సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా.

సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా

25వ వార్డులో రోడ్డుకు అడ్డంగా తీసిన కాలువను పూడ్చాలి

సిపిఐ పార్టీ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక కారల్ మార్క్స్ కాలనీ 25 వార్డులో ఉన్న సింగరేణి స్కూల్ 6వ గని మధ్యలో ఉన్న రోడ్డుకు అడ్డంగా సింగరేణి యాజమాన్యం తీసిన కాలువను వెంటనే పూడ్చాలని 25వ వార్డు కాలనీవాసులు జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొని సంఘీభావం తెలిపి అనంతరం జిఎం పర్సనల్ మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నుండి కాలనీ ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని అర్ధాంతరంగా మూసివేయడం తగదని అన్నారు స్కూలుకు వెళ్లే పిల్లలకు 6 ఇంక్లైన్ గణికి వెళ్లే కార్మికులకు.. అదేవిధంగా కాలనీ వాసుల కోసం నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ కి అనేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని ఏదో స్టాకు చూపి మూసివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.. గత కొన్ని సంవత్సరాలుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలన్నారు.. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ రోడ్డులో గత స్పీకర్ సిసి రోడ్ వేయించడం జరిగింది అన్నారు అప్పటినుండి ఆ రోడ్డుపై నిత్యం వందలాదిమంది ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు.. రోడ్డుకిరువైపులా చెట్లు ఉండడం మూలాన.. ఆ చెట్టు గుబురుగా పెరగడం జరిగిందన్నారు.. దాన్ని పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాన్ని పరిశుభ్రం చేయకుండా చెత్త చెదారం తొలగించకుండా ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న రోడ్డును అర్ధాంతరంగా మూసివేయడం అన్యాయం అన్నారు.. ప్రజల సౌకర్యం కోసం పాటుపడాల్సిన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఏంటని అన్నారు వెంటనే సింగరేణి యాజమాన్యం ఆ గుంతను పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version