మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘పుష్ప’ మత్తు వదిలించుకుంటున్న సుకుమార్

 

‘పుష్ప’ మత్తు వదిలించుకుంటున్న సుకుమార్

తన తాజా చిత్రం ‘పుష్ప’ వరల్డ్ దర్శకుడు సుకుమార్ సరికొత్త లీగ్లోకి అడుగుపెట్టారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం నిర్మాణానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టినా, ‘పుష్ప 2’ భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలవడంతో ఆ కష్టం ఫలించింది. ‘పుష్ప’ రెండో భాగం పూర్తయిన తర్వాత సుకుమార్ పనికి పూర్తిగా విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి విహరిస్తూ, తనకంటూ కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు.

కొందరు సుకుమార్ ‘పుష్ప’ విజయాన్ని ఉపయోగించుకొని మరో పెద్ద స్టార్తో తదుపరి ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని భావించవచ్చు. కానీ, ఇది తప్పనిసరిగా జరగాల్సిన పని కాదు. గత ఐదేళ్లుగా సుకుమార్ ‘పుష్ప’ ప్రపంచంలో పూర్తిగా లీనమై ఉన్నారు. ఆయన సృజనాత్మక శక్తి ‘పుష్ప’ కథనంతో పూర్తిగా నిండిపోయింది. అలాంటి కఠినమైన ప్రయాణం తర్వాత, ఈ ప్రతిభావంతుడైన దర్శకుడికి ‘పుష్ప’ ప్రపంచం నుండి పూర్తిగా బయటపడి కోలుకోవడానికి చాలా సమయం అవసరం. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో లీనమవ్వడమే ఆయన వంటి అభిరుచి గల దర్శకుడికి నిజమైన ఔషధం.

ఇది ఒక సహజమైన మార్పు ప్రక్రియ, ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ, సుకుమార్ ‘పుష్ప’ హ్యాంగోవర్ నుండి పూర్తిగా బయటపడి, తన తదుపరి చిత్రంతో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలంటే ఈ విరామం తప్పనిసరి. ఇదే కారణంతో రాజమౌళి కూడా తన మునుపటి సినిమా ప్రపంచం నుండి బయటపడటానికి, కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఏడాదికి పైగా సమయం తీసుకుంటారు కాబట్టి, కొందరు సుకుమార్ ‘పుష్ప’ తర్వాత విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని భావించవచ్చు, కానీ నిజానికి, ఈ అభిరుచి గల దర్శకుడికి ఇది అత్యవసరమైన విరామం.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు కృషి చేయాలి

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆదేశాలతో ఏఎస్ఐ రాజేశం మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేశం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి విద్యార్థులు మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు సర్వ నాశనం అయితాయని వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆధారం విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో నివేది ఏ స్థితిలోనైనా డ్రగ్స్ కు పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదు , ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన లేదా మాదకద్రవ్యాల గురించి సమాచారం తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అదేవిధంగా విద్యార్థులతో సే నోటు డ్రగ్స్ pledge చేయించారు , మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో am an యాంటీ డ్రగ్ సోల్జర్ selfi point ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వివరించి విద్యార్థులు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ విజయ్ వినోద్ పాల్గొన్నారు

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌

**ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:


మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలని వాటి వలన కలిగే అనార్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వెంకన్న, భాగ్యశ్రీ, రవీందర్, పద్మ, కొమురల్లి, ఎం ఆర్ సి. సిబ్బంది వేణు, శ్రీనివాస్, శివకుమార్, చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version