ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి…

ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి

మహాదేవపూర్నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలో
కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోడి.
రమేష్ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ కాళోజి నారాయణరావు కవిత్వంతో సాహిత్యంతో మాటల ప్రజలను చైతన్య పరిచారు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుక వినిపించేవారు పుట్టుక నీది చావు నీది మిగిలిన జీవితమంతా దేశానిది అదేవిధంగాఆకలి మంటలు ఒకచోట అన్నపురాసులు ఒకచోట అని ప్రజలని చైతన్యపరిచేవారు కాళోజి నారాయణరావు నా గొడవఅనే రచన ద్వారా అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుకను వినిపించేవారు ఈ విధమైన రచనలు రచించినందుకుగాను ప్రభుత్వం ఆయనను 1992 సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కరించారు కాలోజి నారాయణరావు ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని సమాజంలో పాలకులను తన కవిత్వం ద్వారా మాటల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమాజంలో జరిగే అన్యాయం పైన పోరాటాలు చేశారు అని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అబ్దుల్ గని,సమ్మయ్య సదాశివ్ . సదానందం,సంధ్య . శ్రీమతి శ్వేత . శ్రీమతి రమాదేవి. శ్రీనివాస్ మహేందర్,కర్ణ ప్రకాష,మహేష్ లైబ్రేరియన్ అనిల్ విద్యార్థిని విద్యార్థులు బోధన సిబ్బంది పాల్గొన్నారు

సామూహిక గా వందే మాతరం గీతాలాపన…

సామూహిక గా వందే మాతరం గీతాలాపన

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని ఆయన వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన గీతమని, స్వాతంత్ర్య సమరయోధులందరిలో ఉత్సాహానికి, శక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version