పాఠశాలకు దాతల సహకారం.

పాఠశాలకు దాతల సహకారం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మండల పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు చాల్కి గ్రామానికి చెందిన రమేష్ స్వామి, పరశురాం దాతలుగా నిలిచారు. పాఠశాలలో అవసరాలకై రమేష్ ఆటవస్తువుల కోసం రూ. 10,000 శుక్రవారం అందించారు. స్వామి, పరశురాం కలిసి పాఠశాలలో గల 93 మంది విద్యార్థులకు టై, బాడ్జిలు అందించారు.

హమాలీ కాలనీ పెద్దమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాలు.

హమాలీ కాలనీ పెద్దమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలీ కాలనీ లో శనివారం బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెద్దమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు బోనాలు నిర్వహించడం జరుగుతుందని మహిళ లు సమయానికి బోనాల తీసుకొని రాగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదలు పొందగలరని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పరిశ్రమ యంత్రాలను తరలిస్తే ఊరుకోం

పరిశ్రమ యంత్రాలను తరలిస్తే ఊరుకోం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదివారం ఉదయం గేటు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాత్రింపగలు పరిశ్రమ గేటు ముందు నెల రోజుల నుండి నిరసన చేస్తున్న యాజమాన్యం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా యంత్రాలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

వివిధ శుభ కార్యాలలో పాల్గొన్న సీ డి సీ మాజీ చైర్మన్

వివిధ శుభ కార్యాలలో పాల్గొన్న సీ డి సీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలలో జరిగిన వివిధ శుభకార్యాలు జన్మదిన వేడుకలు, నూతన గృహప్రవేశం మరియు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన సీ డి సీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ వారితోపాటు ,మాజీ.మండల అధ్యక్షులు విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ బాబా సుభాష్ రావ్, సంజీవ్, శ్రీనివాస్ రెడ్డి విజయ్ పాటిల్ బస్వరాజ్, సంగమేష్,విలాస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు.

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త పోలీస్ స్టేషన్ లకు పోలీసు శాఖ ప్రతిపాదనలు శనివారం పంపించింది.
కొత్త మండలాలైనా చౌటకూర్ నిజాంపేటలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పేర్కొన్నారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అమిన్ పూర్, జహీరాబాద్ లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ కార్యాలయం ప్రతిపాదనలు చేసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version