గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో యువజన సంఘాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచి గాధగోని సాగర్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం నిర్వహిస్తూ. ప్రతి గ్రామంలో గ్రామాలు అభివృద్ధి జరగాలంటే గ్రామ యువత సహకరించాలని యువత చదువుతోపాటు గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి జరగాలంటే యువజన సంఘాల పాత్ర కీలకమని. ప్రతి గ్రామంలో అభివృద్ధి . యువజన పథంగా. యువజన సంఘాలు ఏర్పరచుకొని అందులో యువత పాలుపంచుకుంటూ చదువుతోపాటు గ్రామాన్ని అభివృద్ధితో పాటు అన్ని విషయాలు ప్రజలకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతూ. అభివృద్ధి పథంలో ముందు ఉంచే బాధ్యత యువజన సంఘాలపై ఎక్కువగా ఉంటుందని. దీనిపై ప్రతి గ్రామంలో యువత యువకులు గ్రామ ప్రజలు అందరూ సహకరించి అభివృద్ధి పథంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్…

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ముప్పనపల్లి దర్గా ఉరుసు రోడ్డు మరమ్మతులు

ముప్పనపల్లి దర్గా ఉరుసు ఉత్సవాలకు రోడ్డు మరమ్మతులు
ఏటూరునాగారం, నేటిధాత్రి

కన్నాయిగూడెం మండలం, మొప్పనపల్లి గ్రామంలో నిర్వహించనున్న పవిత్ర దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం ముప్పనపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు చిదరి సుమన్ గారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఉరుసు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, వారి సౌకర్యార్థం ఈ రోడ్డు మరమ్మతులు ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయి.
గ్రామాభివృద్ధి, ప్రజా సౌకర్యాల పట్ల నిరంతర శ్రద్ధ చూపుతున్న ఉప సర్పంచ్ చిదరి సుమన్ గారి సేవలను గ్రామస్తులు, దర్గా కమిటీ సభ్యులు అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ ఉరుసు ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడాలని గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ దారితప్పుతోందన్న గీసుకొండ సర్పంచ్ ఆందోళన

గంజాయి, డ్రగ్స్ అలవాటుతో దారితప్పుతున్న యువత

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి:*

కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి స్వార్థం కోసం విస్తరింపజేస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు అలవాట్ల కారణంగా 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వారి భవిష్యత్ దారితప్పి తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చితున్నారని ఈ పరిస్థితిపై గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పౌర హక్కులు–సామాజిక సమానత్వం–యువత భవిష్యత్తే లక్ష్యంగా..గీసుకొండ మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ సబ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
గీసుకొండ డిప్యూటీ తహసిల్దార్ వీందర్ రావు,టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు,
వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కోట ప్రమోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ బోధించు,సమీకరించు, పోరాడు అనే మహానినాదంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు అని కొనియాడారు. గ్రామంలో విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు ప్రభావం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సమస్యపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించే ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్ మాట్లాడుతూ
ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సమాన అవకాశాలు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ రుణపడి ఉండాలని తెలిపారు. చదువు ద్వారా ప్రశ్నించే తత్వం పెరుగుతుందని, నేటి సమాజంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు వంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ద్వారానే ఎదిగారని స్పష్టం చేశారు.

దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ,
పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని దళితులపై జరుగుతున్న దాడుల వల్ల నష్టపోయేది సమాజమేనని పేర్కొన్నారు.కుల భేదాలను మర్చిపోయి మేము–మీరు అనే భావనను విడిచిపెట్టి అందరం ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించి గీసుకొండ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. రాజేంద్రప్రసాద్, హెచ్డబ్ల్యూఓ హరిత, గ్రామం వార్డు మెంబర్లు పసుల యుగేందర్, దౌడు చిన్న జ్యోతి, దౌడు ఎలీషా, దౌడు సారిక, మాజీ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ వార్డ్ మెంబర్ దౌడు రాజేష్ గ్రామ కరోబార్ అలీ
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం సందర్శన.

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు.అక్కడి పిల్లల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి తమ పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచుల కీలక పాత్ర: కలెక్టరు సందేశం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

◆-: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

జహీరాబాద్ నేటి ధాత్రి: 

గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశముఖి మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలకు మంచి జరగాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం–2018పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆరు బ్యాచులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల పనుల నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి పి ఓ జానకి రెడ్డి , డీఎల్పీఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఝరాసంగం మండలం నుండి బొరేగౌ సర్పంచ్ నాగేందర్ పాటిల్, జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి, బర్థిపూర్ సర్పంచ్ రాజు, బిడకన్నే సర్పంచ్ రవి, పలు గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు..

