రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన సింగరేణి సంక్షేమ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

కాకతీయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజన్లో రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్, ఏరియా లైజన్ ఆఫీసర్, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పర్సనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వారి బృందంతో పాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు భాస్కర రావు జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు కార్యనిర్వాహక అధ్యక్షులు పంతుల ఏరియా అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొని, ఆర్జి-1 ఏరియా, ఆర్జి-2 ఏరియా, బెల్లంపల్లి ఏరియా, మందమర్రి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్ టీ పీపీ ఈ 5 ఏరియాల్లో ఉన్నటువంటి రోస్టర్ రిజిస్టర్ పుస్తకాలను తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు
ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అన్ని పోస్టుల వివరాలను ఏరియా పర్సనల్ మేనేజర్ ద్వారా కాపీలను తీసుకోవడం జరిగింది ఏరియాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి,
ఆర్జి -1 ఏరియా, – 66 ఆర్జి-2 ఏరియా, – 31
ఆర్జి- 3 ఏరియా. -48
బెల్లంపల్లి ఏరియా – 11
మందమర్రి ఏరియా – 31
శ్రీరాంపూర్ ఏరియా. -92
ఎస్ టి పిపి- 03
భూపాలపల్లి ఏరియా – 33
ఎన్ సి డబ్ల్యూ ఏ
క్యాడర్లలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను పైన తెలిపిన విధంగా ఏరియాలో గిరిజనుల పోస్ట్లు భర్తీ కాకుండా ఉన్నాయని తెలియజేస్తున్నాము వాటిని భర్తీ చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ కి తెలియజేయడం జరిగింది వాటిని భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వారు అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కావున ఏరియాలో ఉన్న జరిగిన ఉద్యోగస్తులు గమనించగలరు కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా అధ్యక్షులు మోహన్ సెక్రటరీ హేమ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రాములు, జాయింట్ సెక్రెటరీ రాజు నాయక్ సిహెచ్ వెంకన్న జి అనిల్ లక్ష్మణ్ మోతిలాల్ పాల్గొన్నారు

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

ఒదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ఎమ్మార్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు Diet కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం యం ఈ ఓ వై.రమేష్ ఆధ్వర్యం లో జరిగింది.
ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు అఖిల మరియు అమూల్య ల చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది. ఇందులో భాగంగా U-Dise లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్, ఫర్నిచర్,క్రీడ స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, Kitchen Garden, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది.ఈ వివరాలను సేకరించడం లో డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులను, మరియు సీ ఆర్ పి లను యం ఈ ఓ సమన్వయ పరిచారు. సమావేశంలో శిక్షణ ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో complex ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య ,యం లక్ష్మీనారాయణ కేజీవీబీ ఓదెల ఎస్ఓకే జ్యోతి, యుపిఎస్ హరిపురం మహేందర్ రెడ్డి, రమేష్, సిపిఎస్ ఓదెల నాగరాజు, ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది ఎం ఐ ఎస్ డి వెంకటేష్, సి సి ఓ ఎల్ కుమార్, సి అర్ పి టి ఓంకార్ బి రజిత ఈ రాజేందర్ టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version