బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి…

బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి

పంచాయితీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారు

ఇప్పటికైనా గత బకాయిలు విడుదల చేసి వారిని ఆదుకోవాలి

లేని పక్షంలో జిల్లాలోని మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి / సిఎస్ఆర్ నిధుల నుండి

బతుకమ్మ ఏర్పాట్లకు నిధులు ఇవ్వాలి

గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, పి ఎ సి ఎస్ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం తెలంగాణలో ఆడబిడ్డలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ, మరియు దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పరిశుద్ధ పనులు, ఇతర పనులు చేయించలేక కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గత బకాయిలు చెల్లించి కార్యదర్శులను ఆదుకోవాలని గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, గణపురం సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ పంచాయతీ కార్యదర్శుల పట్ల అనవసర భారం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, పని భారంతో అప్పుల బాధతో కొందరు కార్యదర్శులు చనిపోతున్నారని ఇప్పటికైనా వస్తున్న బతుకమ్మ దసరా పండుగ లను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేయాలని, ఇప్పటివరకు కార్యదర్శులు ఖర్చుపెట్టిన మొత్తం డబ్బులను అందించాలని కార్యదర్శుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం తో వ్యవహారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, జిల్లా కలెక్టర్ మంచి మనస్సుతో స్పందించి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు జిల్లా మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి/ సి ఎస్ ఆర్ నిధుల నుండి డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
పండుగ వేళ కార్యదర్శులు అప్పుల పాలు కాకుండా చూడాలని అన్నారుఅలాగే గ్రామాల్లో గ్రామ పంచాయితీ సిబ్బందికి కూడా పండగ పూట ప్రభుత్వం అండగా ఉండాలని పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన…

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి

వనపర్తి నేటిదాత్రి .

రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక ,శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నాడు వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల పర్యటి oచారు చిన్నదగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వర్షం పడిన ప్రతిసారీ పాఠశాల భవనం కురుస్తుందని, భవనం శిథిలావస్థకు చేరిందని కొత్తగా మంజూరు అయి నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి పాఠశాల నిర్మాణానికి 96 లక్షలు మంజూరు చేస్తే గత నాలుగు సంవత్సరాల నుండి పూర్తి చేయకుండా మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి కొత్తగా టెండర్ పిలవాలని పంచాయతీ రాజ్ ఎస్ ఈ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. రేపే కొత్తగా టెండరు పిలిచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు ఇప్పటికే మంజూరు అయిన 96 లక్షల నిధులను అదనంగా మరో 50 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలకు అన్నిమౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు
గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్థులు మంత్రి వెంట ఉన్నారు

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

షీట్ షెడ్ నిర్మాణానికి రూ.175 కోట్లు నిధులు మంజూరు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, గాల్వాలూమ్ షీట్ రూఫింగ్‌తో కూడిన కవర్‌డ్ షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులను ఈరోజు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నూతన కవర్ షెడ్ నిర్మాణం ద్వారా రైతులకు వర్షాలు, ఎండల సమయంలో కూడా మద్దతు ధరపై ధాన్యం అమ్మే అవకాశాలు మెరుగవుతాయని మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో వృద్ధి చెందుతున్న వ్యవసాయ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్, కార్యవర్గం సభ్యులు,రైతులు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version