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

◆-: ఎమ్మెల్యే మాజీ డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

తాలూకా ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముదిరాజ్ సంఘం కు హామీలు ఇవ్వడం జరిగిందని అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా

ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు తాను సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది . అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజ్ నాయకులకు టికెట్లు ఇచ్చి ఆదుకుంటానని వారిని గెలిపించే బాధ్యత పూర్తిగా ముదిరాజ్ నాయకులు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం నాయకులకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు గొల్ల భాస్కర్ పాల్గొని బిజెపి పార్టీ తరపున సరైన అభ్యర్థులు ఉంటే టికెట్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది శివకుమార్ మాట్లాడుతూ అన్ని విధాలుగా ముదిరాజ్ సంఘం ను ఆదుకుంటామని తెలపడం జరిగింది మాజీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం మాట్లాడుతూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు అని అభినందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బేవా రిజిస్ చైర్మన్ దేవి ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ తంజం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ అదేవిధంగా ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శంకర్ ముదిరాజు ముదిరాజ్ సంఘం గౌరవాధ్యక్షులు నారాయణ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి సంగప్ప ముదిరాజ్ జిల్లా కార్యదర్శి గోపాల్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాయకుని రమేష్ ముదిరాజ్ జనరల్ సెక్రెటరీ మహేష్ ముదిరాజ్ కోయిరు మండల జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ ముదిరాజ్ శాంతినగర్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్ కార్యదర్శి హరీష్ ముదిరాజ్ టౌన్ సెక్రటరీ విజయ్ ముదిరాజ్ శివ ముదిరాజ్ పాండు ముదిరాజ్ మాజీ మండల అధ్యక్షులు విట్టల్ ముదిరాజ్ రంజోల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జమాల్ దత్తు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది,

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని దొడ్డేంద్రయ్య గురుస్వామి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షులు చంద్రప్ప, జెంట్ సెక్రటరీ రాజేశ్వర్ ఛారీ, స్థానిక విశ్వకర్మ నేతలు, మాజీ సర్పంచ్ సవిత రంగారెడ్డి, రఘునాథ్ చారి పాల్గొన్నారు. దొడ్డేంద్రయ్య గురుస్వామి మాట్లాడుతూ, టాటా, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారాల పేర్లతో పాటు విశ్వకర్మ పేర్లు కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

లింగాయత్ సమాజ్ మహిళా కార్యదర్శిగా పద్మజ ప్రమాణం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T122111.442.wav?_=1

 

లింగాయత్ సమాజ్ మహిళా కార్యదర్శిగా పద్మజ ప్రమాణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉల్లిగడ్ల పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు. లింగయత్ సమాజ అభివృద్ధి కోసం మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తానని, మహిళల సమస్యలు, హక్కుల సాధనకు ప్రాధాన్యత ఇస్తానని, సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం లింగాయత్ సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

కాప్రా ప్రజా సమస్యల పరిష్కారానికి శివకుమార్ ముందడుగు

కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు!

ప్రజల కోసం – ప్రజలతో కలిసి!

– గోగికార శివకుమార్

కాప్రా నేటిధాత్రి

 

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ పరిధిలో
సాయి నగర్ స్మశాన వాటిక ముందు నెలకొన్న మట్టి కుప్పలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే సాయి నగర్ – సాయిబాబా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న స్ట్రీట్ లైట్ సమస్యలు కారణంగా ప్రతిరోజూ ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు.
ఈ రెండు ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనే కోరుతూ, నేను స్వయంగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్ కి వినతిపత్రం సమర్పించాను.
ప్రజల సమస్యలంటే నా బాధ్యత. కాప్రా డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి చిన్న సమస్యనైనా పట్టించుకుని పరిష్కారం దిశగా ముందుకు సాగుతాను.

