కోడ్‌ ఉన్నా బెల్ట్‌ జోరు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T122428.791.wav?_=1

కోడ్‌ ఉన్నా బెల్ట్‌ జోరు!

 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా జహీరాబాద్ నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్‌ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్‌ రూమ్‌, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్‌ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు. ఇప్పుడు యధేచ్ఛగా దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

◆:- విచ్చలవిడిగా బెల్టు షాపుల నిర్వహణ

◆:- గతంలో ఎలక్షన్‌ కోడ్‌ రాగానే ఉకుపాదం

◆:- నేడు పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం

◆:- బార్లను తలపిస్తున్న కిరాణా దుకాణాలు

◆:- బహిరంగంగానే మద్యం తరలింపు

◆:- బెల్టు షాపులు తీస్తేనే ప్రశాంత ఎన్నికలకు ఆసారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా జహీరాబాద్ ఝరాసంగం న్యాల్ కాల్ మొగుడంపల్లి కోహిర్ మండలాలలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్‌ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్‌ రూమ్‌, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్‌ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు. ఇప్పుడు యధేచ్ఛగా దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గల్లీకో బెల్టు దుకాణం..

సాధారణ సమయాల్లో గ్రామాలు, పట్టణాల్లో బెల్టు దుకాణాలు జోరుగా నడుస్తాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోదు. పైగా వైన్స్‌ యజమానులను పురమాయిస్తుంది. దీంతో గల్లీకో బెల్టు దుకాణం వెలిసింది. ఒకో గ్రామంలో 5 నుంచి 10 దుకాణాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 82 వైన్స్‌ ఉండగా, 2000 వరకు బెల్టు షాపులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఎన్నికల సమయంలో కోడ్‌ అమలులోకి రాగానే బెల్టు షాపులపై ఉకుపాదం మోపుతారు. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చి వారం దాటినా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో అప్పటి అధికారులు ఒక షాపు కూడా తెరవకుండా కఠిన చర్యలు తీసుకున్నారని చర్చించుకుంటున్నారు.

బహిరంగంగానే మద్యం తరలింపు

ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు అన్ని రకాల కార్యకలాపాలు ఎన్నికల సంఘం నియంత్రణలోకి వస్తాయి. రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్‌ చేసే అధికార యంత్రాంగం, బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతున్న ఎందుకు ఫోకస్‌ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోడ్‌ ఉండటంతో పరిమితంగా మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నారు.

బార్లను తలపిస్తున్న బెల్ట్‌ షాపులు

ఒకప్పుడు బెల్ట్‌ షాపులు గ్రామానికి ఒకటీ రెండు ఉండేవి. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న కిరణాషాపుల్లోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులకు తెలియదా..? లేక మామూలు సమయంలో లాగే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వైన్స్‌ ఓనర్లకు సహకరిస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ ధర అంటే క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.40, బీరుకు రూ.30 నుంచి రూ.50 అదనంగా బెల్ట్‌ షాపుల్లో వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పర్మిట్‌ రూమ్‌ల మాదిరి ఏర్పాట్లు చేస్తున్నారు. మందు, గ్లాసులు, వాటర్‌, స్టఫ్‌ కొనుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు.

బెల్టు దుకాణాలు తరలిస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు..

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం సేవించాకే అసలు పంచాయితీ షురూ అవుతుంది. అయితే వైన్స్‌ రాత్రి 10 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అంతా బెల్టు దుకాణాల హవానే కొనసాగుతుంది. పీకల్లోతు తాగాక.. తరచుగా గొడవలు చోటుచేసుకుంటాయి. ఇవి మీతిమిరితే ఘర్షణలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

అధికారుల కనుసన్నల్లోనే?

జహీరాబాద్ లో ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో బెల్టు షాపులు వెలిసినా ఎక్సైజ్‌ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారని, అన్నీ తెలిసి చర్యలు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది.. మరోవైపు మద్యం యజమానులు, బెల్ట్‌ షాపు నిర్వాహకులు, అధికారుల మధ్య ఒప్పందాలతోనే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారులు స్పందించి బెల్టు దందాను అడ్డుకోవాలని కోరుతున్నారు.

తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T125529.060.wav?_=2

 

 

తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ

జహీరాబాద్, నేటిధాత్రి:

ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, జూనే గావ్ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో ప్రజ ల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను అందజేశారు.

 

 

జిల్లపల్లి బోరేగావ్ ప్యాలరం గ్రామంలో షేర్లు వేయడం జరిగింది అమ్మ క్రీస్తు శేషులు అయిన జ్ఞాపకార్థం గ్రామాల్లోని పలు వీధుల్లో ప్రజ లు కూర్చునేందుకు ఈ బెంచీలను ఏర్పా టు చేశారు. తన తల్లి మాణెమ్మ జ్ఞాపకార్థం బెంచీలను ఏర్పాటు చేసినట్లు విజేం దర్ రెడ్డి తెలిపారు.

పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి…

పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి.

జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T140342.321.wav?_=3

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి

 

ఓదెల మండలం లోని ఓదెల, పోత్కపల్లి, మడక , కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి, కొలనూర్, గోపరపల్లి, హరిపురం, లంబాడి తండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, జీలకుంట, శానగొండ, రూపు నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, గూడెం, బాయమ్మపల్లి, భీమరపల్లి, ఉప్పరపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదనీ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ అని మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేటి నుండి 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కోలాటం,ఆట పాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆట పాటలతో పాడారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా…

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈరోజు గురువారం గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో
రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చర్ల పల్లి చింతల నుండి లద్దబండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి దాదాపు 11 సంవత్సరాల పూర్తి అయి డివిజన్ లు ఏర్పడి అన్ని డివిజల్ కార్యాలయాలు ఏర్పడినప్పటికి పంచాయతీ రాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ నుండి మాత్రం ఇప్పటి వరకు డి ఎల్ పి ఓ కార్యాలయం నేటికీ లేకపోవడం అందరికి విస్మయానికి గురించేస్తుంది.. సంబంధిత డి ఎల్ పి ఓ కి పెన్ గన్ న్యూస్ ప్రతినిధి వివరణ అడిగిన ఎమ్ పట్టనట్టు గా వేవహరిస్తుంది..

 

సంబంధిత అధికారి జహీరాబాద్ లో ఉండకపోవడం వలన గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడం వలన గ్రామాలలో చెత్త చెదారం పెరుకపోవడం,డంపింగ్ యార్డ్ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ లేకపోవడం, వైకుంఠ దామలు ఉపయోగంలోకి రాకపోవడం ఇలా ఎన్నో సమస్యలు గ్రామాలలో పేరుకుపోవడం వలన ప్రజలు అనారోగ్యలకు గురి కావడం జరుగుతుంది.. అంతే కాకుండా సంగారెడ్డి కి ఎంతో దూరంగా ఉన్న గ్రామలు అనేకం… రాయికోడ్ మండలంలోని పంపాడు, మరి కొన్ని గ్రామాల ప్రజలు, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలం లోని గ్రామాలు పూర్తిగా బీదర్ సరిహద్దులలో ఉండడం వలన సంబందించిన అధికారికి ఏమైనా సమస్య లు

 

చెప్పుకొందమన్న కార్యాలయం లేకపోవడం విడ్డురంగా ఉంది..డి ఎల్ పి ఓ కార్యాలయం లేకపోవడం పై సంబంధిత అధికారికి కొందరు ప్రజల ప్రశ్నించగా ఎవరికైన చెప్పుకోండి అని దాటావేయడం సరి కాదని ప్రజల కోరుకుంటున్నారు.

