వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని దొడ్డేంద్రయ్య గురుస్వామి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షులు చంద్రప్ప, జెంట్ సెక్రటరీ రాజేశ్వర్ ఛారీ, స్థానిక విశ్వకర్మ నేతలు, మాజీ సర్పంచ్ సవిత రంగారెడ్డి, రఘునాథ్ చారి పాల్గొన్నారు. దొడ్డేంద్రయ్య గురుస్వామి మాట్లాడుతూ, టాటా, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారాల పేర్లతో పాటు విశ్వకర్మ పేర్లు కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

లింగాయత్ సమాజ్ మహిళా కార్యదర్శిగా పద్మజ ప్రమాణం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T122111.442.wav?_=1

 

లింగాయత్ సమాజ్ మహిళా కార్యదర్శిగా పద్మజ ప్రమాణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉల్లిగడ్ల పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు. లింగయత్ సమాజ అభివృద్ధి కోసం మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తానని, మహిళల సమస్యలు, హక్కుల సాధనకు ప్రాధాన్యత ఇస్తానని, సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం లింగాయత్ సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

కాప్రా ప్రజా సమస్యల పరిష్కారానికి శివకుమార్ ముందడుగు

కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు!

ప్రజల కోసం – ప్రజలతో కలిసి!

– గోగికార శివకుమార్

కాప్రా నేటిధాత్రి

 

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ పరిధిలో
సాయి నగర్ స్మశాన వాటిక ముందు నెలకొన్న మట్టి కుప్పలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే సాయి నగర్ – సాయిబాబా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న స్ట్రీట్ లైట్ సమస్యలు కారణంగా ప్రతిరోజూ ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు.
ఈ రెండు ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనే కోరుతూ, నేను స్వయంగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్ కి వినతిపత్రం సమర్పించాను.
ప్రజల సమస్యలంటే నా బాధ్యత. కాప్రా డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి చిన్న సమస్యనైనా పట్టించుకుని పరిష్కారం దిశగా ముందుకు సాగుతాను.

తంగళ్ళపల్లిలో బిజెపి ఘాటు విమర్శలు

తంగళ్ళపల్లి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూపార్టీ నాయకులు మండలంలోని ప్రతి గ్రామం నుండి హాజరైనారు ఇట్టి సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోయిందని .చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ఒక ఎమ్మెల్యే కు ఫండ్స్ రాలేని పరిస్థితి గ్రామాల ప్రజలు గమనించాలని గ్రామాల అభివృద్ధి పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే నిధుల పైన ఆధారపడి ఉందని బండి సంజయ్ ని .ప్రతినిధులు గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి ఖాయమని తెలిపారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించే విధంగా బుజస్కందాలపైవేసుకొని గ్రామ గ్రామాన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తూ. రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకుమోక్షం లభించనుందని పేర్కొంటూ ఖజానాలో పైసలు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా సాధిస్తుందో ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలను రైతులను పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారని విమర్శిస్తూ సిరిసిల్ల ప్రజలు గెలిపించిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారని .వ్యాఖ్యలు చేస్తూ. తంగళ్ళపల్లి మండలంలో 15 బోర్లుఎంపీ నిధులద్వారా ఏర్పాటు చేశారని కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారు 30 లక్షల నిధులు మంజూరు చేశారని సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా అంబులెన్స్ ను కొనుగోలు చేసి ఆసుపత్రులకు అందజేశారు సుమారు 20వేల. సైకిలను విద్యార్థులకు అందించారు 10వ తరగతి విద్యార్థుల పరీక్షల రుసుములను చెల్లించేందుకు ముందుకు వచ్చారు ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. పైసలు లేవని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా చేస్తుందో స్థానిక ఎమ్మెల్యే పల్లెల అభివృద్ధి ఎలా సాధిస్తారో ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని గోపి సూచించారు గ్రామాల అభివృద్ధి కోసం బండి సంజయ్ ప్రతిపాదించిన పార్టీ అభ్యర్థులను పదవులను గెలిపించాలని ప్రజలకు పిలిపించారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీధర్ రావు. బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇన్చార్జి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తుమ్మల శ్రీకాంత్. జిల్లా కోశాధికారి ఆసాని .రామలింగారెడ్డి. మీడియా కన్వీనర్ కాశి గంటి రాజు. సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్. జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శులు ఇటుకల రాజు. కోసి వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు. ఆశిర్వాద్. బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