తంగళ్ళపల్లిలో బిజెపి ఘాటు విమర్శలు

తంగళ్ళపల్లి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూపార్టీ నాయకులు మండలంలోని ప్రతి గ్రామం నుండి హాజరైనారు ఇట్టి సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోయిందని .చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ఒక ఎమ్మెల్యే కు ఫండ్స్ రాలేని పరిస్థితి గ్రామాల ప్రజలు గమనించాలని గ్రామాల అభివృద్ధి పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే నిధుల పైన ఆధారపడి ఉందని బండి సంజయ్ ని .ప్రతినిధులు గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి ఖాయమని తెలిపారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించే విధంగా బుజస్కందాలపైవేసుకొని గ్రామ గ్రామాన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తూ. రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకుమోక్షం లభించనుందని పేర్కొంటూ ఖజానాలో పైసలు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా సాధిస్తుందో ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలను రైతులను పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారని విమర్శిస్తూ సిరిసిల్ల ప్రజలు గెలిపించిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారని .వ్యాఖ్యలు చేస్తూ. తంగళ్ళపల్లి మండలంలో 15 బోర్లుఎంపీ నిధులద్వారా ఏర్పాటు చేశారని కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారు 30 లక్షల నిధులు మంజూరు చేశారని సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా అంబులెన్స్ ను కొనుగోలు చేసి ఆసుపత్రులకు అందజేశారు సుమారు 20వేల. సైకిలను విద్యార్థులకు అందించారు 10వ తరగతి విద్యార్థుల పరీక్షల రుసుములను చెల్లించేందుకు ముందుకు వచ్చారు ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. పైసలు లేవని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా చేస్తుందో స్థానిక ఎమ్మెల్యే పల్లెల అభివృద్ధి ఎలా సాధిస్తారో ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని గోపి సూచించారు గ్రామాల అభివృద్ధి కోసం బండి సంజయ్ ప్రతిపాదించిన పార్టీ అభ్యర్థులను పదవులను గెలిపించాలని ప్రజలకు పిలిపించారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీధర్ రావు. బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇన్చార్జి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తుమ్మల శ్రీకాంత్. జిల్లా కోశాధికారి ఆసాని .రామలింగారెడ్డి. మీడియా కన్వీనర్ కాశి గంటి రాజు. సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్. జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శులు ఇటుకల రాజు. కోసి వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు. ఆశిర్వాద్. బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

వర్ధన్నపేటలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T153002.907.wav?_=2

 

వర్ధన్నపేటలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలను వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రం ఫిరంగిగడ్డలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల పతాక ఆవిష్కరణను వర్ధన్నపేట మత్స్య శాఖ అధ్యక్షుడు భూమా సుధాకర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీప్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య ముఖ్య అతిథిలుగా హాజరై, మాట్లాడుతూ… తెలంగాణ ముదిరాజ్ మహాసభను డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ వ్యవస్తాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. దీని ద్వారా మత్యకారుల ఎన్నో సమస్యలను, హక్కులను సాధించుకోవడం జరిగిందని అన్నారు. మనం ఐక్యతతో మనజాతి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ….

ఫిరంగిగడ్డ నుండి మస్త్యకారులు బైక్ ర్యాలీతో వెళ్ళి, ఇటీవల కాలంలో వచ్చిన మౌంతా తుఫాన్ వల్ల ఏర్పడిన అకాల వర్షాల అన్ని గ్రామాల్లోనీ చెరువులలో మత్స్యకారులు పోసిన చేప పిల్లలు వరదలో కొట్టుకుపోయాయి. మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారనీ అన్నారు. అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, మత్స్యకారులకు న్యాయం చేయాలని వర్ధన్నపేట ఎమ్మార్వో విజయసాగర్ కు వినతి అందించారు. అలాగే ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేపపిల్లలను సకాలంలో అందించాలని, చేపపిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు సంగినేని బీమ్ రాజ్, మండల ఉపాధ్యక్షుడు నారెల్లి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి పొన్నం స్వామి, మండల యూత్ అధ్యక్షుడు కుక్కల రాకేష్, ప్రధాన కార్యదర్శి ముద్రబోయిన రాజు, కార్యదర్శి బోనాల హరీష్, మైస సురేష్, గబ్బట సహదేవ్, వివిధ గ్రామాల మత్స్యశాఖ అధ్యక్షులు సుంకరి స్వామి, భూమా సుధాకర్, బచ్చల వీరస్వామి, భాషబోయిన సంపత్, కత్తి యాకయ్య, కులపెద్దలు భూమా శ్రీను, ఎద్దు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సుభాష్, పిట్టల కుమారస్వామి, సంఘ సభ్యులు బచ్చల స్వామి, నిమ్మనబోయిన సదానందం, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం:..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T142903.074.wav?_=3

 

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం: దేశాయిపేట ముదిరాజ్ సంఘంలో జెండా ఆవిష్కరణ

మత్స్య కార్మికుల దినోత్సవ వేడుకల్లో ముదిరాజ్ సంఘం ఐక్యతకు పిలుపు

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

 

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ముదిరాజ్ సంఘం దేశాయిపేట భవనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజ అభివృద్ధికి అందరూ ఏకమవ్వాలని, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, ముదిరాజ్ యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు విప్ప సుధాకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సంగినేని రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజర్ విప్ప సుధాకర్, సారయ్య, రాజన్ బాబు, బయ్య రాజు, ముత్యాల బాబు, సృజన్, అనిల్, లక్కరాజు, రాకేష్, సతీష్, బిక్షపతి, రవి, కిషన్, వెంకటేష్, కుమారస్వామి, సుధాకర్, విప్ప రాజు, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం…