 

 

. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు స్థానికంగాo ఉండాలని నిబంధనలు ఉన్నపటికీ… ఈ అధికారికి మాత్రం అవిఏవి పట్టీపు లేన్నట్టు గా ఉండడం విడ్డురం గా ఉంది..ఇప్పటికైనా ఇలాంటి అధికారి పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసికొని,ప్రజలకు అందుబాటులో ఉండే అధికానిరి నియమించలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో. మొదట పది గంటల 30 నిమిషాలకు నేరెళ్ల.గ్రామంలో. తరువాత 12 గంటలకు సమయానికి జిల్లెల్ల. గ్రామంలో. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మండపల్లి లో . గ్రామంలోఈరోజు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక ద్వారా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో సైకిళ్ల పంపిణీ ప్రోగ్రామ్ జరిగింది.. ఇందులో నేరెళ్ల జిల్లెల్ల మండపల్లి గ్రామాలలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డి బోయిని గోపి హాజరై మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బండి సంజయ్ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ అంచలంచలుగా.ఎదుగుతూ కేంద్ర మంత్రిగా హోదాగా.పనిచేస్తూ పదవ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయాలని కృతనిశ్చయం.మోడీ గారి ఆశయాలతో ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో తన పార్లమెంట్ నియోజకవర్గంలో తను ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పిల్లలందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా సైకిలు కొనుగోలు చేయడం ఎంత తల్లిదండ్రులకు తెలుసునని దాని గురించిఈరోజు విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగిందని అటువంటిది కొందరి నాయకులు తమలబ్దికోసం పోరారడం.తప్ప ప్రజల బాగోబాగులు ఎప్పుడు పట్టించుకునే పాపాన పోలేదని అందులో భాగంగా ఎప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడదు తప్ప చేసే మంచి పనులు గుర్తుచేయరని ఇకనుండి అయినా విద్యార్థుల పట్ల ఆలోచన విధానం మార్చుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం వారికి సంబంధించి పుస్తకాలు గానీ పెన్సిల్ గాని బాటిల్స్ గాని మోడీ సహకారంతో కేంద్ర మంత్రి సహకారంతో అందించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పంపిణీ.చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమము మండల బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి.మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు…

గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు

మండల అధికారులు సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేసినప్పటికి మారని జీ.పి.అధికారుల పనితీరు

ప్రధాన సమస్యగా వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం లేదు.వర్షాలు కురుస్తున్న సందర్భంలో గ్రామాల్లో మురికి కాలువలలో పేరుకుపోయిన మురుగునీరు,ఎక్కడ చెత్త అక్కడే వదిలేసిన తీరు చూస్తే గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని చెప్పవచ్చు.భారీ వర్షాల కారణంగా గ్రామాలరోడ్లు బురదమయంతో నిండిపోయి మురికి కాలువలో మరియు నీరు లోతట్టు ప్రాంతాలలో నిలువఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తరులు జారీ చేసిన,మండల అధికారులు సమావేశలు పెట్టి ఆదేశాలు జారీచేసినప్పడికి కొన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలపై పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ సమయంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేషియా సీజనల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపిచెందే అవకాశలున్నాయి.వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిసినప్పటికి కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల మందు గాని స్ప్రే చేయడం నివారణ చర్యలు ఏమాత్రం చేపట్టలేదు.వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నిల్వవున్న నీటిని కాళీ చేసే చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రజలు పంచాయతీ సిబ్బంది పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీరు నిల్వ వల్ల ప్రాణంతకమైన దోమలు గుమిగుడుతున్నాయని కొంతమంది పంచాయతీ అధికారులు అయితే ప్రజలు తమ గోడు విన్నవించుకున్నప్పటికి కొన్ని నెలలుగా మాకు ఎలాంటి నిధులు రావడంలేదని మాట దాటేస్తున్నట్టు సమాచారం,అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తమ ప్రణాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

వెలగని విద్యుత్ దీపాలే ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.గ్రామాలలో ఎక్కడ చూసిన వెలగని విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.ఒక చోట ఉంటే ఇంకోచోట ఉండకపోవడం ఇలా అన్ని గ్రామాలలో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు.వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏదైనా అవసర నిమ్మిత్తం బయటకు వెళ్లాల్సివస్తే విషపురుగులు కాటేస్తాయేమో అనే భయంతోనే బయటకు వెళుతున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారు.మరికొన్ని చోట్ల అయితే రోడ్లకు ఇరువైపులా భారీగా చెట్లకొమ్మలు పెరిగి విద్యుత్ దీపాలకు అడ్డుగావచ్చి రాత్రికాల సమయంలో ప్రయాణించే వాహనదారులకు వెలుగులు లేక గుంతలు కనిపించక తమ ప్రయాణం ఒక నరకంగా వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

కాలం మారినా ఆ గ్రామాల్లో మారని సంప్రదాయం!

