ప్రజల అప్రమత్తంగా ఉండాలి..

ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిట్యాల మండలం అధికారులు, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు, బుధవారం రోజున నేటి ధాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో చిట్యాల మండలంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.. అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని .ప్రజలు భారీ వర్షాల వలన అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే పోలీసులకు , అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలు అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్…

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసి, నిమ్డ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జహీరాబాద్ నిజ్జా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1501 ఎకరాల భూమిని సేకరించి నిమ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మిగిలిన భూమిని కూడా త్వరలో నిమ్ కు అప్పగించాలని సూచించారు.

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం…

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి…

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్ …

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్

నిజాంపేట, నేటి ధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకువచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 గా ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందన్నారు. కార్యదర్శి శ్యామల, ఏపిఎం అశోక్, సీసీ రవీందర్, గుర్రాల మమత, బెల్లం లావణ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..

*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T130410.862.wav?_=1

 

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏ.ఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T121919.981.wav?_=2

 

 

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత

– శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం. హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T153147.271.wav?_=3

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…

#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..

#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T142657.332.wav?_=4

 

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం…

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం
* ఎంపీడీవో రవీంద్రనాథ్

మహాదేవపూర్ సెప్టెంబర్ 8 (నేటి ధాత్రి)

 

 

రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ సోమవారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ జాబితా, ముసాయిదా ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామారావు, వివిధ పార్టీల ప్రతినిధులు, సూపర్ ఇండెంట్ శ్రీధర్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం…

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ

 

 

 

బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T171900.110.wav?_=5

 

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని
అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన..

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

 

గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో సమస్యల పరిష్కార హామీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-83-1.wav?_=6

ప్రజావాణిలో ఐదుగురి సమస్యలు, తహసిల్దార్ హామీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రతీ సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కార్యక్రమంలో ఐదుగురు తమ సమస్యలను విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తిరుమల రావు హామీ ఇచ్చారు.అధికారులు
ఎంపిడిఓ మంజుల డిప్యూటీ ఎమ్మార్వో కరుణాకర్ రావు వ్యవసాయ అధికారి వెంకటేశం, ఆర్ఐ రామారావు, స్పెషల్ ఆఫీసర్, పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి, హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version