వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు
మహదేవపూర్ జులై 12 (నేటి ధాత్రి )
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్

మహాదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున వికలాంగుల హక్కుల కోసం జిల్లా అధ్యక్షులు వంశి గౌడ్ రానున్న తరుణంలో మండలంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన మాటను మార్చిన క్రమంలో మరో పోరాటంలో సిద్ధం కావడానికి ఆ రోజున మండల కమిటీ నిర్మాణం చేసి వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులకు 4వేల పింఛన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో హాజరై మన సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల సమావేశాన్ని ఎన్నుకొని మనకోసం పోరాటం చేయాల్సిందిగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పిలుపునిస్తున్నాం అని బెల్లంపల్లి సురేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పేర్కొన్నారు వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వారికి అండగా దండగా ఉంటారని పిలుపునిచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version