కాలం మారినా ఆ గ్రామాల్లో మారని సంప్రదాయం!

జహీరాబాద్ నేతి ధాత్రి:

జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా.. ఆధునికత ఎంతగా విస్తరించినా.. మన పూర్వీకుల విలువలు, సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో నేటికీ సజీవంగా ఉన్నాయి. తెలంగాణ – కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కంగ్టి, పిట్లం, బీదర్ (కర్ణాటక), నాందేడ్, దెగ్లూర్ (మహారాష్ట్ర) వంటి ప్రాంతాలు ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా నాగుల పంచమి అంటే పాములకు పూజలు చేసి, పుట్టలో పాలు పోయడం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ నాగులపంచమికి అత్యంత విశిష్టత ఉంది.
కాలం ఎలా మారినా, ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ సంప్రదాయాలకు పట్టం కడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ సోదరీమణులకు, మేనకోడళ్లకు, తోబుట్టువుల కూతుళ్లకు జాకెట్ బట్టలు, రెండు కుడకలు వంటి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఓ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అన్నదమ్ములు లేని పరిస్థితుల్లోనైనా, వారి పిల్లలకు బహుమతులు తీసుకెళ్లడం ద్వారా బంధాలను కాపాడుతున్నారు. ఇది కేవలం ఆచారంగా కాకుండా, బంధాలను బలపరిచే ఒక ఆదర్శంగా మారింది. ఆడపడుచుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, ఇంటి పరంపరలను గౌరవంగా నిలుపుతూ సాగుతున్న ఈ పండుగ గతాన్ని తలపెట్టి, భవిష్యత్తును నిర్మించేలా మారుతోంది. సాంకేతిక యుగంలోనూ ఈ సాంప్రదాయ ధారలు మరింత శక్తివంతంగా ముందుకు సాగుతున్నాయి.

పలు గ్రామాల్లో కేటీ రామారావు జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో కేటీ రామారావు జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-96.wav?_=4

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి.కేటీ రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా. మండలంలో పలు గ్రామాలలో. దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి. స్వామి వారి ఆశీస్సులు తీసుకొని. కేటీ రామారావు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని పలుదేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మండలంలో. బద్దెనపల్లి గ్రామంలో కేటీ రామారావు జన్మదిన రోజు సందర్భంగా పలువురు మహిళలకు కెసిఆర్ కిట్లు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో కెసిఆర్ కిట్లు తీసుకున్న వారిలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజ భీంకర్.రాజన్న. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. మాజీ సర్పంచ్ రవి.పాక్స్. వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. మహిళ నాయకురాలు. సిలువేరి చిరంజీవి.టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

◆: కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

◆: సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు సోకె అవకాశం

◆: పంచాయతీల్లో నిధులు లేక అనేక అవస్థలు

◆: పారిశుధ్యాన్ని పాటించక చేతులెత్తేస్తున్న కార్యదర్శులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మండలంలోని 35 గ్రామపంచాయతీలలో వివిధ గ్రామాలలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య కార్మికులు పనిచేయడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత తన జేబులో డబ్బులు ఇచ్చి డీజిల్ కి చిన్నచిన్న రిపేర్లకు వారి జీతంలో నుండి పెట్టుబడి పెడుతున్నామని వాపోతున్నారు. గ్రామపంచాయ తీలో నిధులు లేక ఇబ్బందులతో పనులను చేయలేక పోతున్నామన్నారు. ఇప్పటివరకు 35 గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామపంచాయతీలలో సపాయి కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది పనిచేయకుండా జీతాలు అడుగుతున్నారని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ లేక మేము ఏమి చేయలేకపోతున్నాము ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలరని అధికారులు పంచాయతీ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి మండలం లోని గ్రామంలోని 35 గ్రామపంచాయతీలో గల పారిశుధ్య పనులు చక్కబెట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ప్రత్యేక అధికా రులను నియమించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.

ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు.

ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు

ఏడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చేకూర్తీ శ్రీనివాస్

సూరారం గ్రామ శాఖ అద్యక్షులు అయిల్ల అశోక్

బెల్లంపల్లి సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండల ఇన్చార్జి అంబల చంద్రమౌళి ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో మండలంలో రెండు గ్రామాలకు నూతన గ్రామ కమిటీ వేయడం జరిగింది ఎడపల్లీ
గ్రామ శాఖ అధ్యక్షులుగా చేకుర్తి. సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ఎన్నికైనారు అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది
శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా చేకుర్తి రాజ లింగయ్య కార్యదర్శి చేకూర్తి రాజబాబు ప్రధాన కార్యదర్శి చేకుర్తి రాజయ్య కోశాధికారి ఆయిల్ల మహేష్ సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి మండపల్లి విష్ణు కార్యదర్శి మీసాల సాంబం కోశాధికారి జిల్లెల అజయ్ ప్రచార కార్యదర్శి జిల్లేల రాజు వీరిని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జులై 7న ఊరు ఊరులో దండోరా జెండా ఎగురవేసి సంబరాలు చేసుకోవాలని సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని కూడా జరుపుకోవాలని ఏబిసిడి వర్గీకరణ సాధించి పద్మశ్రీ అవార్డు తీసుకున్న మందకృష్ణ మాదిగ అని బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు ఈ గ్రామాల ఎన్నిక కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆయిల సమ్మ య్య తోటచర్ల దుర్గయ్య జిల్లెల్ల నాగరాజు చింతకుంట్ల రాము చింతకుంట సదానందం చేకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

గ్రామాల్లోపట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం.

గ్రామాల్లో పట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం…

తమకు సోకుతాయేమో అని భయందోళనలో ప్రజలు

పరకాల నేటిధాత్రి:

 

shine junior college

పట్టణ,మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలకు ఫంగస్ వచ్చి, వింత రోగాలు,చర్మ వ్యాధులతో విచ్చలవిడిగా వీదులల్లో తిరుగుతున్నాయి.కుక్కులకు అంతుచిక్కని వింతరోగాలతో శరీరాలపైన వెంట్రుకలు ఊడిపోయి,చర్మం పగుళ్ళు ఏర్పడి రక్తాలు కారుతు చర్మ వ్యాధులతో ఇటు పట్టణంతో పాటు గ్రామాలలో సంచరిస్తున్నాయి.చాలా వరకు కుక్కలు చర్మం తోలు ఊడిపోయి భయంకరంగా కొన్ని సినిమాలల్లో చూపించిన విధంగా గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.కుక్కలకు ఏదో వైరస్ సోకి అది వ్యాధిగా మారి ప్రజలకు సోకుతుందేమోనని గ్రామాల మరియు పట్టణాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.చదువు నిమిత్తం పాఠశాలకు,కళాశాలకు వెళ్లే పిల్లలను కరిచి గాయపరిచే ప్రమాదం ఉందని అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న కుక్కల బారి నుండి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు

-బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు
మొగులపల్లి నేటి ధాత్రి:

 