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం

పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ సోమవారం జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డికి వినతిపత్రం అందించారు.పౌనూర్ గ్రామంలో 500 పైగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన వాళ్లు నివసిస్తున్నారు వారికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందికు గురవుతున్నట్టు పేర్కొన్నారు.ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడం వల్ల దళిత వర్గాల యువత,మహిళలు,సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు తగిన సదుపాయాలు లభిస్తాయని ఇలాంటి కమిటీ హాల్ దళితుల అభివృద్ధికి సామాజికంగా ముందుకు వెళ్లడానికి సహాయపడతాయని అన్నారు.తహసిల్దార్ వనజా రెడ్డి వెంటనే స్పందించి స్థలం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T113422.114.wav?_=4

 

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ” కార్యక్రమం…నవంబర్ 11th మంగళవారము నాడు “జాతీయ అక్షరాస్యత ధినోత్సవ” కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఝరాసంగం మండల కొల్లూరు గ్రామంలో ఎంపిపిఎస్ నంధు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హనుమంత్ రావు పాటిల్ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ మరియూ ఎంఈఓ శ్రీనివాస్ సార్ ముఖ్య అతిధులుగా విచ్చేయుచున్నారు కావున ఇట్టి కార్యక్రమానికీ గ్రామ పెద్దలు,నాయకులు,ఉపాధ్యాయులు,విద్యావంతులు, ఉద్యోగులు మరియు యువకులు,సంఘ సంస్కర్తలు,పత్రికా మిత్రులు, విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.a

కోహిర్ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకుడి వినతిపత్రం..

కోహిర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం

ముహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక మెమోరాండం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన చాలా ప్రజా సమస్యలను పరిష్కరించాలని

◆:- బిఆర్ఎస్ యువ నాయకుడు ముహమ్మద్ ఫిర్దౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ టౌన్ కు చెందిన సామాజిక కార్యకర్త మరియు బిఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఫిర్దౌస్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కోహెర్ టౌన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు కలిసి కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన చాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక లిఖిత పూర్వక మెమోరాండం ను అందజేశారు, దీనికి కోహిర్ టౌన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశానని మరియు కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా పాల్గొన్నారు.

వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

కోహీర్ మున్సిపల్ పట్టణంలోని పలు కాల నీల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోహీర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయ కుడు ఫిర్దౌస్ పాటు కోహీర్కు చెందిన పలువురు యువకులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.

రేకంపల్లిలో ఈజీఎస్ పనులపట్ల గ్రామసభ

రేకంపల్లిలో ఈజీఎస్ పనులపట్ల గ్రామసభ

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామ పంచాయతీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనుల ప్రణాళిక ప్రక్రియల కోసం పంచాయతీ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు.గ్రామంలో గుర్తించిన పనులను చదివి వినిపించారు.ఏపీఓ దయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో నీటి నిలువను పెంచడానికి ఫారంపౌండ్స్, చిన్న నీటి కుంటల నిర్మాణం చేయుటకు అవకాశం ఉందన్నారు.రైతుల భూములలో లేక కమ్యూనిటీ ల్యాండ్లలో నిర్మించుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా వ్యక్తిగత పనుల కింద పండ్ల తోటల పెంపకం, పశువుల పాకల నిర్మాణం, కోళ్ల పాకల నిర్మాణం మొదలగు పనులు చేయుటకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో టెక్నికల్ అసిస్టెంట్ ఇల్లందుల సమ్మయ్య,ఫీల్డ్ అసిస్టెంట్లు స్వర్ణ,రాణి గ్రామస్తులు పాల్గొన్నారు.

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T134337.657.wav?_=5

 

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం
బస్వరాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది అందులో యూత్ అధ్యక్షుడు ఎన్నికైన మిట్టపెల్లి అరవింద్,ఉప అధ్యక్షుడి కుక్కముడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నడం జరిగింది. అరవిందు మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవిని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూత్ ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని అరవింద్ అన్నారు

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T133811.880.wav?_=6

 

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన

◆:- మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజలందరిలోనూ దసరా సంతోషాన్ని నింపాలని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా చేసుకునే దసరా పండగలో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగు నింపాలని కోరారు. శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీక దసరా అని, చెడు ఎంత దుర్మార్గమైనా, శక్తిమంతమైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులు, సిరి సంపదలతో తలతూగాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version