వర్ధన్నపేటలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T153002.907.wav?_=2

 

వర్ధన్నపేటలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలను వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రం ఫిరంగిగడ్డలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల పతాక ఆవిష్కరణను వర్ధన్నపేట మత్స్య శాఖ అధ్యక్షుడు భూమా సుధాకర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీప్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య ముఖ్య అతిథిలుగా హాజరై, మాట్లాడుతూ… తెలంగాణ ముదిరాజ్ మహాసభను డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ వ్యవస్తాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. దీని ద్వారా మత్యకారుల ఎన్నో సమస్యలను, హక్కులను సాధించుకోవడం జరిగిందని అన్నారు. మనం ఐక్యతతో మనజాతి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ….

ఫిరంగిగడ్డ నుండి మస్త్యకారులు బైక్ ర్యాలీతో వెళ్ళి, ఇటీవల కాలంలో వచ్చిన మౌంతా తుఫాన్ వల్ల ఏర్పడిన అకాల వర్షాల అన్ని గ్రామాల్లోనీ చెరువులలో మత్స్యకారులు పోసిన చేప పిల్లలు వరదలో కొట్టుకుపోయాయి. మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారనీ అన్నారు. అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, మత్స్యకారులకు న్యాయం చేయాలని వర్ధన్నపేట ఎమ్మార్వో విజయసాగర్ కు వినతి అందించారు. అలాగే ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేపపిల్లలను సకాలంలో అందించాలని, చేపపిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు సంగినేని బీమ్ రాజ్, మండల ఉపాధ్యక్షుడు నారెల్లి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి పొన్నం స్వామి, మండల యూత్ అధ్యక్షుడు కుక్కల రాకేష్, ప్రధాన కార్యదర్శి ముద్రబోయిన రాజు, కార్యదర్శి బోనాల హరీష్, మైస సురేష్, గబ్బట సహదేవ్, వివిధ గ్రామాల మత్స్యశాఖ అధ్యక్షులు సుంకరి స్వామి, భూమా సుధాకర్, బచ్చల వీరస్వామి, భాషబోయిన సంపత్, కత్తి యాకయ్య, కులపెద్దలు భూమా శ్రీను, ఎద్దు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సుభాష్, పిట్టల కుమారస్వామి, సంఘ సభ్యులు బచ్చల స్వామి, నిమ్మనబోయిన సదానందం, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం:..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T142903.074.wav?_=3

 

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం: దేశాయిపేట ముదిరాజ్ సంఘంలో జెండా ఆవిష్కరణ

మత్స్య కార్మికుల దినోత్సవ వేడుకల్లో ముదిరాజ్ సంఘం ఐక్యతకు పిలుపు

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

 

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ముదిరాజ్ సంఘం దేశాయిపేట భవనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజ అభివృద్ధికి అందరూ ఏకమవ్వాలని, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, ముదిరాజ్ యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు విప్ప సుధాకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సంగినేని రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజర్ విప్ప సుధాకర్, సారయ్య, రాజన్ బాబు, బయ్య రాజు, ముత్యాల బాబు, సృజన్, అనిల్, లక్కరాజు, రాకేష్, సతీష్, బిక్షపతి, రవి, కిషన్, వెంకటేష్, కుమారస్వామి, సుధాకర్, విప్ప రాజు, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం…

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం

పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ సోమవారం జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డికి వినతిపత్రం అందించారు.పౌనూర్ గ్రామంలో 500 పైగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన వాళ్లు నివసిస్తున్నారు వారికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందికు గురవుతున్నట్టు పేర్కొన్నారు.ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడం వల్ల దళిత వర్గాల యువత,మహిళలు,సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు తగిన సదుపాయాలు లభిస్తాయని ఇలాంటి కమిటీ హాల్ దళితుల అభివృద్ధికి సామాజికంగా ముందుకు వెళ్లడానికి సహాయపడతాయని అన్నారు.తహసిల్దార్ వనజా రెడ్డి వెంటనే స్పందించి స్థలం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T113422.114.wav?_=4

 

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ” కార్యక్రమం…నవంబర్ 11th మంగళవారము నాడు “జాతీయ అక్షరాస్యత ధినోత్సవ” కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఝరాసంగం మండల కొల్లూరు గ్రామంలో ఎంపిపిఎస్ నంధు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హనుమంత్ రావు పాటిల్ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ మరియూ ఎంఈఓ శ్రీనివాస్ సార్ ముఖ్య అతిధులుగా విచ్చేయుచున్నారు కావున ఇట్టి కార్యక్రమానికీ గ్రామ పెద్దలు,నాయకులు,ఉపాధ్యాయులు,విద్యావంతులు, ఉద్యోగులు మరియు యువకులు,సంఘ సంస్కర్తలు,పత్రికా మిత్రులు, విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.a

కోహిర్ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకుడి వినతిపత్రం..

