ్డబ్ల్యూఓ హరిత, గ్రామం వార్డు మెంబర్లు పసుల యుగేందర్, దౌడు చిన్న జ్యోతి, దౌడు ఎలీషా, దౌడు సారిక, మాజీ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ వార్డ్ మెంబర్ దౌడు రాజేష్ గ్రామ కరోబార్ అలీ
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం సందర్శన.

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు.అక్కడి పిల్లల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి తమ పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

అప్పుడు చిరాకు.. ఇప్పుడు వ్యసనం..

అప్పుడు చిరాకు.. ఇప్పుడు వ్యసనం.. మాట మార్చిన కింగ్

హిందీలో బిగ్ బాస్ (Bigg Boss) అంటే సల్మాన్ ఖాన్ (Salman Khan).. సల్మాన్ ఖాన్ అంటే బిగ్ బాస్. అదే తెలుగులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అంటే బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటే నాగ్ అని చెప్పుకుంటున్నారు.Akkineni Nagarjuna: హిందీలో బిగ్ బాస్ (Bigg Boss) అంటే సల్మాన్ ఖాన్ (Salman Khan).. సల్మాన్ ఖాన్ అంటే బిగ్ బాస్. అదే తెలుగులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అంటే బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటే నాగ్ అని చెప్పుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు 7 సీజన్లుగా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ మొదలయ్యింది. సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మూడో సీజన్ నుంచి నాగ్ బిగ్ బాస్ ని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రతి సీజన్ కి హోస్ట్ మారతాడు అంటూ వార్తలు వచ్చినా చివరకు నాగ్ నే హోస్ట్ గా వస్తున్నాడు.అయితే బిగ్ బాస్ రెండు సీజన్స్ నడిచేటప్పుడు.. ఆ షో గురించి నాగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ షో కాన్సెప్ట్ అంటేనే చిరాకు అని, తానెప్పటికీ ఆ షో చూడను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత సీజన్ లోనే హోస్ట్ గా కనిపించేసరికి నెటిజన్స్ నాగ్ పై విమర్శలు గుప్పించారు. చెప్పడానికే నీతులు.. డబ్బులు ఎక్కువ వస్తే మాటలు కూడా మార్చేస్తారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆ విమర్శలపై నాగ్ ఎప్పుడు స్పందించలేదు.ఇక తాజాగా జియో హాట్ స్టార్ సౌత్ అన్ బాండ్ వేడుకలో నాగార్జున.. మాట మార్చాడు. ఒకప్పుడు చిరాకు అన్న షోనే ఇప్పుడు తనకు వ్యసనంగా మారిందని చెప్పుకొచ్చాడు. ‘ ఒకప్పుడు బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం లేదు అన్న మాట వాస్తవమే. కానీ, ఒక్కసారి ఇందులోకి అడుగుపెట్టాక తెలిసింది. ఇప్పుడు నాకు ఈ షో ఒక వ్యసనంలా మారింది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో గతంలో నాగ్ అన్న మాటను వెనక్కి తీసుకున్నట్టే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకో వారం బిగ్ బాస్ సీజన్ 9 కూడా పూర్తవుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 10 కి కూడా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తాడా.. ?లేక మారతాడా అనేది చూడాలి.

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘పుష్ప’ మత్తు వదిలించుకుంటున్న సుకుమార్

 

‘పుష్ప’ మత్తు వదిలించుకుంటున్న సుకుమార్

తన తాజా చిత్రం ‘పుష్ప’ వరల్డ్ దర్శకుడు సుకుమార్ సరికొత్త లీగ్లోకి అడుగుపెట్టారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం నిర్మాణానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టినా, ‘పుష్ప 2’ భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలవడంతో ఆ కష్టం ఫలించింది. ‘పుష్ప’ రెండో భాగం పూర్తయిన తర్వాత సుకుమార్ పనికి పూర్తిగా విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి విహరిస్తూ, తనకంటూ కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు.

కొందరు సుకుమార్ ‘పుష్ప’ విజయాన్ని ఉపయోగించుకొని మరో పెద్ద స్టార్తో తదుపరి ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని భావించవచ్చు. కానీ, ఇది తప్పనిసరిగా జరగాల్సిన పని కాదు. గత ఐదేళ్లుగా సుకుమార్ ‘పుష్ప’ ప్రపంచంలో పూర్తిగా లీనమై ఉన్నారు. ఆయన సృజనాత్మక శక్తి ‘పుష్ప’ కథనంతో పూర్తిగా నిండిపోయింది. అలాంటి కఠినమైన ప్రయాణం తర్వాత, ఈ ప్రతిభావంతుడైన దర్శకుడికి ‘పుష్ప’ ప్రపంచం నుండి పూర్తిగా బయటపడి కోలుకోవడానికి చాలా సమయం అవసరం. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో లీనమవ్వడమే ఆయన వంటి అభిరుచి గల దర్శకుడికి నిజమైన ఔషధం.

ఇది ఒక సహజమైన మార్పు ప్రక్రియ, ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ, సుకుమార్ ‘పుష్ప’ హ్యాంగోవర్ నుండి పూర్తిగా బయటపడి, తన తదుపరి చిత్రంతో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలంటే ఈ విరామం తప్పనిసరి. ఇదే కారణంతో రాజమౌళి కూడా తన మునుపటి సినిమా ప్రపంచం నుండి బయటపడటానికి, కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఏడాదికి పైగా సమయం తీసుకుంటారు కాబట్టి, కొందరు సుకుమార్ ‘పుష్ప’ తర్వాత విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని భావించవచ్చు, కానీ నిజానికి, ఈ అభిరుచి గల దర్శకుడికి ఇది అత్యవసరమైన విరామం.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు కృషి చేయాలి

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆదేశాలతో ఏఎస్ఐ రాజేశం మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేశం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి విద్యార్థులు మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు సర్వ నాశనం అయితాయని వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆధారం విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో నివేది ఏ స్థితిలోనైనా డ్రగ్స్ కు పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదు , ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన లేదా మాదకద్రవ్యాల గురించి సమాచారం తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అదేవిధంగా విద్యార్థులతో సే నోటు డ్రగ్స్ pledge చేయించారు , మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో am an యాంటీ డ్రగ్ సోల్జర్ selfi point ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వివరించి విద్యార్థులు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ విజయ్ వినోద్ పాల్గొన్నారు

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌

**ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:


మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలని వాటి వలన కలిగే అనార్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వెంకన్న, భాగ్యశ్రీ, రవీందర్, పద్మ, కొమురల్లి, ఎం ఆర్ సి. సిబ్బంది వేణు, శ్రీనివాస్, శివకుమార్, చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version