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కళకళలాడిన గ్రామపంచాయతీలు..ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు ఆరోపించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాలక వర్గాలు లేక పాలన పడకేసిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువై గ్రామాలు సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో..నిర్వహణ భారం మోయలేక పంచాయతీ కార్యదర్శులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ట్రాక్టర్లను కొనుగోలు చేయించిందని, పారిశుద్ధ్య నిర్వహణకు, ఇతర పనులకు వాహనం తప్పనిసరి కావడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులకు తప్పడం లేదన్నారు. రుణం పై వాహనాలను కొనుగోలు చేయడంతో..ప్రతి మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో డీజిల్ కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సిబ్బంది తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధులు రాకపోవడం..వసూలు చేసిన పన్నులు సరిపోకపోవడంతో పారిశుద్ధ్య, మంచినీటి నిర్వహణ, ట్రాక్టర్ ఇతర వాటికోసం తప్పనిసరిగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు తనతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారని, ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో..బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన డబ్బులను ఎలా తీసుకోవాలన్న ఆందోళన కార్యదర్శుల్లో నెలకొందన్నారు.

ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెళ్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడారు .భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజల చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనం ను ఎదుర్కోని పట్టుదలతో భవిష్యత్తు తరాల ప్రజల కోసం సమాన హక్కులను కల్పిస్తూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు ఓటు హక్కును కల్పించారన్నారు. పల్లెల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను ఆలోచనలు ప్రజలకు తెలియ పరువాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల కోశాధికారి కనకం తిరుపతి జిల్లా నాయకులు బండార్ రాజు, దొమ్మటి ఓదెలు, బొచ్చు నరసయ్య, సంపత్, సదానందం, భూమి రెడ్డి, సుమంత్, తదితరులు పాల్గొన్నారు

గ్రామాల అభివృద్ధి చేశాం బిల్లులు విడుదల చేయాలి.

గ్రామాల అభివృద్ధి చేశాం… బిల్లులు విడుదల చేయాలి.

◆- అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాజా మాజీ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం..

ధరణితో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన భూ చట్టం.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

1971-72 సంవత్సరంలో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పట్టాలు ఇచ్చినాం.2005 లో మరిన్ని భూ సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సాదాబైనామ ద్వారా భూ చట్టాల ప్రకారం రైతులకు పాస్ బుక్ లు ఇచ్చింది.గత ప్రభుత్వం కొత్త చట్టం చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు సరైన న్యాయం హక్కులు కలుగలేదు.ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుండి పూర్తి స్థాయిలో భూముల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది నిపుణులతో అధ్యయనం చేసి నూతన భూ భారతి చట్టాన్ని రూపొందించిందని దీంతో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దదానికి ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంతో అమల్లోకి తెచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా భూ భారతి చట్టం పట్ల నర్సంపేట మండలంలోని రైతులకు రెవెన్యూ శాఖ,వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.ముందుగా వరంగల్ రోడ్డు కూడలి నుండి రైతు వేదిక వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన కొద్ది రోజులకే పూర్తిస్థాయిలో గ్రామస్థాయి నుండి అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం 90 రోజుల సమగ్ర సర్వే జరిపామన్నారు.ధరణి ఫోర్టర్ లో రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని సర్వేలో తేలిందని పేర్కొన్నారు.అందరికీ సరైన న్యాయం జరిగేందుకు గాను నిపుణులతో తయారుచేసి భూ భారతి చట్టం రూపాంతరం చెందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఫోర్టల్ తో భూ చట్టం 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని ఆరోపించారు.నర్సంపేట మండలంలో 17 వేల ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 14600 ఎకరాలకు భూమి పట్టాలు ఇచ్చామని, నేపపద్యంలో మరో మూడు వేల పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని కాగా ప్రస్తుతం 4 వేల దరఖాస్తులు వచ్చాయి.ఈ భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను అవలీలగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భూముల పట్ల గ్రామాల సమస్యలను గ్రామాల్లోనే సదస్సులు నిర్వహించి పరిశీలన చేసి అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తామని వివరించారు. 80 శాతం భూ సమస్యలు మండల స్థాయి ఎమ్మార్వో వద్ద పరిష్కారం అవుతాయని లేని యెడల ఆర్డీఓ,లేక కలెక్టర్ వద్ద తప్పనిసరిగా పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భూ భారతి చట్టం వలన భూముల సమస్యలు భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు వివరించారు.