కోహిర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం

ముహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక మెమోరాండం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన చాలా ప్రజా సమస్యలను పరిష్కరించాలని

◆:- బిఆర్ఎస్ యువ నాయకుడు ముహమ్మద్ ఫిర్దౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ టౌన్ కు చెందిన సామాజిక కార్యకర్త మరియు బిఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఫిర్దౌస్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కోహెర్ టౌన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు కలిసి కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన చాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక లిఖిత పూర్వక మెమోరాండం ను అందజేశారు, దీనికి కోహిర్ టౌన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశానని మరియు కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా పాల్గొన్నారు.

వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

కోహీర్ మున్సిపల్ పట్టణంలోని పలు కాల నీల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోహీర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయ కుడు ఫిర్దౌస్ పాటు కోహీర్కు చెందిన పలువురు యువకులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.

రేకంపల్లిలో ఈజీఎస్ పనులపట్ల గ్రామసభ

రేకంపల్లిలో ఈజీఎస్ పనులపట్ల గ్రామసభ

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామ పంచాయతీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనుల ప్రణాళిక ప్రక్రియల కోసం పంచాయతీ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు.గ్రామంలో గుర్తించిన పనులను చదివి వినిపించారు.ఏపీఓ దయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో నీటి నిలువను పెంచడానికి ఫారంపౌండ్స్, చిన్న నీటి కుంటల నిర్మాణం చేయుటకు అవకాశం ఉందన్నారు.రైతుల భూములలో లేక కమ్యూనిటీ ల్యాండ్లలో నిర్మించుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా వ్యక్తిగత పనుల కింద పండ్ల తోటల పెంపకం, పశువుల పాకల నిర్మాణం, కోళ్ల పాకల నిర్మాణం మొదలగు పనులు చేయుటకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో టెక్నికల్ అసిస్టెంట్ ఇల్లందుల సమ్మయ్య,ఫీల్డ్ అసిస్టెంట్లు స్వర్ణ,రాణి గ్రామస్తులు పాల్గొన్నారు.

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T134337.657.wav?_=5

 

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం
బస్వరాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది అందులో యూత్ అధ్యక్షుడు ఎన్నికైన మిట్టపెల్లి అరవింద్,ఉప అధ్యక్షుడి కుక్కముడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నడం జరిగింది. అరవిందు మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవిని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూత్ ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని అరవింద్ అన్నారు

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T133811.880.wav?_=6

 

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన

◆:- మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజలందరిలోనూ దసరా సంతోషాన్ని నింపాలని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా చేసుకునే దసరా పండగలో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగు నింపాలని కోరారు. శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీక దసరా అని, చెడు ఎంత దుర్మార్గమైనా, శక్తిమంతమైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులు, సిరి సంపదలతో తలతూగాలని ఆయన కోరారు.

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు…

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ గౌడ సంఘం నూతన కమిటీని నర్సంపేట గౌడ జర్నలిస్టులు సన్మానించారు.గౌడ పట్టణ కమిటీని ఇటీవల ఎన్నుకోగా పట్టణ గౌడ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ ,ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు,సంఘం అభివృద్ధి కోసం ప్రతీ ఒక్క గౌడబిడ్డ పాటుపడాలని కోరారు.నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 7 వరకు కంఠమహేశ్వర స్వామి సూరమాంబదేవి,రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు.

గౌడ జర్నలిస్టులకు సన్మానం..

