ధాన్యం కొనుగోలు వివరాలు .

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీవో ఇతర అధికారులతో కలిసి
కలెక్టర్ పరిశీలించారు.

Grain

ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు . ఐకేపీ, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్. సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, ఆద్వర్యంలో ఇప్పటి దాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 28కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సుశీల్వా, కొల్చారం మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి :

 

బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇందారం గోదావరి ఇసుక.!

ఇందారం గోదావరి ఇసుక రిచ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల ప్రజలు తమ అవసరాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.అలాగే ఈ అవకాశాన్ని ఎవరైనా అదునుగా చేసుకొని అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జగన్ మోహన్ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,ట్రాక్టర్ యజమానులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లెవల్ వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతి.

కోడవటంచ లో కిన్నెరసాని వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గురువారం గుండాల మండల భూభారతి అవగాహన సదస్సుకు వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు కొడవటంచ గ్రామ ప్రజలు కిన్నెరసాని లో లెవెల్ వంతెన పై ఐలెవల్ వంతెన నిర్మించాలని, కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మొలకల వాగుపై ఇసుక మేటలు తొలగించాలని, కొడవటంచ గ్రామంలో అంతర్గత రోడ్లకు సిసి రోడ్లు శాంక్షన్ చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు, పర్షిక రవి, మాట్లాడుతూ కోడవటంచ ,నాగారం ,పాలగూడెం ప్రజలకు వర్షాకాలం వస్తుందంటే కునుకు నిద్ర లేకుండా పోతుందని ఎప్పుడూ కిన్నెరసాని వాగు వస్తుందో అని భయంతో కునుకు తీస్తున్నారని ఈ బాధలను జిల్లా కలెక్టర్ అర్థం చేసుకుని కొడవటంచ కిన్నెరసాని ఏడు మేలకాల వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
అట్లాగే కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మేలుకల చెక్ డ్యామ్ పై వేసిన ఇసుకమేటలను తొలగించి కొడవటంచ, నాగారం ,పాలగూడెం గ్రామ ప్రజలకు సాగునీరు అందించాలని, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, ఈసం మల్లయ్య, వజ్జమంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన.!

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలన,కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి సెంటర్ తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని పెద్ద ఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రాం చ్ పనులను పరిశీలించారు.

Collector

అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు,పని వేళలు,తదితరాల విషయాలను అడుగుతూ, వారితో హాయిగా ముచ్చటిస్తూ, స్ఫూర్తిని కలిగించారు.ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ ఈ కూలీ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు లేబర్ ను మొబలైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.ఈ మూడు నెలలు అత్యంత కీలకమని చెప్పారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ పర్వతాపూర్ గ్రామంలో 160 మంది ఈ కూలీ పనులు చేస్తున్నారన్నారు.ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని అన్నారు. 5 మీటర్స్ పొడవు 1 మీటర్ వెడల్పు , 0.5 మీటర్ లోతు పనులు చేస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.కొలతల్లో వ్యత్యాసం రావొద్దని, సామాజిక తనిఖీల్లో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.స్వయంగ అక్కడ తీసిన ట్రెంచ్ ల కొలతలు టేప్ తో కొలచి సంతృప్తి వ్యక్తం చేశారు.వేజ్ పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని అన్నారు.

Collector

 

వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా తాగునీరు,నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.శరీరం నిర్జలీకరణ డీ హైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తేజితులయ్యేందుకు గాను ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు.కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల మేధస్సును పాటలు పద్యల రూపంలో పరీక్షించి అంగన్వాడీ పనితీరు పట్ల ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):

 

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్.

రేషన్ డీలర్లు సన్న బియ్యం లో దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్

తహసిల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి

వనపర్తి నేటిదాత్రి :వనపర్తి

 

 

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులు వస్తే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. తాసిల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని, దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు.
అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MPDOకార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్.

ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించడం జరిగినది.ఈ సందర్శనలో భాగంగా రాజీవ్ యువ వికాసము పథకంలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించినచో వాటిని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి చేసి ఆన్లైన్ చేయవలసినదిగా,ఇప్పటికే ఆన్లైన్ చేసినచో ఆ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు.కార్యలయమునకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు చేసి తదుపరి కార్యాచరణకు సిద్ధముగా ఉంచవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంఈఓ శ్రీపతి బాబురావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న.

కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న రాసమళ్ళ కృష్ణ

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లాలోని కేఎంసి మరియు టిబి ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసినందుకుగాను పరకాల మండలంలోని మళ్ళక్కపేట గ్రామానికి చెందిన రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణకి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అభినందిస్తూ ఉత్తమ సర్వీస్ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య,లలిత దేవి తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ సస్పెండ్

తహసీల్దార్ సస్పెండ్

“నేటిధాత్రి”, బీబీనగర్.

బీబీనగర్ తహశీల్దార్ ను సస్పెండ్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్స్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు

రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య.!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారుల చొరవ

25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మార్చి 31లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి(మెదక్):

Collector

అనధికార లే అవుట్ ప్లాట్లు, అనధికార లే అవుట్ లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31, 2025 లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ.. ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ * తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 22,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని, హౌస్ ఓనర్స్ కి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని వివరించారు.

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు.

ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాలు కొరకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా మునిసిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఫోన్ కాల్ చేసి ఈ నెల 31లోపు.. 25 శాతం రాయితీని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సేవలను పొందవచ్చునని, మార్చి 31 లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం నంబర్ 9154293341, .అలాగే రామాయంపేట పురపాలక సహాయ కేంద్రం నంబర్ 9963290800 లలో సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ

* సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే(IPS), ఈరోజు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version