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంలో రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి మొత్తం 23 సెక్షన్స్ ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.మొత్తం 23 సెక్షన్ల భూ భారతి నూతన చట్టంపై
రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉన్న భూ చట్టం వలన రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా ఉండేందుకు గాను భూ భారతి చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు.భూమి అనేది ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైనది. దానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఎలాంటి భూముల సమస్యలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెంట్ తో పెట్టిన చాట్ బాట్ ద్వారా సమస్య అవలీలగా పని పూర్తి అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్,ఏఈఓలు అశోక్ కుమార్, శ్యాం కుమార్, టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణోతు లక్ష్మణ్ నాయక్,మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్,నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేందర్,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం..నిలుస్తాం

బిసా రమేష్,తాళ్ళ రవి ముదిరాజ్

నేటిధాత్రి:

ముదిరాజ్ ల జాతి అభివృద్ధి కోసం విద్యా,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా అడుగులు వేద్దామని అవిశ్రాంతంగా ముదిరాజ్ కుల బంధువుల అభ్యున్నతికి పాటుపడుతున్న మెపాకు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజికతలో ముదిరాజ్ ల వెనుకబడి ఉన్నారని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మెపా చేస్తున్న ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుగా అన్ని రంగాలలో ముదిరాజ్ లు రాణించేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మెపా అభివృద్ధికి విస్తరణకు మూలాలలోకి వెళ్తూ గ్రామ గ్రామాన కలిస్తే గెలుస్తాం.. నిలుస్తాం అని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసా రమేష్ ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ ముదిరాజ్ లకు చైతన్య కార్యక్రమాలు,విద్యతో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి ముదిరాజ్ యువత విద్య,ఉద్యోగ అవకాశాల వైపు రాజకీయ సాధికారతవైపు అడుగులు వేసేందుకు ముదిరాజ్ లు ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయిలో కలిసికట్టుగా సహకరిద్దామని తెలియజేశారు.

పల్లెల్లో పడకేసిన……!

పల్లెల్లో పడకేసిన……!

ప్రత్యేకాధికారుల పాలన.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం ముగి సిన తర్వాత పంచాయతీల పాలనను నిర్వహించేందుకు ప్రభుత్వం నియమిం చిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించకపోవడం, పాలన ఆస్తవ్యస్థంగా మారడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల, డివిజన్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీ బాధ్యతలు అప్పగిం చగా, వారి ఇప్పటి పనిభారం కారణంగా గ్రామాల పరిస్థితులను పరిశీలించేం దుకు ఉదాసీనత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేకాధికారులు గ్రామా లకు రాకపోవడం గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లేకుండాపోతోంది.

 

Solving the problems

ఝరసంగం మండల కేందంలోని 8వ వార్డులో మురుగు కాలువలో చెత్త చెదారం పేరుకుపోవడంతో నీరు ప్రవహించడం లేదు. ఒక కాల నిలో నెలల తరబడి మురుగు నీరు నిలిచి చిన్న కుంటా తలపిస్తోంది. దీనివల్ల దుర్వాసన వ్యాపిస్తోంది మరియు పందులు స్వైరంగా తిరుగుతున్నాయి. ఝద సంగం, కుప్పానగర్ గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా అడ వుల్లో పారచడం జరుగుతోంది, దీనివల్ల ముగజీవులు ప్లాస్టిక్ కవర్లను తింటు న్నాయి. కాలువల్లో మురుగు పేరుకుపోవడం, కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, దోమలు విజృంభించడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్యులు పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల నిర్లక్ష్యం గ్రామాల పరిస్థితిని దిగజార్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కోసం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని లేదా ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో డిఎల్పిఓ అమృతను సంప్రదించగా, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.

పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని గ్రామ ప్రజలకు,ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు చలివేంద్ర కేంద్రాలను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు.ప్రజలకి కాకుండా పశువులకు,పక్షులకు కూడా ప్రజలు తమతమ నివాసాలలలో ధాన్యాన్ని నీళ్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version