నర్సంపేట పట్టణ జర్నలిస్టులను నూతనంగా ఎన్నికైన నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,డైరెక్టర్లు తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగాని సురేష్ గౌడ్,వేముల కృష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగెళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్,సంఘ సభ్యులు తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్,కోల చరణ్ గౌడ్,జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్,బుర్ర వేణు గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తడుక రమేష్ గౌడ్,వద్లకొండ పవిత్రన్ గౌడ్,వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,గోపగాని శోభన్ గౌడ్,బండారి సుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T124645.920-1.wav?_=7

 

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం

◆:- మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళాలు ఇస్తున్న మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ ఎంపిటిసిలు శివానంద శ్రీపతి జగన్నాథ్ మహాత్మా బోమగొండేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బండప్ప సభ్యులు మారుతీ మానిక్ మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు శ్రీకాంత్ మహేష్ పవన్ నగేష్ సునీల్ సాయి తదితరులు పాల్గొన్నారు,

గ్రామపంచాయతీ భవనమును ప్రారంభం….

గ్రామపంచాయతీ భవనమును ప్రారంభం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

పల్లెలు మురిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర 2025 కార్యక్రమాన్ని చేపట్టినట్లు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు
టేకుమట్ల మండలం మందవారిపల్లిలో 20 లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో
నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా చేపట్ట బోయే కొత్త పనులను ఏకకాలంలో ప్రారంభించటానికి పనుల జాతర-2025 కార్యక్రమానికి
శుక్రవారం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కొత్త పనులకు భూమిపూజతో చేపట్టిన అన్ని పనులు రానున్న సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అవసరమైన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్ లు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శంకుస్ధాపనలు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరా మహిళాశక్తి ఉపాధి భరోసా కింద చేపట్టే జీవనోపాధి కార్యక్రమాలు, మహిళా సంఘాలకు కోళ్లు, పశువుల, గొర్రెల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణంతో పాటు పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వంటి పనుల మంజూరు పత్రాలు అందచేశారు. ఫల వనం.. వనమహోత్సం కింద ఈత, తాటి, పండ్లతోటల పెంపకం చేపట్టే లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభించేందుకు.. వాటిని పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు బాటలు పడనున్నాయని, ఉపాధి హామీ కూలీలు, స్వయం ఉపాధి పొందేవారికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరమైనదని ఎమ్మెల్యే అన్నారు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 1075 పనులను పనుల జాతర కార్యక్రమం ద్వారా చేపట్టినట్లు తెలిపారు. .ఇందుకోసం 3.93 కోట్లు అంచనా తయారు చేసినట్లు తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ లో 375 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ
ఉపాధి పనిదినాలు చేసిన దివ్యాంగుల కుటుంబాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందిని, భూగర్భజలాలు, చెట్ల పెంపకంలో భాగస్వాములయిన వారిని సన్మానించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ పనులు, పల్లె ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఎంపిడీవోలు అనిత, జయశ్రీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-4.wav?_=8

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి;

ఓదెల మండలం లోని మడక గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా రంగు కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా గట్టు మహేష్ గౌడ్, సభ్యులు నల్లగోని నరేందర్ గట్టు వీరస్వామి సిరిసేటి కిరణ్ దేశిని రమేష్ మేడగొని చిరంజీవి మొగిలి గాజర్ల శ్రీనివాస్ గట్టు సురేష్ లను గౌడ కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాల్ మండలంలో 100% అక్షరాస్యత కోసం ఉల్లాస్ శిక్షణ….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-6.wav?_=9

అక్షరాస్యత 100శాతం సాధించాలి

అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.అనంతరం మాట్లాడుతూ మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్షరాస్యత 18శాతం ఉండగా ప్రస్తుతం 76శాతానికి చేరుకున్నామని తెలంగాణ రాష్ట్రంలో 66 శాతం అక్షరాస్యత ఉందని ఇంకా 34శాతం నిరక్షరాస్యులు మిగిలిపోయారని ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా వంద శాతం అక్షరాస్యతకు చేరుకోవాలని అన్నారు.శిక్షణ పొందిన విఓఏలు ఆర్పీలు ప్రణాళిక సిద్ధం చేసుకుని గ్రామంలో వంద శాతం అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని సూచించారు.ఈ శిక్షణకు రిసోర్స్ పర్సన్ గా బిక్షపతి మరియు బాబు వ్యవహరించారు.ఈ శిక్షణకు వివిధ గ్రామాల నుంచి ఉపాధ్యాయులు,సీఆర్పీలు రమేష్,శ్రీలత,రఘుబాబు, మహేందర్ మరియు మెప్మా ఆర్పీలు,బాలుర ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయులు మహ్మద్ గౌస్ ఏపీయం మహేందర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version